ఒక్క సారి ఛార్జ్ చేస్తే ఆగకుండా 1000కిమీ జర్నీ.. దీపావళి కానుకగా దిగుతున్న బ్రహ్మాస్త్రం
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలకు ఉన్న క్రేజ్ రోజురోజుకూ భారీగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ దిగ్గజ సంస్థ జేఎస్డబ్ల్యూ మోటార్స్ (JSW Motors) ప్రసిద్ధ చైనీస్ కార్ల తయారీ సంస్థ చెరీ (Chery)తో చేతులు కలిపింది. ఈ క్రేజీ భాగస్వామ్యంలో వస్తున్న మొట్టమొదటి సరికొత్త ప్రీమియం ఎస్యూవీ కారు జెటూర్ టీ2 (Jetour T2) భారత మార్కెట్లో అడుగుపెట్టేందుకు ముస్తాబవుతోంది.
ఈ కారును రాబోయే 2026 దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని భారతీయ కస్టమర్ల ముందుకు తీసుకురానున్నారు. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే.. ఇది ఒక ప్రీమియం ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) మోడల్. 5-సీటర్ కాన్ఫిగరేషన్తో వస్తున్న ఈ లగ్జరీ కారును మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో కొత్తగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ ప్లాంట్లో అసెంబుల్ చేయనున్నారు.

ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో ఈ ఎస్యూవీ మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లతో అమ్ముడవుతోంది. అయితే భారతీయ మార్కెట్ కోసం జేఎస్డబ్ల్యూ మోటార్స్ దీనిని కేవలం హైబ్రిడ్ వెర్షన్లో మాత్రమే లాంచ్ చేయాలని నిర్ణయించింది. ఈ కారులో 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, దీనికి డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్లు జతచేయబడ్డాయి.
అంతేకాకుండా ఇందులో 26.7kWh సామర్థ్యం గల ఎల్ఎఫ్పీ (LFP) బ్యాటరీ ప్యాక్ను అమర్చారు. ఈ మొత్తం పవర్ట్రైన్ సిస్టమ్ కలిసి ఏకంగా 381bhp గరిష్ట పవర్ను, 610Nm టార్క్ను జనరేట్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఈ కారు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కేవలం 7 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల ఈ కారు గరిష్ట వేగం గంటకు 197 కిలోమీటర్లుగా ఉంది.

సాధారణంగా మైలేజ్, రేంజ్ విషయంలో రాజీపడకూడదనుకునే వారికి జెటూర్ టీ2 ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది. ఈ ఎస్యూవీని కేవలం ఎలక్ట్రిక్ మోడ్లో మాత్రమే నడిపితే సుమారు 139 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అదే పెట్రోల్, బ్యాటరీ పవర్ రెండింటినీ కలిపి ఉపయోగిస్తే (హైబ్రిడ్ మోడ్లో) ఏకంగా 1,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
చార్జింగ్ విషయానికి వస్తే, దీని బ్యాటరీ ఏసీ (AC), డీసీ (DC) ఫాస్ట్ చార్జర్లను సపోర్ట్ చేస్తుంది. సాధారణ హోమ్ ఏసీ చార్జర్ ద్వారా కేవలం 4 గంటల లోపే బ్యాటరీని 30 శాతం నుంచి 100 శాతానికి చార్జ్ చేసుకోవచ్చు. అదే డీసీ ఫాస్ట్ చార్జర్ వాడితే కేవలం 30 నిమిషాల్లోనే 30 నుంచి 80 శాతం వరకు చార్జ్ పూర్తవుతుంది.

ప్రీమియం ఎస్యూవీగా వస్తున్న జెటూర్ టీ2 లో ఫీచర్లకు కొదవే లేదు. ఈ కారు లోపల ఏకంగా 15.6 ఇంచుల అతిపెద్ద టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను అమర్చారు. డ్రైవర్ సమాచారం కోసం 10.25 ఇంచుల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లు, సోనీ బ్రాండ్కు చెందిన లగ్జరీ ఆడియో సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి విలాసవంతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఇక ప్రయాణీకుల రక్షణ కోసం మల్టిపుల్ ఎయిర్బ్యాగ్లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) లభిస్తాయి. వీటికి తోడు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్ కింద లేన్ కీప్ అసిస్ట్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి అత్యుత్తమ భద్రతా ఫీచర్లు ఈ కారులో అందుబాటులో ఉన్నాయి.
జెటూర్ టీ2 ఎస్యూవీ పండుగ సీజన్ నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉండగా, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 35 లక్షల నుంచి రూ. 45 లక్షల మధ్య ఉండవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. ప్రస్తుతం భారత మార్కెట్లో ఈ తరహా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సెగ్మెంట్లో దీనికి నేరుగా పోటీ ఇచ్చే కార్లు ఏవీ లేవు. అయినప్పటికీ, దీని ధర ఆధారంగా మార్కెట్లోని ప్రముఖ ప్రీమియం ఎస్యూవీలైన మహీంద్రా XUV 7XO, టాటా సఫారీ, స్కోడా కోడియాక్, జీప్ మెరిడియన్, ఫోక్స్వ్యాగన్ టైగూన్ వంటి పాపులర్ మోడళ్లకు ఈ కారు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications