చిన్న కుటుంబానికి చింత లేని కారు.. కేవలం రూ. 3.70 లక్షలు, 33.40 కి.మీ మైలేజ్
భారతదేశంలో తక్కువ ధరలో కొత్త కారు కొనాలనుకునే వారి కోసం ఎప్పటికప్పుడు ముందుగా గుర్తుకు వచ్చే పేరు మారుతి సుజుకి ఆల్టో కె10 (Maruti Suzuki Alto K10). సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే ధర, తక్కువ నిర్వహణ ఖర్చులు, మంచి మైలేజ్ ఇవి కలిపి ఈ చిన్న హ్యాచ్బ్యాక్ను దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా నిలబెట్టాయి. ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో, 2025-26 ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు) సంబంధించిన అమ్మకాల గణాంకాలు బయటకు రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కాలంలో మొత్తం 93,740 యూనిట్ల మారుతి సుజుకి ఆల్టో కె10 కార్లు అమ్ముడయ్యాయి.
మొదటి చూపులో ఇది పెద్ద సంఖ్యలా అనిపించినా, గత ఆర్థిక సంవత్సరం 2024-25తో పోలిస్తే 8 శాతం తగ్గుదల కావడం గమనించదగ్గ విషయం. అంటే, ఒకప్పుడు నిరంతరం స్థిరమైన అమ్మకాలతో ముందుకు సాగిన ఆల్టో K10, ఇప్పుడు కొంత వెనుకబడినట్లే కనిపిస్తోంది. ఈ తగ్గుదలకు ప్రధాన కారణంగా 2025 సెప్టెంబర్ వరకు ఉన్న పరిస్థితులను చెప్పుకోవచ్చు. ఆ సమయంలో కార్లపై ఉన్న జీఎస్టీ రేట్లు వినియోగదారులపై కొంత భారం మోపాయి.

ఫలితంగా, తక్కువ ధర సెగ్మెంట్లో కూడా కొనుగోలు నిర్ణయాలు ఆలస్యమవుతూ, ఆల్టో K10 అమ్మకాలు మందకొడిగా సాగాయి. షోరూమ్లకు వచ్చే కస్టమర్లు ఉన్నప్పటికీ, ఫైనల్గా కొనుగోలు చేసే వారి సంఖ్య మాత్రం ఆశించిన స్థాయికి చేరుకోలేదు. అయితే పరిస్థితి సెప్టెంబర్ 2025 తర్వాత గణనీయంగా మారింది. ప్రభుత్వం కార్లపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయం తీసుకున్న తర్వాత, మార్కెట్లో వెంటనే పాజిటివ్ ప్రభావం కనిపించింది.
ధర కొంత మేర తగ్గడం, EMIలు మరింత అందుబాటులోకి రావడం వంటి అంశాలు వినియోగదారులను మళ్లీ షోరూమ్ల వైపు ఆకర్షించాయి. దీంతో మారుతి ఆల్టో కె10 అమ్మకాలు మళ్లీ వేగం అందుకున్నాయి. ప్రత్యేకంగా ఆర్థిక సంవత్సరపు చివరి నెలల్లో ఈ కారు అమ్మకాలు పెరుగుతూ రావడం, మొత్తం సంవత్సరపు సంఖ్యను కొంతవరకు సమతుల్యం చేసింది. లేకపోతే, ప్రారంభంలో ఉన్న మందగమనం దృష్ట్యా మొత్తం అమ్మకాలు ఇంకా తగ్గే అవకాశమూ ఉండేది.

దీని అర్థం ఏమిటంటే, 2025-26 ఆర్థిక సంవత్సరం మొత్తం అమ్మకాలలో ఒక స్పష్టమైన ట్రెండ్ కనిపిస్తోంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన మొదటి ఆరు నెలలు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అమ్మకాలు చాలా మందకొడిగా సాగాయి. ఆ సమయంలో మార్కెట్లో కొనుగోలుదారుల స్పందన తక్కువగా ఉండటం, ఖర్చులపై జాగ్రత్తగా వ్యవహరించడం వంటి కారణాల వల్ల ఈ కారు విక్రయాలు ఆశించిన స్థాయికి చేరుకోలేదు.
అయితే పరిస్థితి అక్టోబర్ నుంచి పూర్తిగా మారిపోయింది. ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో, అంటే అక్టోబర్ నుంచి మార్చి వరకు, ఆల్టో K10 అమ్మకాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా ధరలో వచ్చిన అనుకూల మార్పులు, కొనుగోలుదారులకు మరింత అందుబాటు పెరగడం వంటి అంశాలు ఈ వృద్ధికి కారణమయ్యాయి. ఫెస్టివల్ సీజన్ ప్రభావం కూడా ఈ పెరుగుదలలో కీలక పాత్ర పోషించింది అని చెప్పొచ్చు.

ఇక ధర విషయానికి వస్తే, ఈ కారు ఇంకా బడ్జెట్ సెగ్మెంట్లోనే అత్యంత ఆకర్షణీయమైన ఆప్షన్గా కొనసాగుతోంది. ప్రస్తుతం ఎంట్రీ-లెవల్ వేరియంట్ ధర సుమారు రూ. 3.70 లక్షల వద్ద ఉండగా, టాప్ వేరియంట్ కేవలం రూ. 5.45 లక్షల వరకు మాత్రమే. ఈ ధర పరిధి వల్లే మొదటిసారి కారు కొనేవారికి, లేదా తక్కువ బడ్జెట్లో నమ్మకమైన వాహనం కావాలనుకునే వారికి ఇది ఇంకా మంచి ఎంపికగా నిలుస్తోంది.
మైలేజ్ విషయానికి వస్తే, పెట్రోల్ వేరియంట్లు మాన్యువల్ గేర్బాక్స్తో లీటరుకు సుమారు 24.39 కి.మీ వరకు మైలేజీని అందించగలవు. అదే సమయంలో ఆటోమేటిక్ (AMT) వేరియంట్లు లీటరుకు 24.90 కి.మీ వరకు మైలేజీని ఇవ్వగలవు. ఇక CNG వేరియంట్ విషయానికి వస్తే, ఇది మరింత ఆర్థికంగా ప్రయాణం చేయాలనుకునే వారికి సరైన ఆప్షన్గా నిలుస్తుంది. ఈ వేరియంట్ కిలోకు 33.40 కి.మీ వరకు మైలేజీని ఇస్తుంది.


Click it and Unblock the Notifications








