మరికొద్ది రోజుల్లో మీ జేబులకు భారీ చిల్లు.. వాటి ధరల పెంపు! కొనాలంటే త్వరపడాల్సిందే!

ఇండియాలో సామాన్య ప్రజల కార్ కలను నిజం చేసిన కంపెనీల్లో మారుతి సుజుకి (Maruti Suzuki) పేరు ముందువరుసలో ఉంటుంది. తక్కువ బడ్జెట్‌తో మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, సులభమైన సర్వీస్ నెట్‌వర్క్ కారణంగా గ్రామాల నుంచి నగరాల వరకు కోట్లాది మంది మారుతి కార్లను నమ్మకంగా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు, మొదటిసారి కారు కొనాలనుకునే వారికి మారుతి ఎప్పుడూ తొలి ఎంపికగానే నిలిచింది. అయితే ఇప్పుడు అదే కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయం కార్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారిపై అదనపు భారం మోపేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు అందుబాటు ధరల్లో లభించిన మారుతి కార్లు ఇకపై మరింత ఖరీదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కంపెనీ తన అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కొత్త ధరలు జూన్ 2026 నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపింది. మోడల్, వేరియంట్‌ను బట్టి రూ.30 వేల వరకు ధరలు పెరగనున్నట్లు వెల్లడించింది. దీంతో ఇప్పటికే కారు కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న కస్టమర్లు ఇప్పుడు ఆలోచనలో పడే పరిస్థితి ఏర్పడింది. ఈ ధరల పెంపుపై స్పందించిన కంపెనీ, పెరుగుతున్న ముడిసరుకుల ఖర్చులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది.

Maruti Suzuki Cars Become Costlier From June 2026 Up To Rs 30000

స్టీల్, అల్యూమినియం, ఎలక్ట్రానిక్ భాగాలు వంటి కీలక పదార్థాల ధరలు పెరగడంతో వాహనాల తయారీ వ్యయం కూడా భారీగా పెరిగిందని తెలిపింది. దీనికి తోడు కొనసాగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా కంపెనీలపై అదనపు భారం మోపుతున్నాయని వివరించింది. ఈ పెరిగిన ఖర్చులను పూర్తిగా కంపెనీ భరించడం కష్టమవడంతో, కొంత భారాన్ని ధరల పెంపు రూపంలో వినియోగదారులపై మోపాల్సి వచ్చిందని వెల్లడించింది. కార్ల ధరల్లో పెరుగుదల వేర్వేరుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

ఇప్పటికే పెట్రోల్ ధరలు, ఈఎంఐలు, ఇన్సూరెన్స్ ఖర్చులు పెరుగుతున్న సమయంలో కార్ల ధరలు కూడా పెరగడం మధ్యతరగతి ప్రజలపై మరింత ప్రభావం చూపనుంది. తక్కువ ధరల్లో లభించే హ్యాచ్‌బ్యాక్ కార్లను కొనాలని భావిస్తున్న కుటుంబాలకు ఇది షాక్‌లా మారొచ్చు. మరోవైపు, జూన్‌కు ముందు కారు బుక్ చేసుకుంటే పాత ధరలకే కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో కస్టమర్లు త్వరగా బుకింగ్స్ చేయడానికి ఆసక్తి చూపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Maruti Suzuki Cars Become Costlier From June 2026 Up To Rs 30000

గత కొన్ని నెలలుగా దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో కార్ల ధరల పెంపు పరంపర కొనసాగుతోంది. పెరుగుతున్న ముడిసరుకుల ధరలు, తయారీ వ్యయాలు, ద్రవ్యోల్బణ ప్రభావం కారణంగా ఒకదాని తర్వాత ఒకటి ప్రముఖ కార్ల కంపెనీలు తమ వాహనాల ధరలను సవరించుకుంటున్నాయి. ఇప్పటికే టాటా మోటార్స్, మహీంద్రా ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే తమ కార్ల ధరలను పెంచి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి.

ఇందులో టాటా మోటార్స్ సుమారు 1.5 శాతం వరకు, మహీంద్రా అయితే 2.5 శాతం వరకు ధరలను పెంచినట్లు ప్రకటించింది. ఆ తర్వాత హ్యూందాయ్ మే నెల నుంచి తన వాహనాల ధరలను సుమారు 1 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అదే బాటలో మారుతి కూడా చేరింది. ఇప్పటి వరకు తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్న మారుతి కార్లు ఇకపై కొంత ఖరీదయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.

Maruti Suzuki Cars Become Costlier From June 2026 Up To Rs 30000

ముఖ్యంగా మొదటిసారి కారు కొనాలని చూస్తున్న మధ్యతరగతి కుటుంబాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇంకోవైపు, వరుసగా అన్ని కంపెనీలు ధరలను పెంచుతుండటంతో ఆటోమొబైల్ మార్కెట్లో డిమాండ్ కొంత మందగించే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా బడ్జెట్ సెగ్మెంట్ కార్ల అమ్మకాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని చెబుతున్నారు.

Article Published On: Friday, May 22, 2026, 8:51 [IST]
English summary
Maruti suzuki cars become costlier from june 2026 up to rs 30000
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+