మొత్తం ఇండియాలోనే అత్యధికంగా అమ్ముడైన రూ.6.26 లక్షల కారు.. 33 కి.మీల మైలేజ్.. నెం.1 కారు
ప్రస్తుతం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా కార్ మార్కెట్లో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు మిడిల్ క్లాస్ కుటుంబాల మొదటి ఎంపికగా ఉన్న సెడాన్ కార్లు ఇప్పుడు క్రమంగా వెనక్కి నెట్టబడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కస్టమర్ల అభిరుచులు పూర్తిగా SUVల వైపు మళ్లడం. ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్, రఫ్ రోడ్లపై మెరుగైన డ్రైవింగ్ అనుభవం, మస్క్యులర్ లుక్, అలాగే పెద్ద కారు అన్న భావన.. ఇవన్నీ SUVలను ప్రజల మనసుకు దగ్గర చేస్తున్నాయి. ఈ మారుతున్న ట్రెండ్ను కార్ కంపెనీలు కూడా వేగంగా గుర్తించాయి. అందుకే గత కొన్నేళ్లుగా మార్కెట్లోకి వస్తున్న కొత్త మోడళ్లలో ఎక్కువ శాతం SUVలు లేదా SUV స్టైల్ వాహనాలే. కాంపాక్ట్ SUV, మిడ్-సైజ్ SUV, ఫుల్ సైజ్ SUV అంటూ ప్రతి సెగ్మెంట్లో కంపెనీలు పోటీగా మోడళ్లను విడుదల చేస్తున్నాయి.
ఫలితంగా, భారతదేశంలో ప్రస్తుతం SUVల మార్కెట్ వాటా ఏకంగా 52 శాతానికి చేరింది. అంటే దేశంలో 100 కార్లు అమ్ముడవుతుంటే, వాటిలో 52 SUVలే అన్నమాట. ఇది SUVల క్రేజ్ ఎంత స్థాయిలో ఉందో చెప్పడానికి సరిపోతుంది. మరోవైపు, ఒకప్పుడు మార్కెట్ను ఏలిన సెడాన్ల పరిస్థితి మాత్రం అంత ఆశాజనకంగా లేదు. వాటి మార్కెట్ వాటా ఇప్పుడు 10 శాతం కంటే కూడా తక్కువకు పడిపోయింది.

ఇలాంటి పరిస్థితుల్లో, సెడాన్ సెగ్మెంట్ పూర్తిగా ముగిసిపోయిందా? అనే ప్రశ్న చాలామంది ఆటోమొబైల్ అభిమానుల మనసులో మెదులుతోంది. అయితే, ఈ మొత్తం ట్రెండ్కు భిన్నంగా ఒకే ఒక్క సెడాన్ మాత్రం SUVల ఆధిపత్యానికి గట్టిగా సవాలు విసురుతోంది. అదే మారుతి సుజుకి డిజైర్. మారుతున్న కాలానికి తగ్గట్టు తనను తాను అప్డేట్ చేసుకుంటూ, కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, డిజైర్ ఇప్పటికీ భారీ అమ్మకాలను నమోదు చేస్తోంది.
SUVలు మార్కెట్ను ఊపేస్తున్న ఈ రోజుల్లో కూడా డిజైర్ అమ్మకాల పరంగా బలంగా నిలవడం నిజంగా విశేషమే. భారతీయ కుటుంబాల అవసరాలను అద్భుతంగా అర్థం చేసుకోవడం. సరసమైన ధర, మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, నమ్మకమైన మారుతి సుజుకి బ్రాండ్ ఇమేజ్ ఇవన్నీ కలిసి డిజైర్ను ఒక విలువకు తగిన కారుగా నిలబెట్టాయి. అంతేకాదు, టాక్సీ సెగ్మెంట్లో కూడా డిజైర్కు ఉన్న డిమాండ్ దీని అమ్మకాలను మరింత బలపరుస్తోంది.

2025 సంవత్సరం భారత ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి డిజైర్కు ఒక చారిత్రాత్మక సంవత్సరంగా నిలిచింది. SUVల హవా కొనసాగుతున్న ఈ కాలంలో కూడా, ఒక సెడాన్ కారు దేశవ్యాప్తంగా అమ్మకాలలో అగ్రస్థానాన్ని దక్కించుకోవడం నిజంగా విశేషం. 2025లో అత్యధికంగా అమ్ముడైన మారుతి సుజుకి కారు హోదానే కాదు, మొత్తం భారతదేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా డిజైర్ నిలవడం ఆటో రంగాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ ఏడాది డిజైర్ అమ్మకాలు హ్యుందాయ్ క్రెటా, టాటా నెక్సాన్ వంటి అత్యంత ప్రజాదరణ పొందిన SUVలను కూడా అధిగమించాయి. SUVలు మార్కెట్ను ఏలుతున్నాయన్న భావనకు ఇది గట్టి కౌంటర్ అనే చెప్పాలి. 2025 సంవత్సరంలో మొత్తం 2.14 లక్షల మారుతి సుజుకి డిజైర్ కార్లు అమ్ముడవ్వడం ద్వారా, ఇది భారతీయ వినియోగదారుల నమ్మకాన్ని మరోసారి నిరూపించింది.

2024 సంవత్సరంలో డిజైర్ అమ్మకాలు 1.61 లక్షల యూనిట్ల వద్దే నిలిచాయి. కానీ కేవలం ఏడాదిలోనే దాదాపు 50 వేల యూనిట్లకు పైగా అదనపు అమ్మకాలు నమోదు కావడం, ఈ కారుపై పెరిగిన డిమాండ్ను స్పష్టంగా చూపిస్తోంది. SUVల వైపు కస్టమర్లు మొగ్గు చూపుతున్నా కూడా, డిజైర్ తన స్థానం తగ్గకుండా మరింత బలపడటం దీని ప్రత్యేకత.
మార్కెట్లో డిజైర్ ఎంట్రీ-లెవల్ వేరియంట్ ధర ప్రస్తుతం కేవలం రూ. 6.26 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఈ ధర వద్ద ఇంత స్పేస్, కంఫర్ట్, సెడాన్ అనుభవాన్ని అందించడం చాలా అరుదు అనే చెప్పాలి. దీనికి పెద్ద ప్లస్ పాయింట్ డిజైర్ CNG వేరియంట్లు. లీటర్కు 33.73 కి.మీ. మైలేజ్ ఇవ్వగల సామర్థ్యం ఉండటం వల్ల, పెరుగుతున్న ఇంధన ధరల మధ్య ఈ కారు చాలా మందికి ఖర్చు తగ్గించే పరిష్కారంగా నిలుస్తోంది.


Click it and Unblock the Notifications








