మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఆర్ట్ ఎడిషన్ అదుర్స్

ఇవే కాకుండా.. ఇందులో అమర్చిన హార్మన్ కాడ్న్ సౌండ్ సిస్టమ్ మరో అదనపు ప్రత్యేకతగా నిలువనుంది. తమ బ్రాండ్ గురించి మరింతగా మాట్లాడాలని భావించామని, అందుకే, ఈ ప్రముఖ ఆక్షన్ సంస్థతో టై-అప్ ఏర్పచుకున్నామని, తాము కేవలం లగ్జరీ, సేఫ్టీపై దృష్టి సారిస్తామనేది కాకుండా.. స్పోర్టీనెస్, లైఫ్స్టైల్ విషయాల్లో తామేంటో నిరూపించుకునేందుకే ఈ కారును విడుదల చేస్తున్నామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పీటర్ హోనెగ్ వెల్లడించారు
శాఫ్రాన్ఆర్ట్ నిర్వహించనున్న ఆర్ట్ ఆక్షన్లో ఈ కారును ప్రదర్శించనున్నారు. ఈ వేలం సెప్టెంబర్ 21 నుండి ప్రారంభం అవుతుంది. ఈ వేలంలో లేట్ ఎమ్ఎఫ్ హుస్సేన్, ఎస్హెచ్ రజా, అర్పితా సింగ్ వంటి ప్రముఖుల కళాఖండాలను కూడా ప్రదర్శించనున్నారు. ఈ వేలంలో ద్వారా రూ.26-35 కోట్లు ఆర్జించాలని కంపెనీ యోచిస్తోంది. అంతేకాకుండా.. దేశంలోని ఆరు నగరాల్లో కళల పట్ల అవగాన తీసుకువచ్చేందుకు కూడా ఈ టై-అప్ సన్నాహాలు చేస్తుంది.


Click it and Unblock the Notifications








