నిస్సాన్ కార్లను ఇప్పుడు ఆన్లైన్లోనే కొనుక్కోవచ్చు!
ఆన్లైన్లో కేవలం అప్పీరల్స్, గ్యాడ్జెట్స్, యాక్ససరీస్లనే కాదు కార్లను కూడా కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే ఈ తరహా విధానం అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులో ఉంది. కాగా.. ఇప్పుడు ఈ ట్రెండ్ భారత్కు కూడా పాకింది. జపాన్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ మోటార్ ఇండియా, భారత్లోని తమ కొనుగోలుదారుల కోసం ఆన్లైన్ సేల్ను ప్రారంభించనుంది.
ఇది కూడా చదవండి: నిస్సాన్ టెర్రానో టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్
ఈ విషయం గురించి హోవర్ ఆటోమోటివ్ ఇండియా (నిస్సాన్ యొక్క జాతీయ సేల్స్ కంపెనీ) మార్కెటింగ్ డైరెక్టర్ నితీష్ టిప్నిస్ మాట్లాడుతూ.. ఈరోజుల్లో అనేక మంది కొనుగోలుదారులు కారు కొనే విషయంలో నిర్ణయం తీసుకోవాటని ముందు ఆన్లైన్లో రీసెర్చ్ చేస్తున్నారని, ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఇంటర్నెట్లో అవకాశాలు సంవృద్ధిగా ఉన్నాయని అన్నారు. కొనుగోలు సమయంలో ఖచ్చితమైన డెలివరీ, సర్వీస్లను ఆఫర్ చేసేలా నిర్దేశిత కార్ పోర్టల్స్ ద్వారా కస్టమర్లకు తగిన పేమెంట్ గేట్వేలను ఆఫర్ చేస్తామని చెప్పారు.

ఈ విధానం ద్వారా కస్టమర్ల కారు కొనుగోలు ప్రక్రియ సులభతరమవుతుందని, అంతేకాకుండా వినియోగదారుల సమయం కూడా చాలా ఆదా అవుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం నిస్సాన్ భారత మార్కెట్లో లగ్జరీ సెడాన్ టీనా, మిడ్-సైజ్ సెడాన్ సన్నీ, ఇటీవల విడుదల చేసిన కాంపాక్ట్ ఎస్యూవీ టెర్రానో, కాంపాక్ట్ హ్యాచ్బ్యాక్ మైక్రా, ప్రీమియం ఎస్యూవీ ఎక్స్-ట్రైల్, ఎమ్పివి ఇవాలియా మరియు స్పోర్ట్స్ కారు 370జెడ్ మోడళ్లను ఆఫర్ చేస్తోంది.


Click it and Unblock the Notifications








