Just In
- 12 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 16 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 18 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 21 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- Sports ధోనీ సార్ ధోనీ.. అంతే: సౌండ్ లెవెల్ ఏ రేంజ్లో ఉందంటే..
- Movies Brahmamudi April 20 th episode: రాజ్ను ఇంట్లోంచి గెంటివేతకు ప్లాన్.. పండగ చేసుకొంటున్న రుద్రాణి
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
33 వేల బుకింగ్స్ , 10 వారాల వెయిటింగ్ పీరియడ్ అందుకున్న న్యూ డిజైర్
బుకింగ్స్ భారీ స్థాయిలో పెరిగిన నేపథ్యంలో, తమ న్యూ డిజైర్ మీద వెయిటింగ్ పీరియడ్ అమాంతం పెరిగిపోయింది. విడుదలకు ముందే దీని మీద బుకింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
మారుతి సుజుకి తమ నూతన కాంపాక్ట్ సెడాన్ న్యూ డిజైర్ మీద వెయిటింగ్ పీరియడ్ 10 వారాలుగా ఉన్నట్లు తెలిపింది. విడుదలైన రెండవ రోజు నాటికి ఈ న్యూ డిజైర్పై మొత్తం 33,000 ల బుకింగ్స్ నమోదయ్యాయి.
మారుతి సుజుకి ఈ సరికొత్త డిజైర్ కాంపాక్ట్ సెడాన్ మీద మే 5 వ తేదీన రూ. 11,000 ల ధరతో బుకింగ్స్ ప్రారంభించింది. విడుదలైన రెండవ రోజు నాటికి 11 రోజుల్లో 33,000 బుకింగ్స్ నమోదయ్యాయి.
సగటున రోజుకు 3,000 యూనిట్లు చొప్పున బుక్ అయ్యాయి. తక్కువ ధరతో బుకింగ్ చేసుకునే అవకాశం మరియు డిజైర్ బ్రాండ్ పాపులారిటీ నేపథ్యంలో ఈ విధమైన బుకింగ్స్ సాధ్యమయ్యాయని చెప్పవచ్చు.
బుకింగ్స్ భారీగా పెరిగినందున వాటిని డెలివరీ ఇచ్చేందుకు తీసుకునే సమయం కూడా విపరీతంగా పెరిగింది. ప్రత్యేకించి డిజైర్లోని 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉన్న వాటి మీద వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉంది.
మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ గల డిజైర్ల మీద ఎనిమిది నుండి తొమ్మిది వారాల వరకు అదే విధంగా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ గల వేరియంట్ల మీద నాలుగు నుండి ఐదు వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ డీలర్లు పేర్కొంటున్నారు.
మారుతి విడుదల చేసిన న్యూ డిజైర్లో బేస్ వేరియంట్ మినహాయిస్తే, మిగతా అన్ని వేరియంట్లలో ఆటోమేటిక్ గేర్బాక్స్ ట్రాన్స్మిషన్(AGS) అందుబాటులో ఉంది.
ఈ తరహా బుకింగ్స్ నమోదుకావడానికి మరో కారణం దీని మైలేజ్. మునుపటి వేరియంట్ కన్నా తక్కువ బరువుతో నిర్మించడం, మరియు అత్యుత్తమ సామర్థ్యం గల ఇంజన్ అందివ్వడం ద్వారా డీజల్ వేరియంట్ లీటర్కు 28.40కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలిగింది. దీంతో ఇది భారత దేశపు అత్యుత్తమ మైలేజ్ ఇవ్వగల కారుగా నిలిచింది.
ఇంటీరియర్లో ఈ సారి డిజైర్ ప్రేమికులను సంతృప్తి పరిచింది మారుతి. ప్రీమియమ్ ఫీచర్లు మరియు విశాలమైన క్యాబిన్ ద్వారా ఎక్కువ హెడ్ మరియు లెగ్ రూమ్ ఉండటం ద్వారా సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.
సరికొత్త మారుతి సుజుకి డిజైర్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 5.45 లక్షలు మరియు డీజల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 6.45 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.