Just In
- 3 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 3 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 4 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 5 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Movies Mrunal Thakur గ్లామర్తో అదరగొట్టిన మృణాల్ థాకూర్.. హిరామండి షోలో స్పెషల్ ఎట్రాక్షన్గా
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
2 కోట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకున్న మారుతి
భారతదేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇప్పుడు సరికొత్త మైలురాయిని సాధించింది. మారుతి సుజుకి దేశీయంగా ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఏకంగా 2 కోట్ల కార్లను ఉత్పత్తి చేసింది.
భారతదేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇప్పుడు సరికొత్త మైలురాయిని సాధించింది. మారుతి సుజుకి దేశీయంగా ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఏకంగా 2 కోట్ల కార్లను ఉత్పత్తి చేసింది. ఈ సందర్భంగా కంపెనీ 20 వ మిలియన్ కారును ఉత్పత్తి చేసింది.
కంపెనీ తొలుత 1983 డిసెంబరులో ఉత్పత్తిని ప్రారంభించింది. సరిగ్గా 34 సంవత్సరాల ఐదు నెలల్లో ఈ మైలురాయిని చేధించింది. గుజరాత్లోని నూతన సనంద్ ప్లాంటులో 20వ మిలియన్ కారుగా మారుతి స్విఫ్ట్ను తయారు చేసింది.
సుజుకి మోటార్స్ జపాన్ తరువాత ఈ మైలురాయిని సాధించిన రెండవ దేశం ఇండియా. ఏదేమైనప్పటికీ, జపాన్ రికార్డును ఇండియా బ్రేక్ చేసింది. 2 కోట్ల కార్లను ఉత్పత్తి చేయడానికి జపాన్కు 45 ఏళ్లు పట్టగా, ఇండియా కేవలం 34 ఏళ్లలో ఆ రికార్డును దాటేసింది.
ఇండియాలో మారుతి సుజుకి ఉత్పత్తి చేసిన 2 కోట్ల యూనిట్లలో అత్యధికంగా ఆల్టో కార్లు ఉన్నాయి. వీటిలో, 31 లక్షల 70 వేల కార్లతో ఆల్టో మొదటి స్థానంలో, 29 లక్షల 10 యూనిట్లతో మారుతి 800 మరియు 21 లక్షల 60 వేల యూనిట్లతో వ్యాగన్ఆర్ కార్లు వరుసగా రెండు మరియు మూడవ స్థానాల్లో ఉన్నాయి.
సుజుకి మోటార్స్ తొలుత 1983 డిసెంబరులో ఉత్పత్తిని ప్రారంభించింది. మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ తొలి ప్రొడక్షన్ మోడల్ మారుతి 800. ఆ తరువాత కాలంలో ఇండో-జపనీస్ సంస్థల ఉమ్మడి భాగస్వామ్యంతో మారుతి సుజుకి సంస్థ ఏర్పాటైంది. అప్పటి నుండి మార్కెట్లో ఉన్న డిమాండుకు అనుగుణంగా ఎన్నో కొత్త మోడళ్లను ఉత్పత్తి చేసింది.
ఈ రోజు మారుతి సుజుకి గుర్గావ్లోని మానేసర్ ప్రొడక్షన్ ప్లాంటు మరియు గుజరాత్లోని సనంద్ ప్రొడక్షన్ ప్లాంటులో తమ మోడళ్లను ఉత్పత్తి చేస్తోంది. జపనీస్ దిగ్గజం సుజుకి మోటార్స్ 100శాతం అనుభందంతో దేశీయంగా ప్యాసింజర్లను ఉత్పత్తి చేసేందుకు మారుతితో జత కట్టింది.
మారుతి సుజుకి 10 లక్షల ఉత్పత్తి మైలురాయిని 1994 మార్చిలో సాధించింది. తరువాత 50 లక్షల ఉత్పత్తిని ఏప్రిల్ 2005లో, కోటి నుండి కోటిన్నర ప్రొడక్షన్ మైలురాయి చాలా వేగంగా మార్చి 2011 నుండి మే 2015 మధ్య కాలంలో చేధించింది. ఇదే క్రమంలో కేవలం మూడేళ్ల కాలంలోనే 2 కోట్ల ప్రొడక్షన్ను చేరుకుంది.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
మారుతి సుజుకి భారతదేశపు అతి పురాతమైన ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ. సుమారుగా 34 ఏళ్ల నుండి దేశీయంగా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇండియాలో ఎక్కువ డీలర్లు, సర్వీస్ సెంటర్లు, తయారీ కేంద్రాలు ఉన్న కంపెనీ మారుతి సుజుకి. ప్రస్తుతం 16 మోడళ్లను దేశవ్యాప్తంగా విక్రయిస్తోంది. వీటిలో ప్రధానంగా ఆల్టో, స్విఫ్ట్, బాలెనో, డిజైర్, సియాజ్ మరియు వితారా బ్రిజా వాహనాలు ఉన్నాయి.