Just In
- 1 hr ago గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- 3 hrs ago భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- 4 hrs ago రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- 5 hrs ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
Don't Miss
- Sports RCB vs KKR: చెలరేగిన కోహ్లీ, కార్తీక్.. కేకేఆర్ ముందు భారీ లక్ష్యం!
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Movies Tillu Square Collections సిద్దూ జొన్నలగడ్డ రికార్డుల మోత.. టిల్లు స్క్వేర్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే?
ఒకే రోజు 11 జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసిన ఎంజి మోటార్స్
ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. భారత దేశంలో కూడా ఎలెక్టిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి.
ప్రారంభించిన అతి తక్కువ కాలంలో బాగా ప్రసిద్ధి చెందిన వాహన తయారీ దారు ఎంజి మోటార్స్ కంపెనీ దేశీయ మార్కెట్లో తన ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రవేశపెట్టింది. ఎంజి మోటార్స్ కంపెనీ ఉత్పత్తి చేసిన ఈ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో ఉత్తమ మైలేజ్ ఇచ్చే వాహనాలలో ఇది కూడా ఒకటి.
2020 ఢిల్లీ ఆటో ఎక్స్పో తర్వాత జెడ్ఎస్ ఇవి కారును డెలివరీ చేయడం ప్రారంభించిన ఎంజి మోటార్ కంపెనీకి ఉత్పత్తి, డిమాండ్కు అనుగుణంగా ఇప్పటివరకు 4,000 బుకింగ్లు వచ్చాయి. కేరళలోని కొచ్చిన్ లో ఒకే రోజు దాదాపు 11 కొత్త ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్లు డెలివరీ చేసి కొత్త రికార్డ్ సృష్టించింది.
MOST READ:మార్చి 31 తర్వాత అమ్మిన బిఎస్ 4 వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయనున్నారా.. లేదా ?
ఎంజీ మోటార్ కంపెనీ గతంలో జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారును భారతదేశంలో బెంగళూరు, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్ మరియు హైదరాబాద్ లలో మాత్రమే విడుదల చేసింది. ఇటీవల కాలంలో కంపెనీ ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను కూడా కొంత వరకు పెంచింది. ఈ కారణంగా ఇప్పుడు జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలను ఆరు ప్రధాన నగరాలకు విస్తరించింది.
కొత్త జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారును పూణే, జైపూర్, చెన్నై, సూరత్, కొచ్చిన్ మరియు చండీగర్ ప్రాంతాలలో అధికారికంగా లాంచ్ చేశారు. అంతే కాకుండా బుకింగ్ ప్రక్రియతో పాటు కార్ డెలివరీని కూడా తిరిగి ప్రారంభించింది.
MOST READ:టైర్లు తయారు చేసే కంపెనీ కోవిడ్-19 మాస్క్ తయారు చేస్తే..?
భారత దేశంలో కరోనా లాక్ డౌన్ వల్ల కొన్ని రోజులు ఎంజి మోటార్ కంపెనీ తన జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారు ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పుడు లాక్ డౌన్ కి కొంత మినహాయింపు కల్పించడం వల్ల కంపెనీ తన ఉత్పత్తిని తిరిగి ప్రారంభించింది.
ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారు ప్రస్తుతం రెండు వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అవి ఎక్సైట్ మరియు ఎక్స్క్లూజివ్, ఎక్సైట్ బేస్ వేరియంట్గా మరియు ఎక్స్క్లూజివ్ హై ఎండ్ మోడల్ వేరియంట్గా ఉంటుంది. దేశీయ మార్కెట్లో ఈ ఎంజి జెడ్ఎస్ ఎక్సైట్ వెర్షన్ ధర రూ. 20.58 లక్షలు కాగా, ఎక్స్క్లూజివ్ వెర్షన్ ధర రూ. 53.58 లక్షలు.
MOST READ:త్వరలో అందుబాటులోకి రానున్న ఎగిరే కార్లు, చూసారా !
ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారులో 44.5 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక్క సరి ఫుల్ ఛార్జ్ చేసిన తరువాత గరిష్టంగా 340 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కేవలం 50 నిమిషాల్లో 80% బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. రాబోయే రోజుల్లో లాంచ్ కానున్న ఎంజి మోటార్స్ యొక్క కొత్త వేరియంట్లో 400 కిలోమీటర్ల హై మైలేజ్ ప్రేరేపిత బ్యాటరీ లభిస్తుంది ఇది మునుపటి వాటికంటే కొంత అధిక ధరను కలిగి ఉంటుంది.