Just In
- 11 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 12 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 13 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 14 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Movies Guppedantha Manasu March 29th: మను ఇక్కడే ఉంటాడంటున్న వసు.. వద్దంటూ గొడవ చేస్తున్న అనుపమ!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఎంజి మోటార్స్ జులై అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా ?
ఎంజి మోటార్ భారత మార్కెట్లో ఒక సంవత్సరానికి పైగా ఉంది మరియు సంస్థ కొత్త బ్రాండ్గా స్థిరపడింది. ఎంజి మోటార్ లాక్డౌన్లో కూడా అమ్మకాలలో మంచి పనితీరుని కనపరిచింది. ఎంజి మోటార్ గత నెలలో తన కొత్త మోడల్ హెక్టర్ ప్లస్ను విడుదల చేసింది.
ఎంజి మోటార్ జూలై 2020 అమ్మకాల నివేదికను విడుదల చేసింది. నివేదిక ప్రకారం కంపెనీ గత నెలలో 2,105 యూనిట్లను విక్రయించింది. గతేడాది జూలైలో కంపెనీ 1508 వాహనాలను విక్రయించింది. దీనివల్ల ఈ ఏడాది అమ్మకాలు 40% పెరిగాయి.
ఎంజి మోటార్ ప్రస్తుతం హెక్టర్ ఎస్యూవీ మరియు జెడ్ఎస్ ఎలక్ట్రిక్ వెహికల్ ని విక్రయిస్తోంది. ఈ రెండు మోడల్స్ బాగా అమ్ముడవుతున్నాయి. అమ్మకాలలో హెక్టర్ ఎస్యూవీ అగ్రస్థానంలో ఉండగా, ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలో జెడ్ఎస్ ఇవి బాగా అమ్ముడవుతోంది.
MOST READ:బిఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్ రద్దుచేసిన సుప్రీంకోర్టు : ఎందుకో తెలుసా ?
అనేక స్థాయిల లాక్ డౌన్ కారణంగా ఆటోమొబైల్ మార్కెట్ అనిశ్చితంగా ఉందని కంపెనీ సేల్స్ డైరెక్టర్ తెలిపారు. ఇది చెన్నైలో విడిభాగాల సరఫరాను ప్రభావితం చేసింది. ఈ సవాళ్లన్నీ ఉన్నప్పటికీ అమ్మకాలు మాత్రం కొంత ఎక్కువగానే ఉన్నాయి.
ఎంజీ మోటార్ తన మూడవ మోడల్ హెక్టర్ ప్లస్ ఎస్యూవీని గత నెలలో విడుదల చేసింది. ఈ ఎస్యూవీ ప్రారంభ ధర రూ.13.49 లక్షలు కాగా, ఇందులో టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 18.54 లక్షలు.
MOST READ:స్వాతంత్య దినోత్సవం : ఆగష్ట్ నెలలో భారత్లో అడుగుపెట్టనున్న కొత్త కార్లు, చూసారా ?
ఈ ఎస్వియును నాలుగు మోడళ్లలో కంపెనీ విడుదల చేసింది. ఎంజి మోటార్ కొత్త ఎంజి హెక్టర్ ప్లస్ ఎస్యూవీని మూడు ఇంజన్ ఆప్షన్లతో విక్రయిస్తోంది. ఈ ఇంజన్లలో పెట్రోల్, డీజిల్ మరియు హైబ్రిడ్ ఇంజన్లు ఉన్నాయి. 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 143 బిహెచ్పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
2.0-లీటర్ డీజిల్ ఇంజన్ 170 బిహెచ్పి మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజిన్తో 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ను కూడా కంపెనీ అందిస్తుంది.
డీజిల్ మరియు హైబ్రిడ్ మోడళ్లలో 6-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ ఉండగా, పెట్రోల్ మోడల్లో డిసిటి ఆటోమేటిక్ గేర్బాక్స్ ఉంది. ఎంజి హెక్టర్ ప్లస్లో హెక్టర్ కంటే కొంచెం ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి.
ఎంజీ హెక్టర్ ప్లస్లో 10.4-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. ఇది పనోరమిక్ సన్రూఫ్, యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ ఎసి కంట్రోల్, థర్డ్ రో ఎసి వెంట్ మరియు యుఎస్బి పోర్ట్లను కలిగి ఉంది.