Just In
- 12 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 13 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 16 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 18 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- Movies Karthika Deepam 2 April 24th: దీప తాళికట్టిన భార్య.. నరసింహ చెప్ప పగలగొట్టిన సుమిత్ర
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
2020-2021 ఆర్థిక సంవత్సరంలో కంపెనీల వారీగా కార్ల అమ్మకాలు
గతేడాది దేశంలోకి ప్రవేశించిన కరోనా మహమ్మారి అన్ని రంగాలతో పాటు దేశీయ ఆటోమొబైల్ రంగాన్ని కూడా చిదిమేసింది. గడచిన ఆర్థిక సంవత్సరంలో భారత ఆటో పరిశ్రమ నిరుత్సాహకర ఫలితాలను నమోదు చేసింది. సంపూర్ణ లాక్డౌన్ కారణంగా గడచిన ఏప్రిల్ 2021 నెలలో దేశ చరిత్రలోనే మొదటిసారిగా సున్నా అమ్మకాలు నమోదయ్యాయి.
మే 2020 నెలలో లాక్డౌన్ను పాక్షికంగా సడలించినప్పటికీ, ఆ పరిణామాల నుండి ఆటోమొబైల్ పరిశ్రమ తిరిగి కోలుకోవాటనికి చాలానే సమయం పట్టింది. గత ఆర్థిక సంవత్సరం (2020-2021)లో మొత్తం 27,06,924 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి.
ఇందులో దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 12,93,840 యూనిట్ల కార్లను విక్రయించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఈ అమ్మకాలు 1,20,506 యూనిట్లు తగ్గాయి. మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఈ అమ్మకాలు 8.52 శాతం తక్కువగా నమోదయాయ్యి.
MOST READ:మహీంద్రా నుంచి రానున్న కొత్త ఎస్యూవీ XUV700; వివరాలు
భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా గడచిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం 4,71,535 యూనిట్ల కార్లను విక్రయించగా, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇవి 13,774 యూనిట్లు తక్కువగా ఉన్నాయి. ఇవి 2020 ఆర్థిక సంవత్సరం యొక్క మొత్తం అమ్మకాల కంటే 2.84 శాతం తక్కువగా ఉన్నాయి. గతేడాది మార్కెట్లోకి ప్రవేశించిన కొత్త తరం క్రెటా కారణంగా కంపెనీ అమ్మకాలు మెరుగుపడ్డాయి.
గడచిన ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల వృద్ధిని నమోదు చేసిన కొన్ని కంపెనీలలో టాటా మోటార్స్ కూడా ఒకటి. టాటా మోటార్స్ 2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,22,011 యూనిట్లను విక్రయించింది, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే కంపెనీ 90,814 యూనిట్ల వృద్ధిని నమోదు చేసింది. ఇది 2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 69.22 శాతం ఎక్కువగా ఉంది.
OEM | TY Total | Growth | Growth (%) |
Maruti Suzuki | 12,93,840 | -1,20,506 | -8.52 |
Hyundai | 4,71,535 | -13,774 | -2.84 |
Tata Motors | 2,22,011 | 90,814 | 69.22 |
Kia | 1,55,539 | 70,515 | 82.79 |
Mahindra | 1,55,539 | -24,724 | -13.72 |
Toyota | 93,124 | -20,957 | -18.37 |
Renault | 92,268 | 2,734 | 3.05 |
Honda | 82,074 | -19,942 | -19.55 |
Ford | 48,042 | -58,669 | -54.98 |
MG | 35,597 | 13,643 | 62.14 |
Volkswagen | 20,440 | -5,296 | -20.58 |
Nissan | 18,884 | 845 | 4.68 |
Skoda | 11,331 | -3,110 | -21.54 |
Fiat | 6,553 | -2,026 | -23.62 |
MOST READ: భారత్లో మళ్ళీ మొదలైన కరోనా లాక్డౌన్; లెక్కకు మించి వాహనాలు జప్తు, ఎక్కడంటే?
కొరియన్ కార్ బ్రాండ్ వరుసగా రెండవ ఆర్థిక సంవత్సరంలో కూడా అద్భుతమైన ఫలితాలను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కియా సోనెట్ కారణంగా, కంపెనీ అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయి. కియా మోటార్స్ 2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,55,686 యూనిట్లను విక్రయించింది, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇవి 70,515 యూనిట్లు అధికంగా ఉన్నాయి. గత 2020 ఆర్థిక సంవత్సరం మొత్తం అమ్మకాలతో పోలిస్తే, ఇవి 82.79 శాతం ఎక్కువగా ఉన్నాయి.
ఎస్యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా గడచిన 2021 ఆర్థిక సంవత్సరంలో 1,55,539 యూనిట్లను విక్రయించింది, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇవి 24,724 యూనిట్లు తక్కువగా ఉన్నాయి. ఇది 2020 ఆర్థిక సంవత్సరానికి మొత్తం అమ్మకాల కంటే 13.72 శాతం తక్కువ. టొయోటా అమ్మకాలు కూడా 18.37 శాతం తక్కువగా నమోదయ్యాయి.
MOST READ:ఉద్యోగం నుంచి తీసేశారని బీభత్సం సృష్టించిన మాజీ ఉద్యోగి.. ఇంతకీ ఏం చేసాడో తెలుసా?
ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో తమ వార్షిక అమ్మకాలలో 3.05 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం 92,268 యూనిట్లను విక్రయించింది. అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ గత ఆర్థిక సంవత్సరంలో 48,042 యూనిట్లను విక్రయించింది. ఈ సమయంలో ఫోర్డ్ అమ్మకాలు కూడా 54.98 శాతం తగ్గాయి.
గడచిన ఆర్థిక సంవత్సరంలో చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్జి మోటార్స్ అమ్మకాలు అనూహ్యంగా 62 శాతం పెరగగా, ఫోక్స్వ్యాగన్ అమ్మకాలు 20 శాతం తగ్గాయి. ఇదే సమయంలో నిస్సాన్ ఇండియా అమ్మకాలు 4 శాతం పెరిగగా, స్కొడా మరియు ఫియట్ బ్రాండ్ల అమ్మకాలు వరుసగా 21 శాతం మరియు 23 శాతం తగ్గాయి. ఈ ఏడాది కొత్తగా సిట్రోయెన్ అనే కార్ కంపెనీ భారత్లోకి ప్రవేశించింది.
MOST READ:విమానాలపై పక్షులు ఎందుకు దాడి చేస్తాయి.. వాటిని ఎలా నివారిస్తారు..మీకు తెలుసా?
Source: Autopunditz