మేడ్ ఇన్ ఇండియా కార్లే కావాలంటున్న విదేశీయులు.. గ్లోబల్ మార్కెట్లో దుమ్మురేపుతున్న నిస్సాన్
నిస్సాన్ కంపెనీ ప్రస్తుతం ఇండియాలో కేవలం ఒకే ఒక కారును అమ్ముతోంది. అదే నిస్సాన్ మాగ్నైట్. ఈ కారు భారత మార్కెట్లో హిట్ అయ్యి, మంచి అమ్మకాలను సాధిస్తున్నప్పటికీ ఈ సంస్థ ఇప్పుడు ఎగుమతులలో కొత్త రికార్డు సృష్టించింది. భారత ప్రజలే కాకుండా విదేశీయులు కూడా ఈ కారును వెతికి వెతికి కొనుక్కుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం.
ఎగుమతుల్లో నిస్సాన్ కొత్త రికార్డు
నిస్సాన్ మోటార్ ఇండియా కంపెనీ ఇండియాలో మాగ్నైట్ అనే కారును మాత్రమే అమ్ముతోంది. ఇండియాలో తయారవుతున్న ఈ కారు ఇండియాలోనే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి అవుతోంది. దీని ద్వారా విదేశీయులు కూడా ఈ ప్రొడక్ట్ను ఇష్టపడి కొనుక్కుంటున్నారు. విదేశీ ఎగుమతులలో ఈ కంపెనీ కొత్త రికార్డు సృష్టించింది.

ఈ కంపెనీ మొత్తం 12 లక్షల వాహనాలను ఎగుమతి చేసి రికార్డు సాధించింది. ఈ ఎగుమతులన్నీ చెన్నైలోని కామరాజర్ పోర్ట్ ద్వారానే విదేశాలకు వెళ్తున్నాయి. ఈ కంపెనీ ఇండియాలో మాగ్నైట్ కారును మాత్రమే తయారు చేసి అమ్ముతున్నప్పటికీ, ఎగుమతుల కోసం ఇతర కార్లను కూడా తయారు చేస్తుంది.
65 దేశాలకు నిస్సాన్ కార్ల ఎగుమతి
ఈ కంపెనీ మాగ్నైట్ బి, సన్నీ సెడాన్, కిక్స్ ఎస్యూవీ, మైక్రా హ్యాచ్బ్యాక్ వంటి కార్లను ఎగుమతి కోసం తయారు చేస్తుంది. ఈ కార్లు వివిధ దేశాలకు ఎగుమతి అవుతాయి కాబట్టి ఈ కార్లలో కుడి, ఎడమ వైపు డ్రైవ్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ కంపెనీ ప్రస్తుతం 65 దేశాలకు తన కార్లను ఎగుమతి చేస్తోంది. ఇందులో ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాలు, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా ప్రాంతాలు ఉన్నాయి.

మాగ్నైట్కు 5 స్టార్ రేటింగ్
ఈ కంపెనీ అధిక సంఖ్యలో మాగ్నైట్ కారునే ఎగుమతి చేస్తోంది. ఈ కారు గ్లోబల్ ఎన్క్యాప్ టెస్ట్లో 5 స్టార్ రేటింగ్ను పొందింది. మొత్తం 55 రకాల ఫీచర్లను అభివృద్ధి చేశారు. ఈ కంపెనీ త్వరలో టెగ్టాన్ అనే పేరుతో కొత్త ఎస్యూవీ కారును మార్కెట్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఇది రెనాల్ట్ డస్టర్ కారు ఆధారంగా తయారు అవుతోంది.
రెనాల్ట్, నిస్సాన్ టెక్నాలజీ షేరింగ్
రెనాల్ట్, నిస్సాన్ కంపెనీల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం.. ఈ రెండు బ్రాండ్ కార్లు ఒకే ప్లాంట్లో తయారవుతాయి. ఈ రెండు కంపెనీలు తమ టెక్నాలజీలను పంచుకుంటాయి. దీని వల్ల రెనాల్ట్ బ్రాండ్లో వచ్చే కారు నిస్సాన్ బ్రాండ్లోనూ, నిస్సాన్ బ్రాండ్లో వచ్చే కారు రెనాల్ట్ బ్రాండ్లోనూ తయారవుతాయి.

ప్రస్తుతం రెనాల్ట్ కంపెనీ డస్టర్ అనే కారును తయారు చేసి అమ్మకాల కోసం తీసుకురాబోతోంది. వచ్చే జనవరి 26న ఈ కారు అమ్మకాల కోసం పరిచయం అవుతుంది. ఇదే కారును కొద్దిగా మార్పులు చేసి టెగ్టాన్ అనే పేరుతో ఇండియాలో నిస్సాన్ కంపెనీ విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. దీని వల్ల ప్రజలు ఈ రెండు కార్లను ఇష్టపడి కొనే అవకాశం ఉంది.
డ్రైవ్స్పార్క్ అభిప్రాయం: ఇండియాలో ప్రస్తుతం వాహనాల తయారీ అద్భుతంగా ఉంది కాబట్టి, ఇండియన్ ప్రొడక్ట్స్పై ప్రజలకు ఎక్కువ ఆసక్తి ఉంది. భవిష్యత్తులో ఈ కార్లన్నీ అద్భుతంగా అమ్ముడవుతాయని ఆశించవచ్చు.


Click it and Unblock the Notifications








