టాటా ప్లానింగ్ మరే కంపెనీకి సాధ్యం కాదు.. ఒకే సారి 7 కొత్త ఎస్యూవీలట.. ఇక పక్క కంపెనీలకు ఇక చెమటలే

భారతదేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీలలో ఒకటైన టాటా మోటార్స్, ఇప్పుడు ఒకటో, రెండో కాదు.. ఏకంగా 7 కొత్త ఎస్‌యూవీలను లాంచ్ చేయబోతోంది. ఇటీవల జరిగిన ఇన్వెస్టర్ మీట్‌లో టాటా మోటార్స్ తమ భవిష్యత్ రోడ్‌మ్యాప్‌ను వెల్లడిస్తూ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

టాటా మోటార్స్ 2030 నాటికి 7 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఈ కొత్త మోడళ్లలో మూడు ఐసీఈ (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) కార్లు, నాలుగు కంప్లీట్ ఎలక్ట్రిక్ కార్లు ఉంటాయి. ఈ భారీ ప్రణాళికలు మారుతి, మహీంద్రా వంటి ప్రత్యర్థి కంపెనీలలో టెన్షన్ పెంచుతున్నాయి.

Tata Motors to Launch 7 New SUVs Posing a Challenge to Maruti and Mahindra

ఈ కొత్త వాహనాలలో టాటా సియెర్రా ఒకటి. దీని కాన్సెప్ట్, ప్రొడక్షన్-రెడీ వెర్షన్‌లను ఇప్పటికే చాలాసార్లు చూపించారు. మొదటగా సియెర్రా ఎలక్ట్రిక్ వెర్షన్ వస్తుంది. ఆ తర్వాత, 2026 ప్రారంభంలో దీని ఐసీఈ వెర్షన్ మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు. ఈ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తుంది.

సియెర్రా ఈవీ, హారియర్ ఈవీ మాదిరిగానే పెద్ద బ్యాటరీ ప్యాక్, మంచి రేంజ్‌తో వస్తుంది. దాని ఐసీఈ వెర్షన్ అయితే సరికొత్త 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్, టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్‌లతో పాటు, 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో కూడా రానుంది.

Tata Motors to Launch 7 New SUVs Posing a Challenge to Maruti and Mahindra

టాటా మోటార్స్ ఒక సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీపై కూడా పని చేస్తోంది. దీని కోడ్‌నేమ్ టాటా స్కార్లెట్. ఇది 2026 ద్వితీయార్థంలో అంటే దీపావళి సమయంలో రోడ్లపైకి వస్తుందని అంచనా. దీని డిజైన్ సియెర్రాను పోలి ఉంటుంది. దీని ఇంజిన్ ఆప్షన్లలో 120 బీహెచ్‌పీ, 1.2 లీటర్ టర్బో, 125 బీహెచ్‌పీ, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌లు ఉండవచ్చు. తక్కువ వేరియంట్లలో కొత్త 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ లభించవచ్చు.

అలాగే, నెక్స్ట్-జెన్ టాటా హారియర్, సఫారీ కార్లు కూడా లాంచ్ చేయబడతాయి. వీటిలో డిజైన్, ఫీచర్లలో భారీ మార్పులు ఉంటాయని టాటా తెలిపింది. ఈ ఎస్‌యూవీలు సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుత మోడల్స్ కంటే పొడవుగా, విశాలంగా ఉంటాయి. ఇది ప్రయాణీకులకు మరింత సౌకర్యాన్ని అందిస్తుంది.

Tata Motors to Launch 7 New SUVs Posing a Challenge to Maruti and Mahindra

టాటా మోటార్స్ తన ఈవీ పోర్ట్‌ఫోలియోను కూడా భారీగా విస్తరించనుంది. 2027లో టాటా అవీన్య ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లాంచ్ కానుంది. ఈ ఈవీలకు పెద్ద బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. ఇవి చాలా ఎక్కువ రేంజ్‌ను అందిస్తాయి. ఫైనల్ మోడల్ కాన్సెప్ట్ లాగానే ఉంటే, అవీన్య ఈవీ డిజైన్ చాలా అడ్వాన్సుడ్‎గా, ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది.

అంతేకాకుండా, టాటా అత్యధికంగా అమ్ముడవుతున్న నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీకి కూడా 2027లో కొత్త జనరేషన్ అప్‌గ్రేడ్ లభిస్తుంది. ఈ ఎస్‌యూవీ ప్రస్తుతం ఉన్న ప్లాట్‌ఫామ్‌లో మార్పులు చేసి లోపల, బయట అనేక మార్పులతో వస్తుంది. నివేదికల ప్రకారం, కొత్త నెక్సాన్ లెవల్-1 ఏడీఏఎస్ (ADAS) టెక్నాలజీతో రావచ్చు.

Tata Motors to Launch 7 New SUVs Posing a Challenge to Maruti and Mahindra

టాటా మోటార్స్ రెండు కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కార్లను కూడా తీసుకురానున్నట్లు ధృవీకరించింది. వాటి కోడ్‌నేమ్స్ కునో(Kuno), టెర్రా(Terra). అయితే, ఈ కొత్త ఈవీల గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియలేదు. ఈ 7 కొత్త ఎస్‌యూవీల లాంచ్‌తో టాటా మోటార్స్ భారతీయ ఆటో మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 21, 2025, 15:07 [IST]
English summary
Tata motors to launch 7 new suvs posing a challenge to maruti and mahindra
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+