విటారా బ్రెజ్జా పై కొత్త పెట్రోల్ వెర్షన్ తీసుకురానున్న మారుతీ సుజుకి
మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి విటారా బ్రెజ్జా 2016 లో లాంచ్ చేసింది. విటారా బ్రెజ్జా త్వరగా ఆ దేశీయ మార్కెట్లో ఎక్కువ కాలం మంచి అమ్మకాలను నమోదు చేసిన ఎస్యువి గా నిలిచింది. అయితే ఈ టాప్ ఎస్యూవి పై మారుతీ సుజుకి కొత్త ఇంజన్ ను తీసుకురానుంది, అది ఏమిటో వివరంగా తెలుసుకొందాం రండి..

ఇప్పటి వరకు ఈ మారుతీ సుజుకి విటారా బ్రెజ్జా కేవలం డీజల్ ఇంజన్ తో మాత్రమే అందుబాటులో ఉంది. ఆటోకార్ ఇండియా ప్రకారం మారుతి సుజుకి వారు ఫిబ్రవరి 2020 లో మారుతి విటారా బ్రెజ్జా పెట్రోల్ వెర్షన్ ను కూడా ప్రవేశపెట్టనున్నట్లు నిర్ధారించారు.

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా పెట్రోల్ వెర్షన్ 2020 ఆటో ఎక్స్ పో లో ప్రదర్శించిన తరువాత భారత మార్కెట్లో విడుదల కావాల్సి ఉంది. మారుతి విటారా బ్రెజ్జా పెట్రోల్ కు బిఎస్-6 కంప్లెయింట్ 1.5-లీటర్ కే15 సిరీస్ ఇంజన్ రావాల్సి ఉంది.

ఈ ఇంజిన్ ఇటీవల భారతీయ మార్కెట్ లో ఎర్టిగా ఎంపివి మీద చేయబడింది మరియు 104 బిహెచ్పి మరియు 138 ఎన్ఎమ్ టార్క్ పవర్ అవుట్ పుట్ ని ఉత్పత్తి చేస్తుంది.

1.5-లీటర్ బిఎస్-6 ఇంజిన్ తో విటారా బ్రెజ్జా పెట్రోల్ వెర్షన్ లో ఐదు-స్పీడ్ మ్యాన్యువల్ లేదా నాలుగు-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంటుంది అని తెలుపబడింది.

మారుతి సుజుకి వారి స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ ఫీచర్ తో కూడా విటారా బ్రెజ్జా పెట్రోల్ ను ప్రవేశపెట్టనుంది, ఇది ఇంజన్ యొక్క మొత్తం సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరింత సహాయం చేస్తుంది.

అయితే, 1.5-లీటర్ ఇంజన్ తో, మారుతి విటారా బ్రెజ్జా ఇకపై ఎక్సైజ్ డ్యూటీల మినహాయింపును అందుకోదు ఎందుకంటే 1200 సిసి కంటే తక్కువ ఇంజిన్ కెపాసిటీతో కేవలం సబ్-4 మీటర్ల కార్లకు మాత్రమే ఇచ్చింది.

ఇంకా ధృవీకరించని మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే మారుతి సుజుకి విటారా బ్రెజ్జా యొక్క పెట్రోల్ వెర్షన్ లో ఏ విధమైన కాస్మోటిక్ అప్ డేట్స్ ను తీసుకొస్తుందా అనేది ఇంకా తెలియనుంది. ప్రస్తుతం, పెట్రోల్ వేరియంట్ తో అందించే అప్డేట్ లు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు.

అయితే, రాబోయే ఎక్స్ పోలో ఈ కారుకు నాలుగు సంవత్సరాల కాలం ఉంటుందని పరిగణిస్తూ, కంపెనీ కొన్ని అప్డేట్స్ ను దీనిపై తీసుకురావచ్చు. మారుతి సుజుకి విటారా బ్రెజ్జా సంవత్సరాల తరబడి దేశీయ మార్కెట్లో టాప్ సెల్లింగ్ ఎస్యువి గా నిలిచింది.

అయితే, గత రెండు నెలల కాలంలో, మహీంద్రా ఎక్స్యూవి300 మరియు హ్యుందాయ్ వెన్యూ తో సహా ఈ సెగ్మెంట్లో ఇతర బ్రాండ్ ల వలన ప్రధానంగా విటారా బ్రెజ్జా అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మారుతి విటారా బ్రెజ్జా పెట్రోల్ చాలా కాలం నుంచి మంచి అమ్మకాలతో కొనసాగింది.

పెట్రోల్ పవర్డ్ విటారా బ్రెజ్జా ప్రారంభించిన తరువాత ఇది దేశీయ మార్కెట్లో విజయాన్ని పొందనుంది. రాబోయే ఆటో ఎక్స్ పోలో కొత్త వేరియంట్ వచ్చే అవకాశముంది. మారుతి సుజుకి వారు కూడా విటారా బ్రెజ్జా యొక్క పెట్రోల్ వేరియంట్ తో తిరిగి భారత మార్కెట్లో కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందడానికి సహాయపడుతుందనే ఆశతో ఉన్నారు.


Click it and Unblock the Notifications








