Just In
- 1 hr ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 2 hrs ago
దక్షిణ భారత్లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 4 hrs ago
భారత్లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 5 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- Finance
నిర్మల సీతారామన్ బడ్జెట్ పైన స్టార్టప్స్ అంచనాలు
- News
ఏకగ్రీవాలపై వివరణ కోరాం, ఆటంకం కలిగిస్తే కోర్టుకే, మంత్రి వ్యాఖ్యలు బాధించాయి: నిమ్మగడ్డ రమేష్ కుమార్
- Sports
3 బంతుల్లో 15 పరుగులు.. ధోనీ తరహాలో చివరి బంతికి సిక్స్ బాదిన సోలంకి! సెమీస్కు బరోడా!
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహీంద్రా కార్లపై ఇయర్ ఎండ్ ఆఫర్స్; రూ.2.86 లక్షల వరకూ తగ్గింపు
ఎస్యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా ఈ డిసెంబర్ 2020 నెలలో భాగంగా, తమ వాహనాలపై స్పెషల్ డిస్కౌంట్లు, ప్రయోజనాలు మరియు వివిధ రకాల ఆఫర్లను అందిస్తోంది. మహీంద్రా ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన కొత్త తరం 2020 థార్ ఎస్యూవీ మినహా మిగిలిన అన్ని మోడళ్లపై ఆఫర్లను అందిస్తోంది.

కస్టమర్ ఎంచుకునే మోడల్ని గరిష్టంగా రూ.25,000 నుండి రూ.2.86 లక్షల వరకు విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆఫర్లన్నీ డిసెంబర్ 31, 2020వ తేదీ వరకూ చెల్లుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. మోడల్ వారీగా కంపెనీ అందిస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి:

మహీంద్రా అందిస్తున్న ఫ్లాగ్షిప్ ఎస్యూవీ, అల్టురాస్ జి4 మోడల్పై అత్యధిక ప్రయోజనాలను అందిస్తోంది. ఈ డిసెంబర్ నెలలో ఆల్టురాస్ జి4 మోడల్ని కొనుగోలు చేసే కస్టమర్లు రూ.2.86 లక్షల వరకు విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఎస్యూవీపై రూ.2.25 లక్షల నగదు తగ్గింపు మరియు రూ.50,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.11,500 కార్పోరేట్ డిస్కౌంట్ను అందిస్తున్నారు.
MOST READ:కుక్క వల్ల అరెస్ట్ అయిన కార్ డ్రైవర్.. ఎందుకు, ఎలాగో మీరే చూడండి ?

మహీంద్రా స్కార్పియో ఎస్యూవీపై గరిష్టంగా 79,000 రూపాయల వరకు భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. ఇందులో రూ.60,000 నగదు తగ్గింపులు, రూ.15,000 ఎక్స్ఛేంజ్ మరియు రూ.4,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. కంపెనీ ఈ మోడల్లో వచ్చే ఏడాది సరికొత్త వెర్షన్ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

మహీంద్రా ఎక్స్యువి500 ఎస్యూవీపై కంపెనీ గరిష్టంగా రూ.56,512 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.25,012 నగదు తగ్గింపు, రూ.25,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.6,500 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది.
MOST READ:హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్టి డ్రైవ్ చేస్తూ కనిపించిన టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' [వీడియో]

మహీంద్రా మరాజ్జో ఎమ్పివిపై కంపెనీ గరిష్టంగా రూ.40,200ల ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.25,000 నగదు తగ్గింపు, రూ.10,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.5,200 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది.

మహీంద్రా కెయువి100 మోడల్పై కంపెనీ రూ.28,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.25,000 క్యాష్ డిస్కౌంట్ మరియు రూ.3,000 కార్పోరేట్ డిస్కౌంట్ ఉన్నాయి.
MOST READ:ఇటీవలి కాలంలో కార్లలో అత్యంత పాపులర్ అయిన టాప్-5 టెక్నాలజీలు

మహీంద్రా అందిస్తున్న బొలెరో ఎస్యూవీపై కంపెనీ రూ.25,000 ఆఫర్లను అందిస్తోంది. ఇందులో రూ.12,000 క్యాష్ డిస్కౌంట్, రూ.10,000 ఎక్సేంజ్ బోనస్ మరియు రూ.3,000 విలువైన కార్పొరేట్ ఆఫర్లు ఉన్నాయి.