ఎంట్రీ ఇచ్చిన ఆరేళ్లలోనే టాటాకు చెమటలు పట్టించిన ఎంజీ.. అమ్మకాలు పెంచుకునేందుకు భారీ ఆఫర్స్
కారు కొనాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే ఎంజీ మోటార్ గురించి తప్పకుండా వినే ఉంటారు. ఈ సంస్థ భారత్లోకి వచ్చి ఆరేళ్లు పూర్తయింది. ఈ ఆరేళ్లలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇప్పుడు టాటా వంటి దిగ్గజాలకు గట్టి పోటీ ఇస్తోంది. ఇటీవల జేఎస్డబ్ల్యూతో చేతులు కలిపి మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. మరి ఈ ఆరేళ్లలో ఎంజీ సంస్థ సాధించిన విజయాలు ఏంటి? ప్రస్తుతం ఎంజీ అందిస్తున్న ఆఫర్లు, కొత్త మోడళ్ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎంజీ మోటార్ ఇండియా మార్కెట్లో అడుగుపెట్టి ఆరు సంవత్సరాలు పూర్తయింది. ఈ ఆరేళ్లలో ఎంజీ ఎన్నో మార్పులను చూసింది. ఇప్పుడు టాటా మోటార్స్ వంటి పెద్ద కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. తమ ఆరేళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఎంజీ మోటార్ తమ కస్టమర్ల కోసం కొన్ని ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది.

ఎంజీ మోటార్ తమ పాపులర్ మోడళ్లయిన హెక్టర్, ఆస్టర్ కార్లపై ఈ ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. ఈ ఆఫర్లలో భాగంగా, కస్టమర్లు కార్లను 100% లోన్ ఫెసిలిటీతో కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, EMI చెల్లింపులకు కొంత కాలం పాటు విరామం తీసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. అయితే, ఈ ఆఫర్లు కేవలం పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ఈ ఆఫర్లలో భాగంగా ఎంజీ హెక్టర్, ఆస్టర్ కార్ల ధరలను కూడా తగ్గించారు. మ్యాన్యువల్ గేర్బాక్స్తో వచ్చే హెకక్టర్ షార్ప్ ప్రో వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ.19.59 లక్షలకు అందుబాటులో ఉంది. అలాగే, ఆస్టర్ స్పింట్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.9.99 లక్షలకు తగ్గించారు.

ఎంజీ మోటార్ భారత్లోకి హెక్టర్ ఎస్యూవీతో అడుగుపెట్టింది. అప్పుడు ఈ కారు మార్కెట్లో అంతగా గుర్తింపు పొందలేదు. కానీ, గత కొన్ని సంవత్సరాలుగా ఎంజీ మోటార్ పనితీరు పూర్తిగా మారిపోయింది. దీని వెనుక ప్రధాన కారణం, భారతీయ సంస్థ అయిన జేఎస్డబ్ల్యూతో చేతులు కలపడం. చైనాకు చెందిన SAIC కంపెనీ ఆధీనంలో ఉన్న ఎంజీ మోటార్, జేఎస్డబ్ల్యూతో భాగస్వామ్యం తరువాత తమ రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఈ భాగస్వామ్యం ఎంజీ మోటార్ భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది.
జేఎస్డబ్ల్యూతో చేతులు కలిపిన తరువాత ఎంజీ మోటార్ ఎలక్ట్రిక్ కార్ల మీద ఎక్కువగా దృష్టి పెట్టింది. ఈ భాగస్వామ్యం తరువాత కామెట్ ఈవీ, విండ్సర్ ఈవీ వంటి ఎలక్ట్రిక్ కార్లు విడుదలయ్యాయి. ఇటీవల ఎం9, సైబర్స్టర్ అనే కొత్త ఎలక్ట్రిక్ కార్లను కూడా ఎంజీ మోటార్ ప్రదర్శించింది. ఈ కొత్త మోడళ్లు భవిష్యత్తులో టాటా మోటార్స్, మహీంద్రా వంటి కంపెనీలకు గట్టి పోటీ ఇస్తాయని భావిస్తున్నారు.

డ్రైవ్స్పాక్ అభిప్రాయం: ఆరేళ్లలో ఎంజీ మోటార్ సాధించిన పురోగతి నిజంగా ప్రశంసనీయం. ముఖ్యంగా, జేఎస్డబ్ల్యూతో భాగస్వామ్యం తరువాత ఈ సంస్థ మరింత బలోపేతం అయింది. ఈ భాగస్వామ్యం ఎంజీ మోటార్ ప్రయాణంలో ఒక పెద్ద మలుపుగా చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఈ సంస్థ మరెన్నో కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చి భారతీయ ఆటో రంగంలో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications








