Just In
- 44 min ago భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- 1 hr ago రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- 3 hrs ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- 4 hrs ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
Don't Miss
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Movies Tillu Square Collections సిద్దూ జొన్నలగడ్డ రికార్డుల మోత.. టిల్లు స్క్వేర్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే?
దేశవ్యాప్తంగా ప్రతి రోజు మారనున్న ఇంధన ధరలు: పూర్తి వివరాలు
జూన్ 16, 2017 నుండి దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇంధన ధరలు ప్రతి రోజూ మారనున్నాయి. ఫ్యూయల్ స్టేషన్కు వెళ్లే ప్రతి రోజూ ఇక మీదట కొత్త ధరలను గమనించవచ్చు.
దేశీయ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయం మేరకు, పెట్రోల్ మరియు డీజల్ ధరలు రోజు వారీగా సరణలకు గురికానున్నాయి. ఈ నూతన విధానం జూన్ 16, 2017 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. మే 1, 2017 నుండి దేశవ్యాప్తంగా ఉన్న ఐదు నగరాల్లో ప్రయోగాత్మకంగా పరీశించిన తరువాత సత్పలితాలవ్వడంతో దీని అమలు చేపట్టారు.
చమురు సంస్థలు పైలట్ ప్రాజెక్ట్ క్రింద దేశీయంగా ఐదు నగరాలైన ఉదయ్ పూర్, జంషెడ్పూర్, పుదుచ్చేరి, చంఢీఘర్ మరియు విశాఖపట్నం లలో రోజు వారీగా ఇంధన ధరలను సవరించారు. దేశవ్యాప్తంగా దీనిని జూన్ 16, 2017 న అమల్లోకి తీసుకురానున్నారు.
దీని గురించి ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ స్పందిస్తూ, "ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులలో పెట్రోల్ మరియు డీజల్ ధరల్లో ఉన్న అస్థిరతను తగ్గించడానికి రోజు వారీగా పెట్రోల్ మరియు డీజల్ ధరల సవరణలు చేయడానికి నిర్ణయించినట్లు" పేర్కొంది.
రోజు వారీగా ఇంధన ధరలను సవరించడానికి శక్తివంతమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చమురు సంస్థలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ప్రతి రోజు ఇంధన ధరలు సవరణ జరిగిన అనంతరం ఏ రోజుకారోజు పేపర్లు, రిటైల్ సెంటర్లలో, మెసేజ్ మరియు మొబైల్ అప్లికేషన్ ద్వారా తెలియజేస్తామని తెలిపాయి.
ప్రస్తుతం, పెట్రోల్ మరియు డీజల్ ధరలు మార్కెట్లకు అనుగుణంగా మారుతున్నాయి. దేశీయ చమురు రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ మరియు హిందుస్తాన్ పెట్రోలియం కార్పేరేషన్ లిమిటెడ్ ప్రతి రోజూ ఇంధన ధరల సవరణ చేపడతాయి.
అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు మరియు డాలరుతో రుపాయి మారకం రేటు ఆధారంగా ఇంధన ధరల సవరణ చేపట్టనున్నారు. ఈ మూడు చమురు కంపెనీలు దేశవ్యాప్తంగా 95 శాతం పెట్రోల్ పంప్ స్టేషన్లను కలిగి ఉన్నాయి.