Just In
- 1 hr ago ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- 1 hr ago దిశా పటానీ కార్ల ప్రపంచం చూసారా.. చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..
- 15 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 16 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
Don't Miss
- News మైండ్ బ్లాక్, డీసీఎం తమ్ముడి ఆస్తుల విలువ?, తల్లి, అన్న దగ్గర అప్పులు చేసిన సిట్టింగ్ ఎంపీ!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Movies Karthika Deepam March 29th: దీపను బాధపెట్టిన ఓ వ్యక్తి... చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చిన కార్తీక్!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మేడిన్ ఇండియా చొరవతో స్థానికంగా తయారైన జాగ్వార్ ఎఫ్-పేస్ విడుదల
స్థానికంగా తయారైన జాగ్వార్ ఎఫ్-పేస్ లగ్జరీ ఎస్యూవీ ఇండియన్ మార్కెట్లోకి విడుదల అయ్యింది. సరికొత్త మేడిన్ ఇండియా జాగ్వార్ ఎఫ్-పేస్ ప్రారంభ ధర రూ. 60.02 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.
స్థానికంగా తయారైన జాగ్వార్ ఎఫ్-పేస్ లగ్జరీ ఎస్యూవీ ఇండియన్ మార్కెట్లోకి విడుదల అయ్యింది. సరికొత్త మేడిన్ ఇండియా జాగ్వార్ ఎఫ్-పేస్ ప్రారంభ ధర రూ. 60.02 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.
ఇండియాలో తయారయ్యే జాగ్వార్ ఎఫ్-పేస్ 2.0-లీటర్ ప్రెస్టేజ్ వేరియంట్ ధర దిగుమతి చేసుకునే వేరియంట్ కన్నా రూ. 20 లక్షల వరకు తక్కువగా ఉంది. ఎఫ్-పేస్ ఎస్యూవీని పూనేలోని ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేయాలని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా నిర్ణయం తీసుకుంది.
Recommended Video
జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా 2018 మోడళ్ల ఉత్పత్తిని ప్రారంభించింది. ప్రస్తుతం జాగ్వార్ ఎఫ్-పేస్లో 20డి ఆల్ వీల్ డ్రైవ్ ప్రెస్టేజ్ వేరియంట్ను మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. ఎఫ్-పేస్ లభించే ఏకైక వేరియంట్ కూడా ఇదే.
జాగ్వార్ ఎఫ్-పేస్ 30డి మోడల్ ఇండియన్ మార్కెట్ నుండి వైదొలగింది. అయితే, భవిష్యత్తులో మార్కెట్ అనుకూలతను బట్టి మళ్లీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తాజాగా విడుదలైన జాగ్వార్ ఎఫ్-పేస్ లగ్జరీ ఎస్యూవీ లైనప్లోని ఆడి క్యూ5 మరియు బిఎమ్డబ్ల్యూ ఎక్స్5 మోడళ్లతో గట్టి పోటీని ఎదుర్కోనుంది.
జాగ్వార్ ఎఫ్-పేస్ 20డి వేరింయట్లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ అభివృద్ది చేసిన 2.0-లీటర్ టుర్బో ఛార్జ్డ్ నాలుగు సిలిండర్ల ఇంజీనియమ్ డీజల్ ఇంజన్ కలదు. ఇంజన్ ఉత్పత్తి చేసే 179బిహెచ్పి పవర్ మరియు 430ఎన్ఎమ్ టార్క్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ గుండా నాలుగు చక్రాలకు అందుతుంది.
జాగ్వార్ ఎఫ్-పేస్ 20డి ప్రెస్టేజ్ వేరియంట్లో జాగ్వార్ డ్రైవ్ కంట్రోల్, ఎల్ఇడి హెడ్ లైట్లు, టెయిల్ లైట్లు, 380 వి మెరిడియన్ సౌండ్ సిస్టమ్, 12.3-అంగుళాల పరిమాణం ఉన్న ఇంస్ట్రుమెంట్ డిస్ల్పే, వై-ఫై హాట్స్పాట్ & ప్రొ సర్వీసెస్, ఆక్టివిటి కీ మరియు 10.2-అంగుళాల పరిమాణం గల టచ్ స్క్రీన్ వంటి ఫీచర్లు తప్పనిసరిగా ఉన్నాయి.
జాగ్వార్ ల్యాండ్ రోవర్ నుండి ఇండియాలో తయారవుతున్న ఆరవ మోడల్ ఎఫ్-పేస్. సరికొత్త మేడిన్ ఇండియా జాగ్వార్ ఎఫ్-పేస్ 20డి ప్రెస్టీజ్ 2.0 డీజల్ ఎస్యూవీని www.findmeacar.in వైబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.
జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ అండ్ ప్రెసిడెంట్ రోహిత్ సూరి మాట్లాడుతూ, "2016 అక్టోబర్ నెలలో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసినప్పటి నుండి జాగ్వార్ ఎఫ్-పేస్ మీద విపరీతమైన ఆదరణ లభించింది. అనతి కాలంలో ఎంతో మంది కస్టమర్ల ఫేవరెట్ ఎస్యూవీగా స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు మేడిన్ ఇండియా ఎఫ్-పేస్ ద్వారా మరింత కస్టమర్లను చేరుకోనున్నట్లు వివరించాడు."
ఎఫ్-పేస్ ఎస్యూవీని స్థానికంగా ఉత్పత్తి చేసి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేడిన్ ఇండియా విధానంలో జాగ్వార్ భాగమవుతున్నందుకు సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. స్థానికంగా తయారైన ఎఫ్-పేస్ ధర చాలా వరకు తగ్గడంతో సరికొత్త మైలురాయిని సాధించడం ఖాయమనిపిస్తోంది.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
జాగ్వార్ ఎఫ్-పేస్ 20డి ఎస్యూవీని స్థానికంగా ఉత్పత్తి చేయాలని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా తీసుకున్న నిర్ణయంతో దీని ధర భారీగా దిగి వచ్చింది. దిగుమతి చేసుకునే ఎఫ్-పేస్ కంటే మేడిన్ ఇండియా మోడల్ ధర 20 లక్షల రుపాయల వరకు తగ్గింది.