Just In
- 1 hr ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 3 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 5 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 8 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- Sports PBKS vs MI: తొండాటకు ముగింపు.. కెమెరా ముందు టాస్ కాయిన్ ఫలితం! వీడియో
- News నెల్లూరు జైలుకు జగన్ పై దాడి కేసు నిందితుడు సతీష్-14 రోజుల రిమాండ్..!
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నెల రోజుల్లో పెట్రోల్ మరియు డీజల్ ధరలు ఏ మేరకు పెరిగాయో తెలుసా ?
గడిచిన నెల రోజుల్లో పెట్రోల్ మరియు డీజల్ ధరలు విపరీతంగా పెరిగాయి.పెట్రోల్ మీద ఏకంగా 6 రుపాయాలు మరియు డీజల్ మీద 3.67 రుపాయలు వరకు పెరిగింది.
గడిచిన నెల రోజుల్లో పెట్రోల్ మరియు డీజల్ ధరలు విపరీతంగా పెరిగాయి. రోజూ వారిగా ఇంధన ధరలను సమీక్షించి ఏ రోజుకారోజు కొత్త ధరలతో ఇంధన విక్రయాలు చేపడతామని చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయం తెలిసిందే.
ఈ మధ్య కాలంలో ఇంధన ధరలు అరుదుగా తగ్గుతూ పరిపాటిగా పెరగుతూ వచ్చాయి. దీంతో పెట్రోల్ మీద ఏకంగా 6 రుపాయలు మరియు డీజల్ మీద 3.67 రుపాయలు వరకు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 69.04 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 57.03 లుగా ఉన్నాయి. మూడేళ్ల కాలంలో గరిష్టంగా నమోదయ్యాయి.
గతంలో చమురు సంస్థలు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇంధన ధరలను సవరించేవి. అయితే పదిహేనేళ్ల క్రితం ప్రయోగించి చూసిన ప్రతి రోజు ఇంధన ధరల సవరణను జూలై 2017 నుండి అమల్లోకి తెచ్చాయి. ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు పెట్రోల్ మరియు డీజల్ కొత్త ధరలతో అమల్లోకి వస్తాయి.
Recommended Video
గతంలో ఇంధన ధరల సవరణ జరిగేటపుడు ఒక్కసారిగా రెండు లేదా మూడు రుపాయలు పెరిగేది. అయితే ఇలా పెంచడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించే వారు. కానీ ఇప్పుడు రోజు వారి ఇంధన ధరల సవరణను అందుబాటులోకి తెచ్చాక ప్రతి రోజు 1 నుండి 15 పైసలు వరకు పెంచుతున్నారు.
ఇలా ప్రతి రోజు కొద్ది కొద్దిగా పెరిగిన ఇంధన ధరలు నెల రోజుల్లో ఆరు రుపాయలకు చేరుకుంది. ఒక్కసారిగా కాకుండా రోజుకింత పెంచడంతో ప్రజలు, పాత్రికేయులు కూడా దీనిని గుర్తించలేకపోయారు. అయితే గత మాసపు ఇంధన ధరలతో పోల్చుకుంటే ధరలపై భారీ పెంపు స్పష్టంగా కనబడుతోంది.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
పెట్రోల్ మరియు డీజల్ ధరలను మునపటి ఒక్కసారిగా రెండు లేదా మూడు రుపాయలు పెంచడం ప్రజల మీద తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే రోజూ వారి ఇంధన ధరల సవరణ ద్వారా ఒక రోజు తగ్గడం మరియు ఒక రోజు పెరగడం వంటివి ప్రజల మీద అంత ప్రభావం చూపవు.
మీకు నచ్చిన నగరంలో పెట్రోల్ మరియు డీజల్ ధరలు ఇక్కడ తెలుసుకోండి....