Just In
- 5 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 8 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 10 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 13 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
2021 ఏప్రిల్ నెలలో హోండా కంపెనీ విక్రయించిన కార్లు; పూర్తి వివరాలు
జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఇటీవల 2021 ఏప్రిల్ నెలలో జరిపిన అమ్మకాల నివేదికను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం, హోండా కంపెనీ భారత మార్కెట్లో మొత్తం 9,072 యూనిట్ల వాహనాలను అమ్మినట్లు తెలిసింది.
ప్రస్తుతం దేశం మొత్తం కరోనా వైరస్ సెకండ్ వేవ్ అధికంగా వుంది. దీని కారణంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో పాటు ఇతర వ్యాపార కార్యకలాపాలపై నిషేధం విధించబడింది. కావున ఈ ప్రభావం కార్ల అమ్మకాలను ప్రభావితం చేసింది. 2020 ఏప్రిల్లో కరోనా లాక్ డౌన్ సమయంలో దాదాపు దేశీయ మార్కెట్లో ఉన్న అన్ని కార్ల తయారీదారులకు సరైన అమ్మకాలు జరగలేదు.
హోండా కార్స్ ఇండియా యొక్క ఏప్రిల్ నెల అమ్మకాలను గమనిస్తే, ఈ అమ్మకాలు గత మార్చి నెల కంటే 27.72 శాతం వృద్ధి సాధించినట్లు తెలుస్తోంది. మార్చి 2021 లో కంపెనీ మొత్తం 7,103 యూనిట్ల కార్లను విక్రయించినట్లు గత నివేదికల ద్వారా తెలిసింది.
MOST READ:డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లో తప్పకుండా పాటించాల్సిన రూల్స్, ఇవే
హోండా కంపెనీ ఎగుమతి చేసిన కార్ల విషయానికి వస్తే, కంపెనీ గత నెలలో 970 యూనిట్ల కార్లను ఎగుమతి చేసినట్లు తెలిపింది. కంపెనీ ఏప్రిల్ 2021 లో విక్రయించిన కార్ల గురించి, హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ మరియు మార్కెటింగ్ అండ్ సేల్స్ డైరెక్టర్ రాజేష్ గోయల్ సమాచారం అందించారు.
భారతదేశంలో అధికంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి, దేశం మొత్తాన్ని ప్రభావితం చేసింది. ఈ మహమ్మారి ప్రస్తుతం ప్రజలను మాత్రమే కాకుండా ఆటో మొబైల్ పరిశ్రమపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిందని కూడా అయన అన్నారు. గత కొన్ని వారాలుగా దేశంలోని అనేక ప్రాంతాలు భద్రతలో పాలుపంచుకున్నాయి.
MOST READ:రోడ్డు నిర్మాణంలో రూ. 15 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్న కేంద్రం
కరోనా లాక్ డౌన్ మరియు పరిమితులపై మరింత విస్తరణ కారణంగా భారత కార్ల మార్కెట్లో కార్ల అమ్మకాలు కూడా 2021 మే నెలలో ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కార్ల తయారీ సంస్థ తన కొత్త తరం 2022 హోండా సివిక్ సెడాన్ను సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టబడింది.
దీనికి సంబంధించి సమాచారం ప్రకారం, కొత్త తరం హోండా సివిక్ ఈ ఏడాది చివర్లో యుఎస్ఎలో ప్రారంభించబడుతోంది, అయినప్పటికీ భారతదేశంలో ప్రారంభిస్తుందా, లేదా అనేదాని గురించి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. జపాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ తరువాత, కంపెనీ కొత్త తరం హోండా సివిక్ను చైనా మార్కెట్లో ప్రవేశపెట్టనుంది.
MOST READ:స్వామీజీని తాకిన పేస్ మాస్క్ ఎఫెక్ట్.. ఎలా అనుకుంటున్నారా?
త్వరలో రానున్న ఈ కొత్త కార్ యొక్క డిజైన్ విషయానికి వస్తే, ప్యారలల్ LED హెడ్ల్యాంప్ ఉంది, ఇంటిగ్రేటెడ్ LED DRLS మరియు బాడీ-కలర్ గ్రిల్ కలిగి ఉంటుంది. ఈ కారు యొక్క ముందు భాగంలోని డిజైన్ దాని కొత్త తరం హోండా హెచ్ఆర్-వి నుండి ప్రేరణ పొందినాట్లు తెలుస్తుంది.