స్పాట్ టెస్ట్లో కనిపించిన మహీంద్రా ఇకెయువి100.. వివరాలు
ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా తన ఎలక్ట్రిక్ వెహికల్ అయిన ఇకెయువి100 ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలను సిద్ధం చేస్తోంది. కంపెనీ నివేదికలు ప్రకారం ఇది 2021 ప్రారంభంలో ప్రవేశపెట్టినట్లు తెలిపింది. అయితే ఇప్పుడు మహీంద్రా ఇకెయువి100 స్పాట్ టెస్ట్ నిర్వహించింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

స్పాట్ టెస్ట్ లో కనిపించిన మహీంద్రా ఇకెయువి100 ముందు గ్రిల్ భాగం మరియు వెనుక భాగం కవర్ చేయబడ్డాయి. ఇక్కడ ఈ మహీంద్రా ఇకెయువి 100 రూపకల్పనలో పెద్ద మార్పులు లేవు, ఇది దాదాపు పెట్రోల్ మోడల్ మాదిరిగానే ఉంచబడింది. ఇది ఎలక్ట్రిక్ మోడల్ కావడంతో ఫ్యూయల్ లిడ్ తొలగించబడింది, కావున ఇది మహీంద్రా ఇకెయువి100 అని నిర్దారించబడింది.

ఇకెయువి100 యొక్క ముందుభాగంలో ఛార్జింగ్ పోర్ట్ చూడవచ్చు. అల్లాయ్ వీల్స్ స్థానంలో స్టీల్ వీల్స్ కనిపించినప్పటికీ, ఇది బేస్ వేరియంట్ కావచ్చు. మిగిలిన డిజైన్ ఎలిమెంట్స్ అదే విధంగా ఉంచబడింది, అయితే ఇందులో కూడా కొన్ని మార్పులు గమనించవచ్చు.

మహీంద్రా కంపెనీ రాబోయే కొన్ని నెలల్లో భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనుంది. మహీంద్రా ఇకెయువి100 ధర విషయానికి వస్తే ఇది రూ. 8.25 లక్షల (ఎక్స్షోరూమ్) వరకు ఉంటుంది. ఇది చూడటానికి చాలా సింపుల్ డిజైన్ కలిగి ఉంటుంది.

మహీంద్రా ఇకెయువి100 ఎలక్ట్రిక్ 40 కిలోవాట్ల బ్యాటరీని కలిగి ఉంది. ఈ లిక్విడ్-కూల్డ్ బ్యాటరీ ఈ ఎలక్ట్రిక్ వాహనానికి 150 కిలోమీటర్ల పరిధిని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది మంచి పరిధిని కూడా అందిస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎసి ఛార్జర్తో ఛార్జ్ చేసినప్పుడు 5 గంటల 45 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. అదే సమయంలో, ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి కేవలం 45 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

మహీంద్రా వీటితో పాటు మరి కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలను భారత మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతోంది. ఇవే కాకుండా కంపెనీ మహీంద్రా ఎక్స్యూవీ 300 ఎలక్ట్రిక్ వెర్షన్ను కూడా భారత్లో ప్రవేశపెట్టబోతోంది. ఈ మోడల్ కూడా టెస్టింగ్ దశలో ఉంది.


Click it and Unblock the Notifications








