Just In
- 5 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 6 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 8 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 11 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- Sports PBKS vs MI: నిప్పులు చెరిగిన బుమ్రా.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన ముంబై ఇండియన్స్!
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
2021 జూన్లో నిస్సాన్ అమ్మకాలు హవా.. భారీగా పెరిగిన వృద్ధి
2021 జూన్ నెల ముగిసింది, ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో ఇప్పటికే చాలామంది వాహన తయారీదారులు తమ అమ్మకాల నివేదికను విడుదల చేశారు. ఇందులో భాగంగానే ప్రముఖ వాహన తయారీదారు నిస్సాన్ తన జూన్ నెల అమ్మకాల నివేదికను విడుదల చేసింది. నిస్సాన్ అమ్మకాల గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
కంపెనీ అందించిన సమాచారం ప్రకారం 2021 జూన్ నెలలో మొత్తం 3,503 యూనిట్ల కార్లను విక్రయించినట్లు తెలిసింది. 2020 జూన్ నెలతో పోలిస్తే దాదాపు 508 శాతం వృద్ధిని సాధించినట్లు తెలిసింది. సబ్-కాంపాక్ట్ మరియు కాంపాక్ట్ కార్లు ఈ అమ్మకలకు గణనీయంగా దోహదం చేశాయని కంపెనీ తెలిపింది.
ఈ విభాగంలో ప్రస్తుతం కంపెనీ నిస్సాన్ మాగ్నైట్ మరియు నిస్సాన్ కిక్లను విక్రయిస్తోంది. మాగ్నైట్ ఎస్యూవీని దేశీయ మార్కెట్లో లాంచ్ చేసినప్పటినుంచి 15 వేల యూనిట్లు డెలివరీ చేసినట్లు కంపెనీ అధికారికంగా తెలిపింది. కరోనా మహమ్మారి నివారణకు అమలు చేసిన లాక్ డౌన్ సమయంలో తగ్గినా ఉత్పత్తిని తిరిగి గదిలోకి తీసుకురావడానికి, కంపెనీ ఇప్పుడు మూడవ షిఫ్ట్లో ఉత్పత్తిని ప్రారంభిస్తుంది.
ఇటీవల కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, తన కార్లపై సబ్స్క్రిప్షన్ ప్లాన్ ప్రారంభించింది. ఈ ప్లాన్ కింద వినియోగదారులు నెలవారీ సభ్యత్వంతో నిస్సాన్ మాగ్నైట్ మరియు కిక్స్ ఎస్యూవీని కొనుగోలు చేయవచ్చు. ఇందులో కంపెనీ కొత్త కారును జీరో డౌన్ పేమెంట్ వద్ద వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. ఈ ప్లాన్ కింద కొనుగోలు చేసిన కారుపై కస్టమర్ బీమా మరియు నిర్వహణ ఛార్జీలను కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు నిస్సాన్ మరియు డాట్సన్ కార్లు డిఫెన్స్ క్యాంటీన్లో కూడా అందుబాటులో ఉంచబడ్డాయి. ఆర్మీ సిబ్బంది ఇప్పుడు దేశవ్యాప్తంగా క్యాంటీన్ స్టోర్ డిపార్ట్మెంట్ ద్వారా అందుబాటులో ఉన్న డిస్కౌంట్స్ మరియు ఆఫర్లను పొందవచ్చు. ఈ కొత్త పద్దతి అమాంకాలను మరింత పెంచడానికి అనుకూలంగా ఉంటుంది.
సిఎస్డి లబ్ధిదారుల కోసం కారు కొనుగోలు ప్రక్రియ ఆన్లైన్లో ఉంది, ఇందులో కొనుగోలు చేయాల్సిన వెహికల్ ఆప్సన్, డీలర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ వంటివి కూడా ఉన్నాయి. క్యాంటీన్ కార్డ్ ధృవీకరణ, కెవైసి, చెల్లింపు మొదలైనవి ఈ ప్రక్రియలో డిజిటలైజ్ చేయబడ్డాయి. క్యాంటీన్ల నుండి వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రత్యేక పోర్టల్ కూడా జారీ చేయబడింది.
నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్యూవీ ఎక్స్ఇ (బేస్), ఎక్స్ఎల్ (మిడ్), ఎక్స్వి (హై) మరియు ఎక్స్వి (ప్రీమియం) నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులోని ప్రతి వేరియంట్ కూడా న్యాచురల్ పెట్రోల్ మరియు టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.
ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, మాగ్నైట్లోని 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ గరిష్టంగా 99 బిహెచ్పి పవర్ను మరియు 160 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులోని మ్యాన్యువల్ గేర్బాక్స్ వెర్షన్ లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజీని మరియు ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 17.7 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
అలాగే, ఈ కారులోని 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 72 బిహెచ్పి పవర్ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులో ఆటోమేటిక్ గేర్బాక్స్ ఉండదు, ఇది కేవలం మ్యాన్యువల్ గేర్బాక్స్తో మాత్రమే లభిస్తుంది. ఇది లీటరుకు 18.75 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుంది.
ఈ కాంపాక్ట్ ఎస్యూవీ భారత మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అంతే కాదు ఈ ఎస్యూవీ భారతీయ మార్కెట్ నుంచిహ్ ఇండోనేషియా, దక్షిణాఫ్రికా మరియు నేపాల్ దేశాలకు కూడా ఎగుమతి అవుతోంది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో ఈ ఎస్యూవీకి ఎంత ఆదరణ ఉందొ తెలుస్తోంది.