Just In
- 4 hrs ago
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- 6 hrs ago
భారత్లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- 7 hrs ago
గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్లైన్లోనే..
- 8 hrs ago
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
Don't Miss
- News
మెహబూబా ముఫ్తీకి ఈడీ సమన్లు -ప్రశ్నించినందుకు కేంద్రం ప్రతీకారమన్న పీడీపీ చీఫ్
- Finance
ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన
- Sports
ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ
- Movies
‘A’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
- Lifestyle
పడకగదిలో ధైర్యంగా కార్యం కొనసాగించేందుకు ఈ చిట్కాలు పాటించండి...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విడుదలకు సిద్ధమవుతున్న ఫోక్స్వ్యాగన్ టైగన్; లేటెస్ట్ స్పై చిత్రాలు
ఫోక్స్వ్యాగన్ ఇండియా ఈ ఏడాది కొన్ని సరికొత్త కార్లను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో అత్యంత పాపులర్ అయిన సరికొత్త ఫోక్స్వ్యాగన్ టైగన్ ఎస్యూవీ 2021లో భారత్లో విడుదల చేసేందుకు కంపెనీ సిద్ధమవుతోంది.

కంపెనీ ఈ మోడల్ను ఇప్పుడు భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. ఈ పరీక్షలు తుది దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. భారత మార్కెట్ కోసం ఫోక్స్వ్యాగన్ మరియు స్కొడా కంపెనీలు సంయుక్తంగా చేపట్టిన ఇండియా 2.0 ప్రాజెక్ట్లో భాగంగా అనేక కార్లను ఇరు కంపెనీలు ప్రవేశపెట్టనున్నాయి.

ఈ ప్రాజెక్ట్లో భాగంగానే ఫోక్స్వ్యాగన్ టైగన్ కూడా రానుంది. ఈ ఎస్యూవీని తొలిసారిగా 2020 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించారు. ఫోక్స్వ్యాగన్ టైగన్ ఎస్యూవీని కూడా ఎమ్క్యూబి ఏ0 ఐఎన్ ప్లాట్ఫామ్పైనే నిర్మించనున్నారు. ఇదే ప్లాట్ఫామ్పై స్కొడా కుషాక్ అనే ఎస్యూవీని కూడా అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే.
MOST READ:రైల్వే ట్రాక్ వద్ద సహనం లేకుంటే ఏమవుతుందో తెలుసా.. అయితే వీడియో చూడండి

ఈ నేపథ్యంలో, స్కొడా కుషాక్ మరియు ఫోక్స్వ్యాగన్ టైగన్ రెండు మోడళ్లలో అనేక పోలికలు ఉండొచ్చని అంచనా. అంతేకాకుండా, ఈ రెండు మోడళ్లలో ఉపయోగించే విడిభాగాలు మరియు పరికరాలు కూడా ఒకేలా ఉండే అవకాశం ఉంది. టైగన్ ధరను అందుబాటులో ఉంచేందుకు కంపెనీ ఈ మోడల్ను ఎక్కువ భాగం స్థానికంగానే తయారు చేయనుంది.

కొత్త ఫోక్స్వ్యాగన్ టైగన్లో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్లతో కూడిన ఎల్ఈడి హెడ్ల్యాంప్స్, క్రోమ్తో ఫినిష్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, 17ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడి స్ట్రిప్ ద్వారా కనెక్ట్ చేయబడిన ఎల్ఈడి టెయిల్ లైట్స్, రూఫ్ స్టాప్ ల్యాంప్, సిల్వర్-ఫినిష్డ్ రూఫ్ రైల్స్, ఎలక్ట్రిక్ సన్రూఫ్, బంపర్లపై సిల్వర్ ఎలిమెంట్స్ మరియు ముందు, వెనుక రెండు వైపులా ఫాక్స్ స్కిడ్ ప్లేట్లతో కూడిన స్పాయిలర్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
MOST READ:బ్యాంకులకు ఎగనామం పెట్టాడు ; లగ్జరీ కార్స్ కొనేసాడు

అలాగే, ఇందులోని ఇంటీరియర్స్ను గమనిస్తే, బ్రాండ్ యొక్క లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో పాటుగా అనేక ఇతర ఫీచర్లు మరియు పరికరాలు ఇందులో లభిస్తాయి. ఈ ఎస్యూవీలో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో కూడిన పెద్ద టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పూర్తి-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, వైర్లెస్ ఛార్జింగ్, స్పోర్టీ ఆల్-బ్లాక్ క్యాబిన్, సాఫ్ట్-టచ్ మెటీరియల్స్ మొదలైన ఫీచర్లు ఉండన్నాయి.

ఇక ఇంజన్ విషయానికి వస్తే, కొత్త ఫోక్స్వ్యాగన్ టైగన్ బ్రాండ్ యొక్క టిఎస్ఐ శ్రేణి పెట్రోల్ ఇంజన్లను కలిగి ఉంటుంది. ఇదే ఇంజన్లను ఇతర మోడళ్లలో కూడా ఉపయోగిస్తున్నారు. టైగన్ ఎస్యూవీలో 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ను అమర్చనున్నట్లు సమాచారం. ఇది సిక్స్-స్పీడ్ మాన్యువల్ లేదా సెవన్-స్పీడ్ డిఎస్జి ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది.
MOST READ:ఇండియా To సింగపూర్ : బస్లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి

ఫోక్స్వ్యాగన్ టైగన్ మిడ్-సైజ్ ఎస్యూవీ విభాగంలో విడుదల కానుంది. ఇది ఈ విభాగంలో ఇప్పటికే పాపులర్ అయిన హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, నిస్సాన్ కిక్స్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఈ మోడల్ని ఇప్పటికే కంపెనీ వెబ్సైట్లో అప్డేట్ చేశారు. మరికొద్ది నెలల్లోనే ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.