Just In
- 2 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 2 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 4 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 5 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చెన్నైలో నేటి నుంచి సీట్ బెల్ట్ రూప్ తప్పనిసరి!
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో నేటి కారు నడిపే వారు సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి కానుంది. ఈ నిబంధనను అతిక్రమించన వారిపై అక్కడి ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాను విధించనున్నారు. వాస్తవానికి ఈ నిబంధన గడచిన వారంలోనే అమలు కావల్సి ఉండగా, తమిళనాడు ట్రాఫిక్ పోలీసులు దీనిని మరో వారం వాయిదా వేసి, నేటి నుంచి అమల్లోకి తీసుకువచ్చేలా చేశారు.
కేవలం వాహనం నడిపే వారే కాకుండా, ఫ్రంట్ సీట్లో కూర్చునే ప్యాసింజర్లు కూడా సీట్ బెల్టులను ధరించడం తప్పనిసరి. ఈ నిబంధన టాక్సీ డ్రైవర్లు, అందులో ప్రయాణించే ప్యాసింజర్లకు కూడా వర్తిస్తుంది. ఈ అవగాహన క్యాంపైన్కు మంచి స్పందన లభిస్తోందని, మోటారిస్టులందరూ ఈ నిబంధనకు కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నామని ట్రాఫిక్ అధికారులు చెప్పారు.
సీట్ బెల్టులు ధరించకపోయినట్లయితే, అత్యవసర సమయాల్లో ప్రమాదం జరిగినప్పుడు ఫ్రంట్ సీట్లలో ఉండే డ్రైవర్, ప్యాసింజర్లకు తీవ్ర గాయాలు కావటం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే ఆస్కారం కూడా ఉంటుంది.
సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్, 1989లోని సెక్షన్ 138 (3) ప్రకారం, వాహనాలు చలనంలో ఉన్నప్పుడు సీట్ బెల్టును ఉపయోగించటం తప్పనిసరి. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి మోటార్ వెహికల్ యాక్ట్, 1988లోని సెక్షన్ 177 ప్రకారం మొదటిసారి జరిమానాగా రూ.100 లను వసూలు చేస్తారు. ఆ తర్వాత కూడా ఇదే తప్పుకు పాల్పడినట్లయితే, ప్రతిసారి రూ.300ల చొప్పున జరిమానా వసూలు చేస్తారు.