ముగిసిన 2014 ఆటో ఎక్స్పో; 69 కొత్త వాహనాల లాంచ్
ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే భారత ఆటోమొబైల్ ఫెస్టివల్ 'ఆటో ఎక్స్పో' నిన్నటితో (ఫిబ్రవరి 11, 2014) ముగిసింది. ఫిబ్రవరి 5, 2014వ తేదీన ప్రారంభమైన ఈ 12వ ఎడిషన్ ఆటో ఎక్స్ను గతంలో నిర్వహించిన వేదిక (ప్రగతి మైదాన్)పై కాకుండా, ఈసారి గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్ వద్ద నిర్వహించారు.
ఫిబ్రవరి 5 నుంచి 11వ తేది వరకు మొత్తం ఏడు రోజుల పాటు జరిగిన ఈ ఆటో ఎక్స్పో 2014లో ఫిబ్రవరి 5, 6 తేదీలను కేవలం ప్రెస్ సందర్శనకు మాత్రమే కేటాయించగా, ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు సాధారణ ప్రజానీకం యొక్క సందర్శనార్థం కేటాయించారు. ప్రెస్ డేస్లో భాగంగా, మొదటి రెండు రోజుల్లో 60,000 మందికి పైగా మీడియా ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ 12వ ఎడిషన్ ఆటో ఎక్స్కు మొత్తం 5,61,000 మందికి పైగా వీక్షకలు విచ్చేశారు. ఈ సమయంలో సుమారు 69 కొత్త వాహనాలను వివిధ ఆటోమొబైల్ కంపెనీలు విడుదల చేశాయి. ఇంకా 26 కొత్త కార్లకు వరల్డ్ ప్రీమియర్ నిర్వహించారు. కాగా.. విడిభాగాలకు సంబంధించిన ఆటో ఎక్స్పోను ఇదివరకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఫిబ్రవరి 6 నుంచి 9వ తేది వరకు నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని మా డ్రైవ్స్పార్క్ బృందం ప్రత్యక్షంగా కవర్ చేసింది. ఈ 2014 ఆటో ఎక్స్పోకి సంబంధించిన అన్ని అప్డేట్లను ఈ లింక్పై కానీ లేదా క్రింది ఫొటోపై కానీ క్లిక్ చేసి పొందవచ్చు.


Click it and Unblock the Notifications









