Get the Best Drivespark Stories
Get the Best Drivespark Stories
Unblock Now
notifications_off
For Daily Email Alerts
Just In
- 12 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 13 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 15 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 18 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- Movies Karthika Deepam 2 నా బిడ్డకు దూరంగా ఉండు.. కార్తీక్కు దీప షాక్
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఏపి సిఎం సహాయ నిధికి 5 పికప్లను ఇచ్చిన ఇసుజు ఇండియా
Four Wheelers
oi-Ravi
By Ravi
సాగరతీర నగరం విశాఖపట్నం ఇటీవల సంభవించిన హుధుద్ తుఫాను ధాటికి చిన్నాభిన్నమైన సంగతి తెలిసినదే. ఈ నగరాన్ని పునరుద్ధరించేందుకు ఇప్పటికే అనేక సంస్థలు, ప్రముఖులు స్వచ్ఛందగా విరాళాలను ప్రకటిస్తున్నాయి. తాజాగా.. జపనీసన్ ఆటోమొబైల్ దిగ్గజం ఇసుజు మోటార్స్ ఇండియా కూడా తమ సాయం చేసేందుకు ముందుకు వచ్చింది.
ఇందులో భాగంగా 5 డి-మ్యాక్స్ పికప్ వాహనాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందించింది. ఈ ఇసుజు 5 డి-మ్యాక్స్ పికప్ వాహనాల తాళం చెవులను ఇసుజు మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ టకాషి కికుచి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి విశాఖపట్నం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, 'ఈ కష్టకాలంలో కార్పోరేట్లు మనకు అండగా నిలిచేందుకు చేరుకోవడం హృదయాన్ని కదిలిస్తోంది. ఏపిలో తమ తయారీ కేంద్రాన్ని నెలకొల్పిన మొదటి వాహన తయారీదారు ఇసుజు. అంతేకాకుండా, ఉపశమన ప్రయత్నాలకు వాహనాలను విరాళంగా అందించిన మొదటి కార్పొరేట్ సంస్థ కూడా ఇసుజునే కావటం విశేషం అన్నారు.
విశాఖపట్నం పునర్నిర్మాణంలో ముందుకు వస్తున్న బాధ్యతాయుత కార్పోరేట్ సంస్థలన్నింటికీ సిఎం అభినందనలు తెలియజేశారు. కాగా.. ఇసుజు మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ టకాషి కికుచి మాట్లాడుత.. ఇసుజు ఎల్లవేళలా తన కార్పోరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా పర్యావరణ పరిరక్షణ, విద్య, జీవినోపాధి సాయం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చిందని, 2011లో ఆస్ట్రేలియాలో వచ్చిన వరదలు, 2011లో జపాన్లో వచ్చిన భూకంపం, 2013లో ఫిలిప్పీన్స్లో వచ్చిన టైఫూన్ యోలండా విపత్తు ఏదైనా సరే, తమ వంతు సాయం చేసేందుకు ఇసుజు ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు.
Comments
Most
Read
Articles
డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Isuzu Motors India ahs donated 5 D-MAX pickup trucks to the Government of Andhra Pradesh. The donated vehicles will be used by Greater Vishakapatnam Municipal Corporation (GVMC) to support disaster relief management in the area.
Story first published: Thursday, November 20, 2014, 16:39 [IST]
Other articles published on Nov 20, 2014