ప్రొడక్షన్కు సిద్దమైన 2017 నిస్సాన్ "నోట్"
నిస్సాన్ మోటార్స్ తమ 2017 నోట్ యొక్క ప్రొడక్షన్ను ప్రారంభించనట్లు ప్రకటించింది. జపాన్లోని ఒప్పామాలో ఉత్పత్తికి సిద్దమైన 2017 నిస్సాన్ నోట్ ను నవంబర్లో విడుదల చేయనుంది.
నిస్సాన్ మోటార్స్ తమ 2017 నిస్సాన్ నోట్ ప్రొడక్షన్కు పూర్తి స్థాయిలో సిద్దమైనట్లు ఓ ప్రకటనలో తెలిపింది. జపాన్లో ఉన్న ఒప్పామాలోని నిస్సాన్ ప్లాంటులో ఈ 2017 నోట్ ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు నిస్సాన్ తెలిపింది.

నవంబర్ మొదటి వారంలో 2017 నిస్సాన్ నోట్ను మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

2017 నోట్కు సంభందించి నిస్సాన్ విడుదల చేసిన బ్రోచర్ల ప్రకారం నోట్ ఇ-పవర్ ఎక్స్ మరియు ఇ-పవర్ మెడలిస్ట్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనున్నట్లు తెలిసింది.

నిస్సాన్ ఈ 2017 నోట్కు అప్డేటెడ్ అధునాతన హెడ్ ల్యాంప్స్ మరియు వి-మోషన్ ఫ్రంట్ గ్రిల్, కొత్తగా డిజైన్ చేయబడిన లోయర్ గ్రిల్ మరియు సరికొత్త బంపర్లో ఫాగ్ ల్యాంప్స్ను ఇముడింపచేశారు.

వెనుక వైపు డిజైన్ పరంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న నోట్ను దాదాపుగా పోలి ఉంది. అయితే క్లస్టర్ డిజైన్ మరియు రీ డిజైన్ చేసిన బంపర్ను కొత్తగా అందించారు.

నోట్ లోని టాప్ ఎండ్ వేరియంట్ ఇ-పవర్ మెడలిస్ట్లో డ్యూయల్ టోన్ లెథర్ అప్హోల్స్ట్రే గల ప్రీమియమ్ వైట్ ఇంటీరియర్ కలదు.

నోట్ టాప్ ఎండ్ వేరియంట్లో లెథర్ తొడుగులు గల స్టీరింగ్ వీల్, ఆర్మ్ రెస్ట్, డోర్ ప్యానల్ ప్రత్యేక రంగులో సెంటర్ కన్సోల్ కలదు.

నోట్ లోని ఇ-పవర్ హైబ్రిడ్ మోడల్ హైబ్రిడ్ డ్రైవ్ ట్రైన్తో అందుబాటులోకి రానుంది. అంతర్గత కంబర్షన్ గల పెట్రోల్ గల ఇ-పవర్ వేరియంట్లోని ప్రంట్ వీల్స్కు ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానం ఉండనుంది.

నిస్సాన్ తెలిపిన వివరాల మేరకు నోట్ హైబ్రిడ్ వేరియంట్ లీటర్కు 32 కిలోమీటర్లు ఇవ్వగలదు.

నోట్ ఇ-పవర్ ఎక్స్ ధర 12.6 లక్షలు మరియు నోట్ ఇ-పవర్ మెడలిష్ట్ ధర రూ. 14.4 లక్షలు (మన ఇండియన్ రుపాయల్లో)గా ఉండనున్నాయి.

- సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో ఎలక్ట్రిక్ బస్సు ప్రయాణం
- ఎనిమిది కొత్త ఉత్పత్తులను విడుదల చేయనున్న నిస్సాన్
- ఇండియన్ ఆటోమొబైల్ చరిత్రలో బిగ్ డీల్


Click it and Unblock the Notifications








