తలతిక్క డ్రైవర్లందరూ ఇక్కడే ఉన్నారంటున్న నివేదికలు
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB)వారి నివేదికల ప్రకారం వివిధ ప్రాంతాల్లోని రహదారుల్లో అతిగా కోపాన్ని ప్రదర్శించే వారి సంఖ్యను గురించి వివరాలు తెలిపింది. ఈ రికార్డుల పరంగా కేరళలోని డ్రైవర్లు రోడ్ల మీద అతిగా కోపాన్ని ప్రదర్శిస్తున్నారని తెలిసింది.

2014 లో సుమారుగా 4,09,899 మంది డ్రైవర్లు అతి కోపాన్ని ప్రదర్శించారు మరియు 2015 లో ఈ సంఖ్య 4,51,069 మంది చేరుకుంది. అంటే అత్యంత కోపంగా వ్యవహరించే డ్రైవర్ల సంఖ్య సుమారుగా 10 శాతం మేర పెరిగింది.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారి ప్రకారం కేరళ మొదటి స్థానంలో ఉంది. కేరళలో సుమరుగా 1,31,000 కేసులు ఈ సందర్భాల్లో నమోదయ్యాయి.

మిగతా స్థానాల్లో తమిళనాడు 54,253, మధ్య ప్రదేశ్ 41,529 మరియు కర్ణాటక 34,201 కేసులతో వరుసగా ఉన్నాయి.

కేరళ విషయానికి వస్తే అత్యంత కోపాన్ని ప్రదర్శించే డ్రైవర్లలో 12,440 కేసులు కేవలం తిరువనంతపురం నుండి నమోదయ్యాయి. మిగతా స్థానాల్లో కొచ్చి, త్రిస్సూర్ మరియు కోజిఖోడ్ వంటి నగరాలు ఉన్నాయి.

అయితే దేశ రాజదాని ఢిల్లీ పరిధిలోకి వస్తే ఇక్కడ 7,411 కేసులు నమోదయ్యాయి. మరియు తమిళనాడులోని చెన్నైలో 6,516 కేసులు నమోదయ్యాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాలు ఈ జాబితాకు దూరంగా ఉన్నాయి.

- టాటా సింగూర్ ప్లాంటుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పు: అసలేమైంది ?
- PSLV కన్నా మరింత చౌకైన రాకెట్ను సృష్టించి ఇస్రో శాస్త్రవేత్తలు
- అక్కినేని నాగార్జున 57 వ పుట్టిన రోజు కానుకగా బిఎమ్డబ్ల్యూ


Click it and Unblock the Notifications








