Just In
- 12 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 13 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 16 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 18 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- Movies Karthika Deepam 2 April 24th: దీప తాళికట్టిన భార్య.. నరసింహ చెప్ప పగలగొట్టిన సుమిత్ర
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హైబ్రిడ్ కార్ల మీద 15 శాతం సెస్ తొలిగించే ఆలోచనలో ఉన్న కేంద్రం
ఆగష్టు 5, 2017 న సమావేశం కానున్న జిఎస్టి మండలి హైబ్రిడ్ వాహనాల మీద సెస్ మినహాయింపు గురించి చర్చించనున్నట్లు తెలిసింది.
భారత ఆర్థిక రంగంలో ట్యాక్స్ విధానం అత్యంత ముఖ్యమైనది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకమైన ట్యాక్స్ ఉండేది. అయితే తాజాగా కేంద్రం ప్రభుత్వం ఒకే దేశం ఒకే ట్యాక్స్ అంటూ పరిచయంచ చేసిన వస్తు మరియు సేవల పన్ను అమల్లోకి వచ్చింది. కొన్ని ప్రొడక్ట్స్ మినహా దాదాపు అన్ని ఉత్పత్తులను జిఎస్టి పరిధిలోకి తీసుకొచ్చారు.
అయితే దేశ ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర వహించే ఆటోమొబైల్ రంగం మీద స్వాగతించిన రీతిలోనే ట్యాక్స్ నిర్ణయించారు. కానీ పర్యావరణహితమైన హైబ్రిడ్ వాహనాల మీద జిఎస్టి పేరుతో ట్యాక్స్ విపరీతంగా పెంచేశారు. దీంతో హైబ్రిడ్ వాహనాలను ఉత్పత్తి చేసే సంస్థలు, వాటి మీద ట్యాక్స్ తగ్గించాలని పలుమార్లు జిఎస్టి మండలిని అభ్యర్థించాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు.
Recommended Video
కానీ తాజాగా అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం, హైబ్రిడ్ వాహనాల మీద 15 శాతం మేర సెస్ తగ్గించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆగష్టు 5, 2017 న సమావేశం కానున్న జిఎస్టి మండలి హైబ్రిడ్ వాహనాల మీద సెస్ మినహాయింపు గురించి చర్చించనున్నట్లు తెలిసింది.
జిఎస్టి ప్రకారం, వాహనాల మీద గరిష్టంగా 28 శాతం ట్యాక్స్ నిర్ణయించిద. వాహనాలను వివిధ కెటిగిరీలుగా విభజించి ఒక్కో కెటగిరీ మీద అదనపు సెస్ విధించింది. ప్రస్తుతం హైబ్రిడ్ ఉత్పత్తుల మీద 28 శాతం ట్యాక్స్ మరియు 15 శాతం సెస్ కలుపుకొని మొత్తం 43 ట్యాక్స్ ఉంది. దీంతో అదనంగా విధించిన 15 శాతం సెస్ను తొలగించే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో మారుతి సుజు, టయోటా మరియు మహీంద్రా ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలు హైబ్రిడ్ వాహనాలను విక్రయిస్తున్నారు. జిఎస్టి అమలైన తరువాత ఈ వాహనాల ధరలు గరిష్టంగా రూ. 1.5 లక్షలు పెరిగాయి. ఒకవేళ 15 శాతం మినహాయింపు అమల్లోకి వస్తే, హైబ్రిడ్ కార్ల పాత ధరల కన్నా మరింత తగ్గిపోనున్నాయి.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
పెట్రోల్ మరియు డీజల్ ఇంధనంతో నడిచే వాహనాలతో పోల్చుకుంటే హైబ్రిడ్ వాహనాలు తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తాయి. అయితే కాలుష్య కారకవాహనాల మీద ట్యాక్స్ తగ్గించడం మరియు పర్యావరణహితమైన వాహనాల మీద ట్యాక్స్ పెంచడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే రానున్న ఆగష్టు 5, 2017 సమావేశంలో హైబ్రిడ్ వాహనాల మీద 15 శాతం సెస్ మినహాయింపు చేస్తే, ఎకో ఫ్రెండ్లీ వాహనాల వినియోగంపైప్రజలను చైతన్యపరచవచ్చు.