Just In
- 17 min ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
- 1 hr ago టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- 2 hrs ago ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- 2 hrs ago దిశా పటానీ కార్ల ప్రపంచం చూసారా.. చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..
Don't Miss
- Movies Till Square Review: నాన్ స్టాప్ ఫన్ అండ్ లాఫింగ్ రైడ్.. టిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ!
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జిఎస్టిలో సవరణ: వాహన రంగంపై సెస్ ఎత్తివేసిన కేంద్రం
ఏకీకృత పన్ను విధానం సేల్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ద్వారా వాహన రంగంపై అమలు కానున్న తొలగిస్తున్నట్లు కేంద్ర తెలిపింది. అనగా నిర్ధిష్ట టాక్స్ మినహాయిస్తే, అదనపు సెస్ ను చెల్లించాల్సిన అవసరం లేదు.
నూతన పన్ను విధానం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనుగుణంగా కార్లు మరియు బైకుల మీద నిర్ధిష్ట పన్ను 28 శాతం తో పాటు వాహనాల రేంజ్ ఆధారంగా 1 నుండి 3 శాతం వరకు సెస్ చెల్లించాలని కేంద్రం ప్రభుత్వం జిఎస్టిలో పొందుపరించింది. అయితే అన్ని వాహననాల మీద నిర్ధిష్ట పన్ను 28 శాతం మినహాయిస్తే, ఎలాంటి సెస్ చెల్లించనవసరం లేదని ప్రకటించింది.
పరిశ్రమల(డెవలప్మెంట్ మరియు రెగ్యులేషన్) చట్టం 1951 అనుగుణంగా, 2017 పన్ను విధింపు సవరణ చట్టం ప్రకారం - ఆటోమొబైల్స్ (కార్లు మరియు బైకులు) మీద ఎలాంటి సెస్ చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జిఎస్టి మేరకు, 1,200సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న పెట్రోల్ కార్లు మీద 28 శాతం ట్యాక్స్తో పాటు 1 శాతం సెస్ చెల్లించాలి, అదే విధంగా 1,500సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న డీజల్ కార్లు మీద 28 శాతం ట్యాక్స్తో పాటు 3 శాతం సెస్ చెల్లించాల్సి ఉండేది.
టూ వీలర్ల విషయానికి వస్తే, 350సీసీ కన్నా ఎక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లు 28 శాతం ట్యాక్స్ చెల్లిస్తూ, అదనంగా మూడు శాతం సెస్ చెల్లించాలని జిఎస్టిలో పొందుపరిచింది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో జూలై 1, 2017 నుండి అమల్లోకి రానున్న జిఎస్టి ప్రకారం, కార్లు మరియు బైకులు రెండింటి మీద ఉన్న 28 శాతం ట్యాక్స్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. వీటి మీద ఉన్న సెస్ను పూర్తిగా తొలగించింది.
వస్తు మరియు సేవల పన్ను సులభంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ రకాల సెస్లను ఎత్తివేస్తూ వస్తు సేవల పన్ను(GST)ను మరింత సులభతరం చేసే క్రమంలో వాహన రంగం మీద ఉన్న అన్ని రకాల సెస్ ఎత్తివేసింది.
చిన్న కార్ల మీద సెస్ అధికంగా ఉండటంతో చిన్న కార్ల ఉత్పత్తి విక్రయాలతో పాటు ఎగుమతుల మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతున్న ఇండియన్ ఆటోమొబైల్ నిపుణులు ఆందోళన చెందారు. దీంతో దేశీయ చిన్న కార్ల పరిశ్రమ కుదేలయ్యే అవకాశం కూడా కనిపించింది.