విజయవాడలో ఘోర బస్సు ప్రమాదం
విజయవాడలో బస్సు మీదుకు దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ సమీపంలో ఏపిఎస్ఆర్టిసి బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఈ ప్రమాదం సంభవించింది.
విజయవాడలో బస్సు మీదకు దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ సమీపంలో ఏపిఎస్ఆర్టిసి బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఈ ప్రమాదం సంభవించింది.

రాజధానిలో ఓ ఆర్టిసి బస్సు బ్రేకులు ఫెయిల్ అవడంతో అదుపుతప్పి ద్విచక్ర వాహనాదారులను తొక్కించుకుంటూ వెళ్లింది. ఈ ఘోర ఘటనలో ముగ్గురు మృతి చెందారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
Recommended Video


బస్సు వాంబే కాలనీ మీదుగా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్కు వచ్చే మార్గంలో సరిగ్గా అజిత్ సింగ్ ఫ్లైఓవర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కుర్షిద్(32), అశ్రత్(12) మరణించగా, మరో వ్యక్తి వివరాలు తెలియరాలేదు.

ఏపిఎస్ ఆర్టిసికి చెందిన ఎక్స్ప్రెస్ బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో నియంత్రణ కోల్పోయింది. ఎదురుగా ఉన్న రిక్షా మరియు టూ వీలర్లను ఎక్కించుకుంటూ ముందున్న టిప్పర్ను ఢీకొని ఆగిపోయింది.

ఈ రోడ్డు చాలా పాతది మరియు రద్దీతో కూడుకున్నది కావడంతో బస్సులు వెళ్లడం అంత సురక్షితం కాదు, అయినప్పటికీ బస్సులు ఇదే మార్గంలో వెళుతున్నాయని పోలీసులు తెలిపారు.

కుర్దిష్ మరియు అశ్రిత్ సిటీలోని తమ బంధువుల ఇంటికి వెళుతుంటే అకాల మృత్యువు వారిద్దరినీ తీసుకెళ్లింది. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటే బాగుటుంది.
It's terribly sad when a bus that has a failed brake runs amok. 3 killed in this horrific accident in #Vijayawada #CCTV pic.twitter.com/HruyCgGk0F
— Paul C Oommen (@Paul_Oommen) October 27, 2017
ప్రమాదం జరిగిన తీరును అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఫుటేజిని వీడియోలో చూడగలరు.


Click it and Unblock the Notifications








