Just In
- 5 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 7 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 9 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 12 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- Sports PBKS vs MI: ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్లో ఓడాం: సామ్ కరణ్
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
2019 నాటికి ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తాం: వోల్వో
వోల్వో ఇండియా ప్రణాళికల్లో భాగంగా 2018 నాటికి తమ అన్ని కార్లలో హైబ్రిడ్ టెక్నాలజీని మరియు 2019 నాటికి తొలి ఎలక్ట్రిక్ కారును ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తామని వోల్వో ప్రకటించింది.
ఆటోమొబైల్ పరిశ్రమలో అత్యాధునిక టెక్నాలజీ ఆవిష్కరణ మరియు అద్బుతమై సేఫ్టీ ఫీచర్లను అందివ్వడంలో స్వీడన్కు చెందిన వోల్వో పేరుగాంచింది. ఇప్పడు ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లోకి ప్రవేశించడానికి వోల్వో సిద్దం అవుతోంది.
వోల్వో ఇండియా ప్రణాళికల్లో భాగంగా 2018 నాటికి తమ అన్ని కార్లలో హైబ్రిడ్ టెక్నాలజీని మరియు 2019 నాటికి తొలి ఎలక్ట్రిక్ కారును ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తామని వోల్వో ప్రకటించింది.
నూతన జిఎస్టి ప్రకారం హైబ్రిడ్ వాహనాల మీద ట్యాక్స్ రేట్లు కాస్త నిరాశనే మిగిల్చినప్పటికీ, వోల్వో తమ ప్రణాళికల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. బెంగళూరులోని వోల్వో ప్లాంటు 2018 నుండి ఉత్పత్తిని ప్రారంభించనుంది. కాబట్టి, ఎక్స్సి90 మరియు ఎస్90 లను పూర్తిగా ఇండియాలోనే తయారుచేయనుంది.
వోల్వో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ టామ్ వాన్ బాన్స్డోర్ఫ్ మాట్లాడుతూ, "దేశీయంగానే ఉత్పత్తి జరగతుండటంతో దీనికి పోటీగా ఉన్న కార్ల ధరలకు సమానంగా వీటి ధరలు ఉండనున్నాయి. ప్రాంతీయంగా ఉత్పత్తి చేయడంతో ధరలు భారీగా తగ్గే అవకాశాలు పెద్దగా ఉండకపోవచ్చని తెలిపారు."
2032 నాటికి ఇండియాలో కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి గురించి వోల్వో స్పందిస్తూ, ప్రభుత్వాలు ఇలాంటి లక్ష్యాలను పెట్టుకోవడం ద్వారా ఎలక్ట్రిక్ కార్లను ప్రోత్సహించడంలో మంచి మార్పులు జరగనున్నాయని పేర్కొంది.
వోల్వో వద్ద ఉన్న ఎక్స్సి60 మరియు ఎస్90 కార్ల ఆధారంగానే ఎలక్ట్రిక్ కార్లను అభివృద్ది చేసి, విడుదల చేసే అవకాశం ఉంది.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
2032 నాటికి మార్కెట్లో కేవలం ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే ఉండాలి, పెట్రోల్ మరియు డీజల్ కార్లకు స్వస్తి పలకాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం బాగానే ఉంది. కానీ ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే వోల్వో తరహా అన్ని కార్ల తయరీ సంస్థలు స్వతహాగా ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ది మీద దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.