రోడ్డు ప్రమాదంలో బిజెపి ఎమ్మెల్యేతో సహా మరో ముగ్గురు దుర్మరణం
ఉత్తరప్రదేశ్లోని సితాపుర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే లోకేంద్ర సింగ్ బుదవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం హైవే మీద లారీని ఢీకొట్టింది.
Recommended Video

ఉత్తరప్రదేశ్లోని సితాపుర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే లోకేంద్ర సింగ్ బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం హైవే మీద లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎమ్మెల్యేతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు.

లోకేంద్ర సింగ్ ఉత్తరప్రదేశ్లోని బిజనూర్ జిల్లాలోని నూర్పూర్ నియోజకవర్గానికి శాసన సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత ఏడాది జరిగిన శాసన సభ ఎన్నికల్లో ప్రత్యర్థి మీద భారీ మెజారిటీతో గెలుపొందాడు.

ఎమ్మెల్యే లోకేంద్ర సింగ్ సొంత వాహనం టయోటా ఫార్చ్యూనర్లో ప్రయాణిస్తున్నపుడు జాతీయ రహదారి మీద ఎదురుగా వస్తున్న హెవీ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో లోకేంద్ర సింగ్, ఆయన ఇద్దరు గన్మెన్లతో పాటు లారీ డ్రైవర్ సహా మొత్తం నలుగురు ప్రాణాలు విడిచారు.

లారీతో పోల్చుకుంటే టయోటా ఫార్చ్యూనర్ ఎత్తు చాలా తక్కువగా ఉంటుంది. చిన్న వాహనం ఢీకొన్నపుడు లారీలో ఉన్న వ్యక్తులు గాయాలతో బయటపడే అవకాశం ఉంది. కానీ, ఈ ఘటనలో లారీ డ్రైవర్ కూడా మృతి చెందాడు అంటే ప్రమాద తీవ్రత ఏమేరకు ఉందో చెప్పనక్కరలేదు.

భారీ సేఫ్టీ ఫీచర్లు మరియు ఎంతటి ధృడమైన బాడీ ఉన్నప్పటికీ మితిమీరిన వేగంతో ప్రయాణిస్తే ఇలాంటి ప్రమాదాలు నుండి తప్పించుకోవడం అసాధ్యమనే చెప్పాలి. ప్రత్యేకించి హైవేల మీద ప్రయాణిస్తున్నపుడు భారీ వాహనాల చాలా నెమ్మదిగా వెళతుంటాయి, కాబట్టి వాటిని గమనిస్తూ డ్రైవ్ చేయండి.



Click it and Unblock the Notifications








