Just In
- 10 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 13 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 15 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 19 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కదిలే వాహనాల మీద కుప్పకూలిన వంతెన: 19 మంది దుర్మరణం
నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ మీద నుండి 40 అడుగుల ఎత్తుల్లో ఉన్న రెండు అతి పెద్ద కాంక్రీట్ పిల్లర్లు ట్రాఫిక్తో అత్యంత రద్దీగా ఉండే రోడ్డు మీద కుప్పకూలిపోయాయి.
నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ మీద నుండి 40 అడుగుల ఎత్తుల్లో ఉన్న రెండు అతి పెద్ద కాంక్రీట్ పిల్లర్లు ట్రాఫిక్తో అత్యంత రద్దీగా ఉండే రోడ్డు మీద కుప్పకూలిపోయాయి. ఈ ఘటనలో నెమ్మదిగా కదులుతున్న వాహనాల్లో ప్రయాణిస్తున్న 19 మంది మరణించగా మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఊహించని విధంగా జరిగిన ఈ సంఘటన వారణాసిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే త్వరలో ప్రారంభానికి సిద్దమైన ఫ్లైఓవర్ క్రింది నెమ్మదిగా కదులుతున్న వాహనాల మీద ఒక్కసారిగా కూలిపోయింది. అత్యంత బరువైన రెండు అతి పెద్ద కాంక్రీట్ పిల్లర్లు క్రింద ఉన్న వాహనాలను నుజ్జునుజ్జు చేశాయి.
ట్రాఫిక్లో నెమ్మదిగా వెళుతున్న బస్సు, రెండు ఎస్యూవీలు, రెండు కార్లు మరియు కొన్ని టూ వీలర్లు మీద ఈ పిల్లర్లు జారిపడ్డాయి. ఈ ప్రదేశంలో గురత్వాకర్షణ శక్తి అధికంగా ఉండటంతో ఫ్లైఓవర్ మీద ఉన్న కాంక్రీట్ కూలిపోయినట్లు తెలిసింది.
సుమారుగా 350 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఆర్మీ వైద్య అధికారులు మరియు ప్రాంతీయ పోలీసు అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. నాలుగు గంటలు శ్రమించి వంతెన క్రింద ఉన్న మృతదేహాలను మరియు క్షతగాత్రులను వెలికితీశారు.
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కంటే ముందుగా స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న వెంటనే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ మరియు ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.
ఫ్లైఓవర్ మీద నుండి క్రింద పడిపోయిన కాంక్రీట్ దూలాలు(బీమ్స్) 79 మరియు 80 వ పిల్లర్ల మీద నిర్మించారు. వారం రోజుల క్రితమే ఈ సిమెంట్ దిమ్మెలను పిల్లర్లు మీదకు చేర్చారు. అయితే, వీటిని మెకానికల్ లాకింగ్ సిస్టమ్తో భద్రత పరచడం విస్మరించారు.
ఫ్లైఓవర్ వంతెన కూలిపోయిన వెంటనే కాంట్రాక్టర్ మరియు కూలీలు అక్కడి నుండి పారిపోయారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు, బస్సులో ఉన్న ప్రయాణికులను సిమెంట్ దిమ్మెలు క్రిందపడిన వెంటనే శిధిలాల నుండి తప్పించి ఆటోలో ఆసుపత్రికి తరలించారు. అయితే, పిల్లర్ల క్రింద ఉన్న కార్లు మరియు టూ వీలర్లో ఉన్న వారిని రక్షించలేకపోయామని చెప్పుకొచ్చారు.
ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షల మరియు తీవ్రంగా గాయబడిన బాధితులకు 2 లక్షల రుపాయలు చెప్పున సీఎం యోగి ఆధిత్యనాథ్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. కాంట్రాక్టర్ అజాగ్ర్తత్త కారణంగా ఎన్నో కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది.
దేశవ్యాప్తంగా ఎన్నో నగరాల్లో మెట్రో మరియు ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మరే ఇతర ప్రదేశాల్లో ఇలాంటి ప్రమాదం పునరావృతం కాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.