Just In
- 1 hr ago మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- 15 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 18 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 20 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
Don't Miss
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- News టీడీపీ ప్లాన్ బీ- వంగవీటి రాధాకు టికెట్?
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Movies Karthika Deepam 2 April 20th: దీపపై పగతో రగిలిపోతున్న నర్సింహ.. శౌర్యని ఇక్కడే చదివిస్తానంటున్న దశరద్!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
ప్రభుత్వానికి ఎలక్ట్రిక్ కార్ల సరఫరాకు సిద్దమే: కియా మోటార్స్
ప్రభుత్వానికి ఎలక్ట్రిక్ కార్లను సరఫరా చేయడానికి ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీలను ఆహ్వానించి నిర్వహించే టెండర్లలో పాల్గొనడానికి కియా మోటార్స్ ఇండియా సిద్దమైనట్లు తెలిసింది.
ప్రభుత్వానికి ఎలక్ట్రిక్ కార్లను సరఫరా చేయడానికి ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీలను ఆహ్వానించి నిర్వహించే టెండర్లలో పాల్గొనడానికి కియా మోటార్స్ ఇండియా సిద్దమైనట్లు తెలిసింది.
తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న పెనుకొండ కియా కార్ల తయారీ ప్లాంటులో ప్రొడక్షన్ పూర్తి స్థాయిలో ప్రారంభమైతే, వేలం పాటలో పాల్గొనే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపింది.
దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ భాగస్వామ్యపు దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ 2019 ద్వితీయార్థం నుండి విణిలోకి ప్రవేశించడానికి ఏర్పాట్లను చకచకా పూర్తి చేసుకుంటోంది.
2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఆవిష్కరించిన కియా ఎస్పి కాన్సెప్ట్ మోడల్ను కియా మోటార్స్ తమ తొలి ఉత్పత్తిగా లాంచ్ చేయనుంది. అంతే కాకుండా, కియా అధికారుల కథనం మేరకు, ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టడానికి ఉన్న అవకాశాలను గమనిస్తున్నట్లు తెలిపారు.
బహుశా 2021 నాటికి కియా మోటార్స్ తమ రెండవ లేదా మూడవ మోడల్గా ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉంది. ఏదేమైనప్పటికీ, ఎలక్ట్రిక్ మరియు ఉద్గార రహిత కార్ల తయారీ పట్ల ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోనున్నట్లు కియా పేర్కొంది.
భారత ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్(EESL) మార్చి 9 న తాజాగా 10,000 ఎలక్ట్రిక్ కార్ల కోసం టెండర్ ఆహ్వానించింది. గత ఏడాది 500 ఎలక్ట్రిక్ కార్ల కోసం EESL ప్రాథమిక టెండర్ నిర్వహించగా, టాటా మోటార్స్ మరియు మహీంద్రా ఎలక్ట్రిక్ టెండర్ దక్కించుకున్నాయి.
Recommended Video
కియా కంపెనీకి చెందిన ఇతర అధికారులు కథనం మేరకు, కియా అంతర్జాతీయ లైనప్లో ప్రధానంగా హైబ్రిడ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్, ఫ్యూయల్ సెల్ మరియు ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. భారత్లో ఛార్జింగ్ స్టేషన్ల మౌళిక వసతుల సంసిద్దత మరియు మార్కెట్ పరిస్థితులకు అనుగుణమైన మోడళ్లను ఎంచుకుని విపణిలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ప్రభుత్వ మరియు ప్రయివేట్ సంస్థలకు ఎలక్ట్రిక్ కార్లను సరఫరా చేసే టెండర్లలో పాల్గొనడమే కాకుండా, ఇండియన్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేసేందుకు ఉన్న ఇతర మార్గాలను ఎంచుకోవడానికి కూడా కియా మోటార్స్ సిద్దంగా ఉంది.
కియా మోటార్స్ ఇండియా ప్రొడక్షన్ ప్లాంట్ ప్రాథమిక వార్షిక తయారీ సామర్థ్యం 3,00,000 లక్షల యూనిట్లుగా ఉంది. అంతే కాకుండా, రానున్న మూడు నుండి నాలుగేళ్ల లోపు భారతదేశపు మూడవ లేదా నాలుగవ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా రాణించాలనే లక్ష్యంతో ఉంది.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ప్రభుత్వానికి ఎలక్ట్రిక్ కార్లను సరఫరా చేసే టెండర్లో కియా మోటార్స్ పాల్గొనడమనేది, భారత్లో ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టడానికి ఉన్న చక్కటి మార్గం అని చెప్పవచ్చు. కియా మోటార్స్ ప్రభుత్వ వేలం పాటలో పాల్గొనడం మార్కెట్ పరిస్థితుల అంచనా, మరియు పోటీదారులు నిర్ణయించే ధరలు ఇంకా ఎన్నో అంశాలను అర్థం చేసుకోవడంలో సహాయపడనుంది.
1. ప్రతి హైదరాబాదీ ఈ ముగ్గురు వ్యక్తులకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే!!
2.విపణిలోకి 7-సీటర్ మారుతి సుజుకి సోలియో
3. డిజైర్ మీద మారుతి చేస్తున్న ప్రయోగం బట్టబయలు
4.కొత్త ట్రెండ్ సెట్ చేసిన క్లాసిక్ 350 గన్మెటల్ గ్రే బైకుతో తలలు పట్టుకుంటున్న రాయల్ ఎన్ఫీల్డ్
5.విడుదలకు ముందే రోడ్డెక్కిన ఫోర్డ్ ఫ్రీస్టైల్