ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యయంగా మారుతీ సుజుకి కొత్త వ్యూహం
మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) దేశీయంగా అతిపెద్ద ఆటోమోటివ్ తయారీ సంస్థ, ఇది ఇప్పుడు కొత్త వ్యూహంతో ముందుకొస్తోంది అది ఏమిటంటే, ఇప్పటి వరకు దేశీయ మార్కెట్లో ఎక్కువగా వినిపిస్తున్న వార్తలు ఎలక్ట్రిక్ వాహనాలపైనే అని చెప్పవచ్చు. అలాగే వీటికి అయ్యే ఖర్చు కూడా అలానే ఉంటుందని, ఈ సంస్థలు బావిస్తున్నారు. దీనిని అధిగమించడానికి కొత్త విధానాలను అనుసరించనున్నాయి, అది ఏమిటో ఇవాల్టి కథనంలో..

హైబ్రిడ్ మరియు సిఎన్జి వాహనాలపై పన్ను తగ్గించాలని మారుతీ సుజుకి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎందుకంటే దీంతో భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు హైబ్రిడ్, సిఎన్జి వాహనాల అమ్మకాలను కూడా పెంచేందుకు. ఆర్.సీ భార్గవ(చైర్మన్, మారుతీ సుజుకీ ఇండియా) మాట్లాడుతూ..

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు అందరి అంగీకారం పొందేందుకు సమయం పడుతుందని హైబ్రిడ్, సిఎన్జి కార్లను ప్రోత్సహించాల్సి ఉందని చెప్పారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వ్యక్తిగతంగా మేం ఎలక్ట్రిక్ కార్లకు చేయబడ్డ జిఎస్టి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చేస్తున్నాము.

ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను తగ్గించడం జరిగింది, కానీ హైబ్రిడ్ పై కూడా కోత విధించాలి. సిఎన్జి వాహనాలపై పన్ను తాగించాలి,"అని ఆయన తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం, చమురు దిగుమతి ఖర్చులను తగ్గించడం ముఖ్యం.

హైబ్రిడ్స్, సిఎన్జి లకు ఇది చాలా సహాయంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి చెందడానికి ముందు ప్రభుత్వం హైబ్రిడ్స్ మరియు సిఎన్జి లపై కూడా దృష్టి పెట్టాలి. పెట్రోల్ మరియు డీజల్ ఆధారిత కార్ల కంటే హైబ్రిడ్ కార్లు 25% నుండి 30% వరకు సమర్ధవంతమైనవి అని భార్గవ పేర్కొన్నారు. దేశీయంగా చమురు దిగుమతులను తగ్గించడంలో ఇది తోడ్పడుతుంది.

ఎలక్ట్రిక్ వాహనాలకు జిఎస్టి పన్నును 12% నుంచి 5 శాతానికి, ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్లను 18% నుంచి 5% కు ఈ ఏడాది ఆగస్టు 1 వ తేదీన తగ్గించిన విషయం తెలిసింది. అయితే సిఎన్జి, హైబ్రిడ్ వాహనాలకు ఎలాంటి పన్ను తగ్గించడం జరగలేదు.

ఎలక్ట్రిక్ వాహనాలకు అమ్మకాలు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఖర్చు వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. ఫేమ్ కూడా ప్రైవేట్ కార్లకు ఎలాంటి సబ్సిడీ అందజేయలేదని ఆయన ఉద్ఘాటించారు. ప్రస్తుత టెక్నాలజీతో ఎలక్ట్రిక్ వాహనాలకి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది.

ఇంటర్నల్ కంబస్టివ్ వాహనాల ధర కంటే రెట్టింపు ఉండొచ్చు. ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ ప్రొవైడర్ల కోసం ఫ్లయిట్ సేల్స్ లక్ష్యంగా చిన్న ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడంలో కంపెనీ పనిచేస్తుందని భార్గవ పేర్కొన్నారు. "మేక్ ఇన్ ఇండియా " ప్రోత్సహించడానికి ప్రభుత్వం విధిగా ఫ్యాక్టరీ ఫిసిఎన్ సి వాహనాలను ప్రోత్సహించాలి.

మా పోర్ట్ ఫోలియోలో ఉన్న అన్ని చిన్న కార్లు కూడా సిఎన్జి కు మారతాయి. కంపెనీ 1.3-లీటర్ డీజల్ ఇంజన్ వాహనాలను నిలిపివేయనున్నట్లు భార్గవ స్పష్టం చేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు విటారా బ్రెజ్జా అనే పెట్రోల్ వేరియంట్ ను ప్రవేశపెట్టనున్నాం" అని అయన తెలిపారు.


Click it and Unblock the Notifications








