Just In
- 4 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 7 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 9 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 12 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పరుగులు పెడుతున్న మహీంద్రా థార్ బుకింగ్స్.. ఇప్పటికే దీని బుకింగ్స్ ఎంతంటే ?
ప్రముఖ వాహన తయారీదారు మహీంద్రా & మహీంద్రా తన బ్రాండ్ అయిన కొత్త మహీంద్రా థార్ ఎస్యూవీని అక్టోబర్ 2 న దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. కంపెనీ అదే రోజు నుండి దాని బుకింగ్ ప్రారంభించబడింది. ఇప్పుడు కొత్త మహీంద్రా థార్ ప్రారంభించినప్పటి నుండి 9000 యూనిట్ల బుకింగ్స్ అందుకున్నట్లు కంపెనీకి సమాచారం అందింది.
ప్రస్తుతం టెస్ట్ డ్రైవ్ మరియు డెమో వెహికల్ కేవలం 18 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవి రాబోయే రోజుల్లో దేశంలోని ఇతర నగరాల్లో ప్రారంభించబడతాయి. ప్రారంభించి అతి తక్కువ సమయంలో థార్ ఎక్కువ బుకింగ్స్ స్వీవీకరించింది.
కొత్త మహీంద్రా థార్ త్వరలోనే దేశంలోని అన్ని నగరాల్లో టెస్ట్ డ్రైవ్ వాహనాలను అందుబాటులోకి రానుంది. తద్వారా కొత్త మహీంద్రా థార్ను ఎక్కువ మంది బుక్ చేసుకుని ఆస్వాదించవచ్చని కంపెనీ తెలిపింది. కొత్త మహీంద్రా థార్ ధర రూ. 9.8 లక్షల నుంచి రూ. 13.75 లక్షలు.
MOST READ:మాజీ ముఖ్యమంత్రిని ఫిదా చేసిన మహీంద్రా థార్.. ఇంతకీ ఎవరా CM తెలుసా?
దీని బుకింగ్ను దేశంలోని డీలర్షిప్లు మరియు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. థార్ యొక్క టెస్ట్ డ్రైవ్ త్వరలో 100 కొత్త నగరాల్లో ప్రారంభించబడుతుంది. కొత్త థార్ రెండు ట్రిమ్స్ ఏఎక్స్ మరియు ఎల్ఎక్స్ లలో తీసుకురాబడింది. దీని ఏఎక్స్ ను పెట్రోల్ మరియు డీజిల్లోని మాన్యువల్ గేర్బాక్స్లతో మాత్రమే తీసుకువచ్చారు.
ఆటోమేటిక్ గేర్బాక్స్ మరియు డీజిల్తో మాన్యువల్ మరియు ఆటోమేటిక్తో పెట్రోల్ ఇంజన్లలో ఎల్ఎక్స్ సిరీస్ అందుబాటులో ఉంది. ఇది కొత్త పెట్రోల్ మరియు అప్గ్రేడ్ డీజిల్ ఇంజిన్తో ప్రవేశపెట్టబడింది. ఇందులో 2.0 లీటర్ పెట్రోల్ మరియు 2.2 లీటర్ డీజిల్ ఇంజన్లు ఉన్నాయి.
MOST READ:మహీంద్రా లాంచ్ చేసిన 210 అనివెర్సరీ స్పెషల్ ఎడిషన్ : ప్యూజో 125 స్కూటర్
ఇది కొత్త 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్ కలిగి ఉంది. తొలిసారిగా థార్ పెట్రోల్, ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తుంది. ఇది ప్రామాణికంగా 4 వీల్ డ్రైవ్ సిస్టం కలిగి ఉంది. ఈ ఆఫ్-రోడ్ ఎస్యూవీలో 226 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 650 మిమీ వాటర్ వెడ్జింగ్ సామర్ధ్యం ఉంది. ఇది 6 సీట్ల ఎంపికలో లభిస్తుంది.
2020 థార్ లోపలి కొత్త రూఫ్ మౌంటెడ్ స్పీకర్, కొత్త టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. ఇది ఆన్-రోడ్ మరియు ఆఫ్-రోడ్ యొక్క రియల్ టైం స్టేటస్ చూపుతుంది. దీనితో పాటు, ఫిక్స్డ్ సాఫ్ట్ టాప్, డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్, ఎబిఎస్, రియర్ పార్కింగ్ అసిస్ట్లు ప్రామాణికంగా ఇవ్వబడ్డాయి.
MOST READ:మీకు తెలుసా.. ఈ బస్సులకు పెట్రోల్, డీజిల్ అవసరం లేదు