బెంగుళూరులో స్కొడా కొత్త షోరూమ్ లాంచ్; భారత్లో రీబ్రాండింగ్ పూర్తి
చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఆటో, కర్ణాటకలోని బెంగళూరు నగరంలో ఓ సరికొత్త అత్యాధునిక డీలర్షిప్ సదుపాయాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇందుకు గాను స్కొడా ఆటో సంస్థ పిపిఎస్ మోటార్తో చేతులు కలిపింది. ఇప్పటికే ఈ సంస్థ కియా మరియు ఫోర్డ్ వంటి అనేక ఆటోమొబైల్ కంపెనీలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది.

కొత్త డీలర్షిప్ ప్రారంభంతో స్కోడా ఆటో కర్ణాటకలో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలోని దక్షిణాధి మార్కెట్లలో బలమైన పట్టు సాధించడమే లక్ష్యంగా స్కొడా ముందుకు వెళ్తోంది.ఈ కొత్త డీలర్షిప్ తమ బ్రాండ్ యొక్క గ్లోబల్ రీడిజైనింగ్ ప్రక్రియలో భాగమైన కొత్త కార్పొరేట్ ఐడెంటిటీ మరియు డిజైన్ను కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది.

వచ్చే 2022 నాటికి దేశవ్యాప్తంగా మరో రెండు సేల్స్ అండ్ సర్వీస్ టచ్పాయింట్లను పెంచుతున్నట్లు స్కొడా ఆటో ప్రకటించింది. ఈ విస్తరణ ప్రణాళిక బ్రాండ్ యొక్క ‘ఇండియా 2.0' ప్రాజెక్టులో భాగమని స్కొడా తెలిపింది.

బెంగుళూరులో కొత్తగా ప్రారంభించిన డీలర్షిప్ విషయానికి వస్తే, ఇక్కడ సేల్స్ అండ్ డిస్ప్లే కోసం 4,500 చదరపు అడుగుల స్థలం ఉంటుంది. డిస్ప్లేలో కనీసం నాలుగు కార్లను కలిగి ఉంటుంది. వీటికి అదనంగా, ఈ కొత్త షోరూమ్లో సర్వీస్ వర్క్షాప్ ప్రాంతం కూడా ఉంటుంది.

సుమారు 18,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సర్వీస్ వర్క్షాప్ ఉంటుంది, ఇందులో పది మెకానికల్ స్టేషన్లు మరియు బాడీ షాప్ బేలను కూడా కలిగి ఉంటుంది. ఈ కొత్త డీలర్షిప్లో 75 మంది శిక్షణ పొందిన సిబ్బంది పనిచేస్తున్నారని మరియు సంవత్సరానికి 5,500 వాహనాలకు సర్వీస్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.

కొత్త డీలర్షిప్ను ప్రారంభించిన సందర్భంగా స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ మాట్లాడుతూ, "ఇండియా 2.0లో భాగంగా కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉండేలా స్కొడా ఆటో భారత్లో దేశవ్యాప్తంగా నెట్వర్క్ రీచ్ను విస్తరించడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. ఇలా చేయటం ద్వారా ఎక్కువ మంది వినియోగదారులకు మా ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి అంతేకాకుండా మా కస్టమర్-సెంట్రిక్ ఆఫ్టర్సేల్స్ సమస్యలకు కూడా సులభంగా పరిష్కారాలు లభిస్తాయని" అన్నారు.

"దక్షిణ భారతదేశంలో బెంగళూరు మాకు చాలా కీలకమైన మార్కెట్, మరియు పిపిఎస్ మోటార్స్తో మా కొత్త భాగస్వామ్యం కూడా బ్రాండ్కు కీలకమైనది. ఇది కర్ణాటకలో మా స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని మేము విశ్వసిస్తున్నాము" అని ఆయన అన్నారు.

ఈ ఒప్పందం గురించి పిపిఎస్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ డీలర్ ప్రిన్సిపాల్ రాజీవ్ సంఘ్వి మాట్లాడుతూ, "స్కొడా ఆటో ఇండియాతో భాగస్వామ్యం కావడం మరియు కర్ణాటకలోని బెంగళూరులో కొత్త డీలర్షిప్ను ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది. స్కొడా ఆటో ఉత్పత్తులు ఆధునిక నిర్మాణం మరియు క్రమబద్ధమైన వ్యాపార ప్రక్రియల ప్రదర్శనకు అనువైన నేపథ్యాన్ని అందిస్తాయని" అన్నారు.

స్కొడా ఆటో భారతదేశంలోని 69 నగరాల్లో 83 సేల్స్ మరియు 58 సర్వీస్ టచ్పాయింట్ల మొత్తం నెట్వర్క్ను విజయవంతంగా రీబ్రాండ్ చేసినట్లు ప్రకటించింది. దేశ చరిత్రలో ఇది అతిపెద్ద రీబ్రాండింగ్, ఈ ప్రచారంలో భాగంగా వాహన తయారీదారులు మరియు దాని డీలర్ భాగస్వాములతో కలిసి రూ.1.200 మిలియన్లకు పైగా పెట్టుబడిని వెచ్చించారు.

స్కొడా ఆటో బెంగుళూరు షోరూమ్ లాంచ్పై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
బెంగుళూరులో ప్రారంభించిన కొత్త స్కోడా షోరూమ్, బ్రాండ్ యొక్క కొత్త డిజైన్ను అనుసరిస్తుంది. అధి


Click it and Unblock the Notifications








