Just In
- 1 hr ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 2 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 4 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
- 5 hrs ago సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
Don't Miss
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Movies నీకెంత బలుపు? ఆర్కే నాయుడుపై సీనియర్ నటి సీరియస్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
భారత్లో 4 కొత్త జీప్ ఎస్యూవీలను విడుదల చేస్తాం: ఫియట్
భారత మార్కెట్లో తన ఉనికి చాటుకునేందుకు ఎఫ్సిఏ (ఫియట్ క్రైస్లర్ ఆటోమొబైల్స్) తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ మేరకు దేశీయ మార్కెట్లో తమ స్థానిక ఉత్పత్తి శ్రేణిని విస్తరించనున్నట్లు ఎఫ్సిఏ ప్రకటించింది. నాలుగు కొత్త జీప్ ఎస్యూవీల ఉత్పత్తి కోసం 250 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వెచ్చించనున్నట్లు కంపెనీ ధృవీకరించింది.
తమ సరికొత్త లోకల్ వెహికల్ లైనప్లో 2021 మేడ్ ఇన్ ఇండియా జీప్ కంపాస్ కూడా ఉంటుందని, స్థానికంగా ఉత్పత్తి చేయబడే ఈ జీప్ కంపాస్ ప్రపంచంలోనే మొట్టమొదటి మూడు-వరుసల సీటింగ్ కలిగిన జీప్ ఎస్యూవీ అవుతుందని ఎఫ్సిఏ ఇండియా పేర్కొంది.
మేడ్ ఇన్ ఇండియా కంపాస్తో పాటుగా తమ ఐకానిక్ జీప్ వ్రాంగ్లర్ మరియు నెక్స్ట్ జనరేషన్ గ్రాండ్ చెరోకీ మోడళ్లను కూడా భారత మార్కెట్లో ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. జీప్ బ్రాండ్కు గ్రాండ్ చెరోకీ ఫ్లాగ్షిప్ మోడల్గా ఉంది, ఇది ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకానికి ఉంది.
MOST READ:ఒక ఛార్జ్తో 100 కి.మీ డ్రైవింగ్.. ధర తక్కువ & డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు
ఈ రెండు వాహనాలను కూడా రంజాంగావ్లోని ఎఫ్సిఏ జాయింట్ వెంచర్ తయారీ కేంద్రంలోనే స్థానికంగా అసెంబుల్ చేయనున్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ నాలుగు కొత్త ఉత్పత్తులు భారత రోడ్లను తాకే అవకాశం ఉంది.
ఈ విషయం గురించి ఎఫ్సిఏ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పార్థ దత్తా మాట్లాడుతూ, తాము వెచ్చించే 250 మిలియన్ డాలర్ల కొత్త పెట్టుబడి ద్వారా రంజాంగావ్ నుండి వచ్చే కొత్త జీప్ ఎస్యూవీలు భారత కార్ మార్కెట్లోని పలు విభాగాల్లో గట్టి పోటీని ఇస్తాయని అన్నారు.
MOST READ:లిమోసిన్ కారుగా మారిన మారుతి వ్యాగన్ ఆర్.. ఎలా అనుకుంటున్నారా.. ఇది చూడండి
ఎఫ్సిఏ జాయింట్ వెంచర్ ఉత్పాదక కేంద్రంలో ఉత్పత్తి చేయబడిన వాహనాల్లో స్థానికంగా తయారైన విడిభాగాల సంఖ్యను పెంచాలని నిశ్చయించుకున్నమని, భారతదేశంలో తమ ప్రణాళికలు మరియు ఉత్పత్తుల ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉంటామని దత్తా అన్నారు.
ఇదిలా ఉంటే, జీప్ ఇండియా దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న కంపాస్ ఎస్యూవీలో ఓ కొత్త 2021 మోడల్ను జనవరి 7వ తేదీన ఆవిష్కరించనుంది. మునుపటి మోడల్తో పోలిస్తే ఈ కొత్త 2021 జీప్ కంపాస్ను సరికొత్త డిజైన్ మరియు విలాసవంతమైన ఫీచర్లతో రీడిజైన్ చేసినట్లుగా అనిపిస్తోంది. అంతేకాకుండా ఇందులో కొత్త కలర్ ఆప్షన్స్ కూడా ప్రవేశపెట్టనున్నారు.
MOST READ:లవ్బర్డ్ ; భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ కార్.. మీరు చూసారా..!
భారత మార్కెట్ కోసం జీప్ కంపాస్లో కంపెనీ ఓ 7-సీటర్ వెర్షన్ను కూడా అభివృద్ధి చేస్తోంది. ఈ లగ్జరీ సెవన్ సీటర్ జీప్ కంపాస్ను హెచ్6 అనే కోడ్నేమ్తో డెవలప్ చేస్తున్నారు. ఇది 2022లో ప్రారంభించబడుతుందని అంచనా.