Just In
- 8 hrs ago
బిఎమ్డబ్ల్యూ ఎక్స్1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!
- 10 hrs ago
విడుదలకు ముందే యమహా FZ-X స్పెసిఫికేషన్స్ లీక్
- 12 hrs ago
భారత్లో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టీల్బర్డ్; ధర & వివరాలు
- 13 hrs ago
మిస్టర్ మస్క్.. భారత్లో త్వరగా టెస్లా కార్లను ఉత్పత్తి చేయండి: నితిన్ గడ్కరీ
Don't Miss
- News
వైఎస్ షర్మిల నుంచి పిలుపు: కొండా సురేఖ దంపతులు ఏమన్నారంటే..?, జగన్పై సంచలనం
- Sports
PBKS vs CSK: 'సూపర్' జడేజా! కళ్లుచెదిరే రనౌట్.. స్టన్నింగ్ క్యాచ్!వీడియోలు
- Movies
పవన్ కల్యాణ్కు కరోనా పాజిటివ్.. ఫ్యాన్స్ను రెచ్చగొట్టిన రాంగోపాల్ వర్మ.. కోవిడ్ 19 హీరో అంటూ..
- Finance
మళ్లీ బంగారం ర్యాలీ ప్రారంభమైందా? 15 రోజుల్లో 6% జంప్
- Lifestyle
Happy Ramadan 2021: ఈద్-ముబారక్ ప్రత్యేక సందేశాలను మీకిష్టమైన వారితో పంచుకోండి...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
భారత మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ తన శాంట్రో, గ్రాండ్ ఐ నియోస్, ఆరా, ఎలంట్రా, కోన వంటి మోడళ్లపై మార్చి నెల ప్రారంభంలోనే భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. కంపెనీ ఈ కార్లపై దాదాపు రూ. 1.50 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. దీనితో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, వైద్య నిపుణులు వంటి వారికి కూడా ప్రత్యేక తగ్గింపు ఇస్తున్నారు.

హ్యుందాయ్ ఎంట్రీ లెవల్ కారు అయిన శాంట్రోపై ఇప్పుడు దాదాపు రూ. 50 వేల వరకు డిస్కౌంట్ ఇవ్వబడుతోంది. కంపెనీ ఈ కారును రూ. 4.67 లక్షల ప్రారంభ ధర వద్ద అందుబాటులోకి తెచ్చింది. దీని టాప్ వేరియంట్ ధర రూ. 5.99 లక్షల వరకు ఉంటుంది. హ్యుందాయ్ శాంట్రో అమ్మకాలు గత కొన్ని నెలలుగా తగ్గుముఖం పడుతున్నాయి.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్కు ఇప్పుడు రూ. 60 వేల వరకు తగ్గింపును అందిస్తున్నారు. టాప్ వేరియంట్కు రూ. 7.33 లక్షల వరకు వుండే ఈ కారు ప్రస్తుతం రూ. 5.19 లక్షల ధరలకు లభిస్తోంది. ఈ కారణంగా దీని అమ్మకాలు మెల్లగా ముందుకు వెళ్తున్నాయి.
MOST READ:భారత్లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్

మార్చి నెలలో కంపెనీ సెడాన్ ఆరాపై రూ. 70,000 వరకు తగ్గింపును అందిస్తున్నారు. టాప్ వేరియంట్కు రూ. 7.43 లక్షల వరకు వుంది . అయితే ఇది ఇప్పుడు రూ. 5.92 లక్షల ధరకు అందుబాటులోకి తెస్తున్నారు. అదే విధంగా హ్యుందాయ్ ఎలంట్రాపై రూ. 1 లక్ష వరకు డిస్కౌంట్ ఇవ్వబడుతోంది.

హ్యుందాయ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కోనపై కంపెనీ మార్చిలో రూ. 1.50 లక్షల వరకు తగ్గింపు ఇస్తున్నారు. ఇది కంపెనీలో అత్యల్పంగా అమ్ముడవుతున్న మోడల్. ఈ కారును రూ. 23.75 లక్షల ధరలకు అందుబాటులోకి తెస్తున్నారు. దీని టాప్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 23.94 లక్షల వరకు ఉంటుంది.
MOST READ:త్వరపడండి.. అక్కడ ఒక కేజీ కేక్ కొంటె ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ

హ్యుందాయ్ కంపెనీ ఈ ఆఫర్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో సహా అనేక వర్గాల ఉద్యోగులకు రూ. 8000 వరకు రిబేటు ఇవ్వబడుతోంది. కంపెనీ క్రెటా ఎస్యూవీ, కొత్త ఐ 20, కొత్త వెర్నా, వెన్యూ, టక్సన్, యాసెంట్ వంటి మోడళ్లపై మార్చి 2021 లో డిస్కౌంట్ ఇవ్వడం లేదు.

హ్యుందాయ్ యొక్క క్రెటా ఎస్యూవీ గత నెలలో కంపెనీని అత్యధికంగా అమ్ముడైన మోడల్గా నిలిచింది. హ్యుందాయ్ అమ్మకాలు అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు కొంతవరకు పెరిగాయి. అయినప్పటికీ జనవరి 2021 నాటికి అమ్మకాలలో తగ్గుదల నమోదైంది. క్రెటా అమ్మకాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ఏది ఏమైనా ఈ డిస్కౌంట్స్ అమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
MOST READ:మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతకు 5 లీటర్ల పెట్రోల్ గిఫ్ట్గా ఇచ్చారు, ఎందుకో తెలుసా!