Just In
- 12 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 12 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 14 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 15 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Movies Guppedantha Manasu March 29th: మను ఇక్కడే ఉంటాడంటున్న వసు.. వద్దంటూ గొడవ చేస్తున్న అనుపమ!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అలెర్ట్: కర్ణాటకలో 14 రోజుల కఠిన ఆంక్షలతో కరోనా లాక్డౌన్
భారతదేశంలో కరోనా మహమ్మారి చాలా ఎక్కువగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ భారిన పడి చాలామంది ప్రజలు మరణిస్తున్నారు. రోజురోజుకి కోవిడ్ సోకిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్న తరుణంలో వివిధ రాష్ట్రాలతో సహా, కర్ణాటక రాష్ట్రంలో కూడా కరోనా నివారణలో భాగంగా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగానే ప్రస్తుతం పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించబడింది. పెరుగుతున్న కరోనావైరస్ వైరస్ నివారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కర్ణాటక ప్రభుత్వం అనేక జాగ్రత్తలు అమలు చేసింది. కర్ణాటకలో గత వారం 10 రోజులపాటు నైట్ కర్ఫ్యూ కూడా విధించారు.
అయితే ప్రస్తుతం కూడా కరోనా సంఖ్య తగ్గుముఖం పెట్టకపోవడంతో ఈ నైట్ కర్ఫ్యూని మరిన్ని కఠినమైన చర్యలతో14 రోజులు పగలు మరియు రాత్రి సమయంలో కర్ఫ్యూ ప్రకటించారు. దీని గురించి కర్ణాటక సీఎం యడ్యూరప్ప అధికారికంగా ప్రకటించారు.
MOST READ:భారత్లో విడుదలైన 2021 సుజుకి హయాబుసా; ధర & వివరాలు
కర్ఫ్యూ సమయంలో, ప్రజలకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి నిర్దేశించిన సమయంలో అంటే ఉదయం 6 నుండి 10 గంటల వరకు మాత్రమే కొనుగోలు చేయడానికి అనుమతి ఉంది. తర్వాత చాలా కఠినమైన ఆంక్షలతో కర్ఫ్యూ విధించబడుతుంది.
ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో సాధారణ రవాణా నిషేధించబడింది. ఈ సమయంలో అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వబడింది. ఇందులో సరుకు రవాణా వాహనాలు, ఆరోగ్య సేవా వాహనాలు అందించే వాహనాలకు అనుమతి ఉంది.
MOST READ:ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న ఓఎక్స్ వన్ ఎలక్ట్రిక్ మోటార్సైకిల్!
అవసరమైన సర్వీస్ వాహనాలకు తప్ప, ఇతర వాహనానికి అత్యవసర పాస్ కూడా జరీ చేసే అవకాశం లేదు. దీనితో పాటు అత్యవసర సమయంలో తయారీ రంగంలో పనిచేసే ఉద్యోగులు తగిన ఐడెంటిటీ ప్రూఫ్స్ చూపించాల్సి ఉంటుంది. అందువల్ల, ఉత్పాదక రంగంలో పనిచేసే ఉద్యోగులు నిర్ణీత సమయం లోపు కార్యాలయానికి చేరుకోవాలి.
ఈ కర్ఫ్యూ సమయంలో పబ్లిక్ బస్ సర్వీసులు మరియు మెట్రో వంటి సేవలు కూడా మూసివేయబడుతుంది. ప్రైవేట్ వాహనాల కదలికలపై కూడా భారీగా ఆంక్షలు విధించిన పోలీసులు కర్ఫ్యూను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
MOST READ:సొంత కారు అమ్మి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న రియల్ హీరో.. ఎవరో తెలుసా?
ఇది కర్ఫ్యూ సమయంలో అవసరమైన చోట తప్ప, అనవసరంగా తిరిగే వాహనాలపై కఠినమైన చర్యలు మరియు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. కావున ప్రజలు దీనిని దృషిలో ఉంచుకుని కర్ఫ్యూకి సహకరించాలి. అప్పుడే ఈ మహమ్మరి నుచి కొంతవరకు బయటపడగలము.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తిని తగ్గించడానికి ప్రజలు ప్రభుత్వంతో సహకరించాలని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రకటించారు. కరోనా ననివారణ కోసం బెంగళూరుతో సహా కర్ణాటకలోని ఇతర ప్రాంతాలలో ఏప్రిల్ 27 నుండి మే 14 వరకు కఠినమైన నిబంధనలు అమలు చేయబడుతున్నాయి.
MOST READ:భారత మార్కెట్లో టాప్ 5 బెస్ట్ మైలేజ్ కార్లు.. వివరాలు