ఒక్క నెలలో 2 వేలు కోట్లకు పైగా ఫాస్ట్‌ట్యాగ్ వసూల్.. చూసారా !

నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా ప్రకారం వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి. 2021 జనవరి 01 నుంచి ఫాస్ట్‌ట్యాగ్ తప్పని సరి అని హైవే అథారిటీ అఫ్ ఇండియా ప్రకటించింది. కానీ ఇప్పడు ఆ గడువును పెంచుతూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఇప్పుడు ఫాస్ట్‌ట్యాగ్ 2021 ఫిబ్రవరి 15 నుంచి తప్పని సరిగా ఉండాలి.

ఒక్క నెలలో 2 వేలు కోట్లకు పైగా ఫాస్ట్‌ట్యాగ్ వసూల్.. చూసారా !

రోజు రోజుకి ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారుకు ఎక్కువవుతున్నారు. ఈ కారణంగా టోల్ వసూలు కూడా ఎక్కువవుతోంది. 2020 డిసెంబర్ నాటికి భారతదేశంలో మొత్తం రూ. 2,303.79 కోట్ల టోల్‌గేట్ వసూలు చేసినట్లు తెలిసింది. ఇది కేవలం ఫాస్ట్‌ట్యాగ్ నుంచి వసూలు చేసిన డబ్బు.

ఒక్క నెలలో 2 వేలు కోట్లకు పైగా ఫాస్ట్‌ట్యాగ్ వసూల్.. చూసారా !

ఫాస్ట్‌ట్యాగ్ వసూలు 2020 నవంబర్ తో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 201 కోట్లు. ఈ గణాంకాలను జనవరి 5 న నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ఫాస్ట్‌ట్యాగ్ వల్ల వసూలవుతున్న డబ్బు రోజురోజుకి పెరుగుతోంది.

ఒక్క నెలలో 2 వేలు కోట్లకు పైగా ఫాస్ట్‌ట్యాగ్ వసూల్.. చూసారా !

ఇప్పుడు చాలామంది వాహనదారులు ఫాస్ట్‌ట్యాగ్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. ఈ కారణంగా ఎక్కువ టోల్ వసూలు అవుతుంది. ఫాస్ట్‌ట్యాగ్ గడువు ఇప్పుడు ఫిబ్రవరి 15 కి పొడిగించడం వల్ల, అప్పటి వరకు ఫాస్ట్‌ట్యాగ్ లేని వాహనాలు టోల్‌గేట్ల వద్ద టోల్ ఫీజు నగదు రూపంలో చెల్లించవచ్చు.

ఒక్క నెలలో 2 వేలు కోట్లకు పైగా ఫాస్ట్‌ట్యాగ్ వసూల్.. చూసారా !

ఈ గడువును మళ్ళీ పొడిగించే అవకాశం ఉండదు, కాబట్టి ఫిబ్రవరి 15 లోపు వాహనాల్లో ఫాస్ట్‌ట్యాగ్‌ను పొందటం మంచిది. ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా వచ్చే ఆదాయంపై జాతీయ రహదారి అథారిటీ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రతి నెల పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేస్తుంది.

ఒక్క నెలలో 2 వేలు కోట్లకు పైగా ఫాస్ట్‌ట్యాగ్ వసూల్.. చూసారా !

2020 నవంబర్ తో పోల్చితే డిసెంబరులో ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా వసూలైన మొత్తం రూ. 120 కోట్లు ఎక్కువ అని ఇటీవల విడుదలైన ప్రకటన వల్ల తెలుస్తోంది. ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా టోల్ ఫీజు వసూలు పెంచడం కూడా జాతీయ రహదారి అథారిటీని ప్రోత్సహించింది. ఈ సంఖ్య భారతదేశంలో పెరుగుతున్న ఫాస్ట్‌ట్యాగ్ వినియోగాన్ని చూపిస్తుంది.

ఒక్క నెలలో 2 వేలు కోట్లకు పైగా ఫాస్ట్‌ట్యాగ్ వసూల్.. చూసారా !

ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా టోల్ ఫీజు చెల్లించడం వల్ల టోల్ గేట్లలో చాలావరకు రద్దీని తగ్గించవచ్చు. సాధారణంగా అయితే నగదు చెల్లించాల్సి వచ్చినప్పుడు టోల్ గేట్ లో ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చేది. కానీ ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగించడం వల్ల వేచి ఉండాల్సిన సమయం దాదాపు తగ్గుతుంది.

ఒక్క నెలలో 2 వేలు కోట్లకు పైగా ఫాస్ట్‌ట్యాగ్ వసూల్.. చూసారా !

ప్రధానంగా టోల్ గేట్ లో వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి ఈ ఫాస్ట్‌ట్యాగ్‌లను ప్రవేశపెట్టారు. ఫాస్ట్‌ట్యాగ్‌ను స్వీకరించడం వల్ల వాహనాలు తొందరగా వెళ్ళటమే కాకుండా, కొంతవరకు ఇంధనాన్ని కూడా అదా చేయవచ్చు. ఇప్పుడు ఫాస్ట్‌ట్యాగ్ వల్ల టోల్‌గేట్ల వద్ద సిబ్బందిని సంప్రదించాల్సిన అవసరం లేదు. ఇది కరోనావైరస్ సంక్రమణను కూడా దూరం చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, January 6, 2021, 16:46 [IST]
English summary
Toll Collection Through FASTag Increased To Rs 2,304 Crore In December 2020. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+