Just In
- 1 hr ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- 2 hrs ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- 4 hrs ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 5 hrs ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
Don't Miss
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Movies Yuva Movie Collections పునీత్ రాజ్కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. యువ మూవీకి రికార్డు కలెక్షన్లు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
ఇప్పటివరకు తెలియని & తప్పనిసరిగా పాటించాల్సిన కార్ రూల్స్.. తప్పక పాటించాల్సిందే..!!
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ 'సైరస్ మిస్త్రీ' (Cyrus Mistry) ఇటీవల జరిగిన రోడ్డుప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈయన మరణించిన తరువాత కేంద్ర రోడ్డు మరియు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ట్రాఫిక్ నియమాలను మరింత పటిష్టం చేయడానికి నిబంధనల్లో మార్పులు తీసుకువచ్చారు.
ఇందులో భాగంగానే ఇప్పుడు కేవలం మొదటి వరుసలో ఉన్న ప్యాసింజర్లకు మాత్రమే కాకుండా, రెండవ వరుసలో ఉన్న ప్యాసింజర్లలకు కూడా సీట్ బెల్ట్ తప్పనిసరి అని వెల్లడించాడు. ఇక త్వరలో ఇది అమలులోకి రానుంది. ప్రస్తుతం భారతదేశంలో ఎన్నో కఠినమైన ట్రాఫిక్ నియమాలు అమలులో ఉన్నప్పటికీ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం ఇప్పటికి కూడా వాహన వినియోగదారులకు కొన్ని నియమాలు స్పష్టంగా తెలియకపోవడమే. ఆ నియమాల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.
కాల్స్ కోసం హ్యాండ్స్ ఫ్రీ డివైస్ ఉపయోగించడం:
భారతదేశంలో రోడ్డుపైన వాహనాల్లో ప్రయాణించేటప్పుడు మొబైల్ ఫోన్స్ ఉపయోగించడం చట్ట విరుద్ధం. ఇది ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరగటానికి కారణం అవుతుంది. అయితే ఇప్పటికి కూడా మనం నిత్య జీవితంగా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలామంది మొబైల్ ఫోన్స్ ఉపయోగించడం చూస్తూనే ఉన్నాము.
అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడంతో మొబైల్ ఫోన్స్ ఉపయోగించడానికి ఇయర్ ఫోన్ లు లేదా బ్లూటూత్ వంటి వాటిని ఉపయోగిస్తున్నారు. అయితే ఇది కూడా చట్ట విరుద్ధమే. ఇది కూడా తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి. ఒకవేల మీరు ఇలాంటి డివైజులు ఉపయోగిస్తూ ట్రాఫి పోలీసులకు పట్టుబడితే భారీ జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.
హై బీమ్ తో డ్రైవింగ్ చేయడం:
నిజానికి రోడ్డుపైన ప్రయాణించేటప్పుడు హై బీమ్ తో డ్రైవింగ్ చేయడం కూడా నేరమే. ఎందుకంటే కారులో డ్రైవింగ్ చేసే వ్యక్తికి హై బీమ్ వల్ల రోడ్డు బాగా కనిపిస్తుంది, బాగా డ్రైవ్ చేయవచ్చు. కానీ ఎదురుగా వచ్చే వ్యక్తికి ఇది తప్పకుండా ఇబ్బంది కలిగిస్తుంది. ఇది చాలామంది నిత్యజీవితంలో కూడా పేస్ చేసి ఉంటారు.
డ్రైవర్స్ వీలైనంత వరకు రాత్రి సమయంలో హై బీమ్ ఉపయోగించకూడదు. ఇది ఇతరులకు ప్రమాదకారి అవుతుంది. ఈ నియమం కూడా వాహనం వినియోగదారులు తప్పకుండా గుర్తుంచుకోవాలి. లేకుండా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
రాత్రి 10 గంటల తరువాత ట్రాఫిక్ లైట్స్ అనుసరించడం:
సాధారణంగా చాలామంది రాత్రి సమయంలో ట్రాఫిక్ సిగ్నెల్స్ లోని లైట్స్ అనుసరించాల్సిన అవసరం లేదు అనుకుంటారు. కానీ అందరూ అలానే అనుకుంటే పెద్ద ప్రమాదాలే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ సిగ్నెల్స్ ఉండే ప్రాంతాల్లో నెమ్మదిగా గమనిస్తూ ముందుకు వెళ్లడం మంచిది.
సీట్ బెల్ట్:
ప్రస్తుతం రోడ్డుప్రమాదాలలో ఎక్కువమంది మరణించడానికి కారణం ఈ సీట్ బెల్ట్ ఉపయోగించకపోబడమే. ఇటీవల 'సైరస్ మిస్త్రీ' మరణానికి కూడా సీట్ బెల్ట్ ధరించకపోవడమే కారణం అని నివేదికలు చెబుతున్నాయి. కావున ఇప్పటికైనా వాహన వినియోగదారులు మేల్కోవాలి.
తాజాగా వెలువడిన నివేదికల ప్రకారం, సీట్ బెల్ట్ అనేది కేవలం ముందువున్న వారికి మాత్రమే కాకుండా వెనుక ఉన్న ప్రయాణికులకు కూడా చాలా అవసరం అని తెలుస్తోంది. దీనిపైనా ఇప్పటికే కేంద్ర మంత్రి హెచ్చరికలు కూడా జారీ చేశారు. కావున త్వరలోనే ఈ రెండవ వరుసలో సీట్ బెల్టులు అందుబాటులోకి రానున్నాయి. ఇవి ప్రమాదంలో మరణించేవారు సంఖ్యను తప్పకుండా తగ్గిస్తుందని ఆశిస్తున్నాము.
ఓవర్ టేకింగ్:
ఇప్పటివరకు చెప్పుకున్నవి ఒక ఎత్తు అయితే ఈ 'ఓవర్ టేకింగ్' అనేది మరో ఎత్తు. ఎదుకంటే హైవే మీద ప్రతి ఒక్కరూ చాలా వేగంగా వెల్తూ ఉంటారు. ఆ సమయంలో ఓవర్ టేకింగ్ చేయడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమే అవుతుంది. ఎదుకంటే ముందు వెళ్తున్న వ్యక్తి ఒకవేళా ఇండికేటర్ వేయకుండా పక్కకు వెళ్ళవచ్చు. అంటే కుడివైపు గానీ, ఎడమవైపు గానీ. ఆయా సమయంలో ఓవర్ టేకింగ్ చేసేవ్యక్తి ప్రమాదంలో పడతాడు.
ఓవర్ టేకింగ్ వల్ల వాహనం మరింత వేగంగా ముందుకు వెళ్లాల్సి వస్తుంది, ఆ సమయంలో స్పీడ్ బ్రేకర్స్ అడ్డు రావచ్చు, లేదా ఏదైనా అనుకోని ప్రమాదాలు కూడా రావచ్చు. అప్పుడు మీరు వాహనం కంట్రోల్ చేయలేరు. అప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో మీరే ఊహించవచ్చు. కావున వాహన వినియోగదారులు అనవసరంగా ఓవర్ టేకింగ్ చేయకూడదు. ఇది చట్ట విరుద్ధం కూడా, ఇవన్నీ వాహన వినియోగదారులు దృష్టిలో ఉంచుకోవాలి.