Just In
- 6 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 7 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 8 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 9 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
భారత్లో మెర్సిడెస్ బెంజ్ బస్సుల తయారీ ప్లాంట్
తరచూ ప్రమాదాలకు గురవుతున్న వోల్వో బస్సులో ప్రయాణించేలాంటే భయమేస్తోందా..? మరి మెర్సిడెస్ బెంజ్ బస్సులో ప్రయాణించడం మీకిష్టమేనా..? త్వరలోనే వోల్వో బస్సుల స్థానాన్ని బెంజ్ బస్సులు భర్తీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇకపై మెర్సిడెస్ బెంజ్ బస్సులు ఇండియాలో ఉత్పత్తి కానున్నాయి కాబట్టి.
డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (డిఐసివి) చెన్నైకి సమీపంలో ఉన్న ఓరగండం వద్ద ఓ బస్సు తయారీ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ దశలో భాగంగానే, గురువారం నాడు భూమిపూజ ప్రారంభించి, ప్లాంట్ నిర్మా పనులను మొదలు పెట్టారు. దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంటును నిర్మించనున్నారు.
మెర్సిడెస్ బెంజ్ మరియు భారత్ బెంజ్ బ్రాండెడ్ బస్సులను తయారు చేసేందుకు ఈ ప్లాంటును వినియోగించనున్నారు. వచ్చే ఏడాది (2015) మధ్య భాగం నాటికి ఈ ప్లాంటు నిర్మాణం పూర్తవుతుందని అంచనా. ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే, ప్రపంచంలో కెల్లా ఒకే చోట మూడు బ్రాండ్ల ట్రక్కులు, బస్సులను నిర్మిస్తున్న ఏకైక డైమ్లర్ ట్రక్ ప్లాంట్గా ఈ ఓరగడం ప్లాంట్ నిలువనుంది.
ఈ బస్సు ప్రాజెక్టు కోసం డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (డిఐసివి) రూ.425 కోట్ల పెట్టుబడులను వెచ్చించింది. ప్రారంభ దశలో భాగంగా ఈ ప్లాంటులో సాలీనా 1500 యూనిట్లను ఉత్పత్తి చేయనున్నారు. ఆ తర్వాత ఈ సామర్థ్యాన్ని సాలీనా 4000 యూనిట్లకు పెంచనున్నారు.