Just In
- 15 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 16 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 17 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 18 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆర్ అండ్ డి కోసం రూ.4000 కోట్ల పెట్టుబడి: మారుతి సుజుకి
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, భవిష్యత్తులో మరిన్ని కొత్త కార్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తమ ఆర్ అండ్ డి (రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్) విభాగాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది.
ఇందులో భాగంగానే.. డెవలప్మెంట్, ఆర్ అండ్ డి, మార్కెటింగ్ మౌలిక వసతులు తదితరాల్లో రానున్న రెండు మూడేళ్ళలో రూ.4,000 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజినీరింగ్) సి.వి. రామన్ చెప్పారు.
మారుతి సుజుకి ప్యాసింజర్ కార్లలో తొలిసారిగా ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్టి)ని తమ సెలెరియో కారు ద్వారా భారత్కు పరిచయం చేసిన సంగతి తెలిసినదే. కంపెనీ ఈ టెక్నాలజీని ఆటో గేర్ షిఫ్ట్ (ఏజిఎస్) అని పిలుస్తోంది.
ఇప్పుడు ఈ ఏజిఎస్ టెక్నాలజీని కంపెనీ ఇటీవలే విడుదల చేసిన సరికొత్త 2014 ఆల్టో కె10 కారులో కూడా పరిచయం చేయటం జరిగింది. అతికొద్ది సమయంలో ఏజిఎస్ టెక్నాలజీ మంచి సక్సెస్ను సాధించడంతో భవిష్యత్తులో మరిన్ని ఏజిఎస్ మోడళ్లను కంపెనీ తీసుకురానుంది. ఆటో గేర్ షిఫ్ట్ టెక్నాలజీతో మరిన్ని మోడళ్లను విడుదల చేస్తామని రామన్ చెప్పారు.
ఏజిఎస్ మోడళ్ల కోసం ఉపయోగిస్తున్న గేర్బాక్స్లను మారుతి సుజుకి ఇటలీకి చెందిన మాగ్నెటీ మారెల్లీ నుంచి దిగుమతి చేసుకుంటోంది. అయితే, దేశీయ విపణిలో వీటికి గిరాకీ అధికంగా ఉండటంతో, మానేసర్లోనే ఓ కొత్త ప్లాంట్ను ఏర్పాటు చేసి, ఇక్కడే ఏజిఎస్ గేర్బాక్స్లను తయారు చేయాలని కంపెనీ సన్నాహాలు చేస్తోంది.