Just In
- 1 hr ago ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
- 18 hrs ago ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- 20 hrs ago నానో కంటే చిన్న కారు ఉందని మీకు తెలుసా.. టాటా మోటార్స్కు ఆ కారు చాలా ప్రత్యేకం
- 20 hrs ago అందం బైక్ రైడ్ చేస్తే ఇలాగే ఉంటుందా? మతిపోగొడుతున్న వీడియో
Don't Miss
- Technology శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- News నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ ! కీలక నేత గుడ్ బై..
- Finance IPO News: నేడే ప్రారంభమైన ఐపీవో.. గ్రేమార్కెట్లో దుమ్ము దులిపేస్తోంది.. బెట్ట్ వేస్తున్నారా..
- Movies Aavesham Collections 12 రోజులుగా ఫాహద్ ఫాజిల్ బాక్సాఫీస్ ఊచకోత.. 100 కోట్ల క్లబ్లో ఆవేశం!
- Sports హార్దిక్ వద్దు.. రోహిత్ తర్వాత అతనే భారత్ కెప్టెన్- హర్భజన్
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
భారీగా పెరగనున్న కార్ల ధరలు: 2018లో కొనడానికి ప్లాన్ చేస్తే నష్టపోయినట్లే
ఇసుజు మోటార్స్ ఇండియా దేశీయంగా అందుబాటులో ఉంచిన పికప్ ట్రక్కులు మరియు ఎస్యూవీల మీద జనవరి 1, 2018 నుండి ధరల పెంచడానికి సిద్దమైంది. తమ ఉత్పత్తుల మీద 3 నుండి 4 శాతం మేరకు ధరలు పెంచాలని భావించింది.
ఇండియన్ మార్కెట్లో దేశీయ ప్యాసింజర్ కార్లు, ప్యాసింజర్ వాహనాలు మరియు వాణిజ్య వాహన తయారీ సంస్ఖలు తమ ఉత్పత్తుల మీద 2018 జనవరి నుండి ధరలు పెంచడానికి సిద్దమయ్యాయి. అందులో ఒకటి జపాన్ దిగ్గజం ఇసుజు మోటార్స్.
ఇసుజు మోటార్స్ ఇండియా దేశీయంగా అందుబాటులో ఉంచిన పికప్ ట్రక్కులు మరియు ఎస్యూవీల మీద జనవరి 1, 2018 నుండి ధరల పెంచడానికి సిద్దమైంది. తమ ఉత్పత్తుల మీద 3 నుండి 4 శాతం మేరకు ధరలు పెంచాలని భావిస్తున్నట్లు తెలిసింది.
ఇసుజు మోటార్స్ ప్రస్తుతం డి-మ్యాక్స్ , డి-మ్యాక్స్ ఎస్-క్యాబ్, డి-మ్యాక్స్ వి-క్రాస్ మరియు ఎమ్యు-ఎక్స్ వాహనాలను విక్రయిస్తోంది.
- డి-మ్యాక్స్ వి-క్రాస్ ధర రూ. 13.31 లక్షలు
- ఎమ్యు-ఎక్స్ ధరల శ్రేణి రూ. 23.83 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు ఉంది.
ఇసుజుకి భావించిన మేరకు తమ నాలుగు ఉత్పత్తుల ధరల్లో 3 నుండి 4 శాతం పెంపు ఖాయం అని తెలుస్తోంది. ఈ ధరల పెంపు తప్పనిసరైతే ఇసుజు రెగ్యులర్ క్యాబ్ వాణిజ్య వాహనం డి-మ్యాక్స్ మరియు డి-మ్యాక్స్ ఎస్-క్యాబ్ ధర సుమారుగా రూ. 15,000 ల వరకు పెరిగే అవకాశం ఉంది.
ఇసుజు లైనప్లోని ఖరీదైన ప్రీమియమ్ ఎస్యూవీ ఎమ్యు-ఎక్స్ ధర రూ. 1 లక్ష వరకు పెరగనుంది. గతంలో వస్తు మరియు సేవల పన్ను అమల్లోకి రావడంతో వి-క్రాస్ మరియు ఎమ్యు-ఎక్స్ వాహనాల ధరలు తగ్గాయి.
2018 నుండి ధరల పెంపు బాటలో ఇసుజు మోటార్స్ మాత్రమే కాదు, స్కోడా కూడా వచ్చే 2018 నుండి తమ వాహనాల మీద ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. వీటితో మరిన్ని ప్యాసింజర్ కార్లు మరియు వాణిజ్య వాహన తయారీ సంస్థల కూడా 2018 జనవరిలో ధరలు పెంచనున్నాయి.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో చాలా వరకు వాహన తయారీ సంస్థలు ధరల పెంపుకు సిద్దమవుతున్నాయి. ఇసుజుతో దాదాపు అన్ని కంపెనీల కార్ల ధరలకు రెక్కలు రానున్నాయి. మరికొన్ని వారాల్లో ఒక్కొక్కటిగా తమ వాహనాల మీద ధరల పెంపును అధికారికంగా ప్రకటించనున్నాయి.