ఇండియాలో తొలి తయారీ ప్లాంటును ప్రారంభించిన ఇంగ్లాండ్ కంపెనీ
ఇంగ్లాండ్కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ ఎమ్జి మోటార్ భారత్లో తమ తొలి ప్రొడక్షన్ ప్లాంటును ప్రారంభించింది.
ఇంగ్లాండ్కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ ఎమ్జి మోటార్ భారత్లో తమ తొలి ప్రొడక్షన్ ప్లాంటును ప్రారంభించింది. ప్రాథమిక పెట్టుబడి క్రింద సుమారుగా రెండు వేల కోట్ల రుపాయలు పెట్టుబడి పెట్టింది.

తొలి దశ క్రింద ఏడాదికి 80,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని రూపొందించింది. ఇండియాలో విడుదల కానున్న కొత్త మోడళ్లను పూర్తి స్థాయిలో ఆవిష్కరించి, తమ తొలి ఉత్పత్తిని 2019 నుండి ప్రారంభించింది.

గుజరాత్లోని ఈ ప్రొడక్షన్ ప్లాంటు 170 ఎకరాలలో విస్తరించి ఉంది. దీనిని 2019 నాటికి ఎమ్జి మోటార్ పూర్తి స్థాయిలో పునర్నిర్మించనుంది. ప్రస్తుతానికి 70 మంది ఉద్యోగులతో ప్రారంభమైన ఈ ప్లాంటు త్వరలో మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా చొరవతో మరిన్ని ఉద్యోగాలు కల్పించనుంది.
Recommended Video


నవారాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని దసరా పర్వదినాన పూజ కార్యక్రమంతో ఈ గ్రీన్ ఫీల్డ్ ప్లాంటును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్జి మోటార్ ఇండియా ఉద్యోగులతో పాటు అందరు ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎమ్జి మోటార్ ఇండియా ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరక్టర్ రాజీవ్ చబా మాట్లాడుతూ,"భారత్లో తమ తొలి ప్రొడక్షన్ ప్లాంటును ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మోరీస్ గ్యారేజెస్ బ్రాండ్(ఎమ్జి మోటార్) మరియు భారత్ మధ్య అవినాభావ సంభందం ఉందని తెలిపాడు.

ఎమ్జి మోటార్ ఇండియా 1924 లో ఇంగ్లాండులో కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు భారత్లో సుమారుగా 500 మంది కస్టమర్లను చేరుకున్నట్లు తెలిపాడు. భారత్లో విక్రయ కేంద్రాలు మరియు సర్వీస్ సెంటర్లు లేనప్పటికీ ఎమ్జి బ్రాండ్ కార్లను ఆదరించారని చెప్పుకొచ్చారు.

డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఎమ్జి మోటార్ సొంతం చేసుకున్నది గతంలో జనరల్ మోటార్స్ గుజరాత్లోని హలోల్లో నిర్మించింది. బ్రిటన్కు చెందిన ఎమ్జి మోటార్ 2019 నుండి తమ ఉత్పత్తులను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. హ్యాచ్బ్యాక్,సెడాన్ మరియు ఎస్యూవీ సెగ్మెంట్ మీద దృష్టి సారించనుంది.


Click it and Unblock the Notifications








