Just In
- 7 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 11 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 13 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 16 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వోక్స్వ్యాగన్ కూడా అదే బాటపట్టనుంది
జర్మన్ ప్యాసింజర్ కార్ల దిగ్గజం వోక్స్వ్యాగన్ వచ్చే జనవరి 2018 నుండి ఇండియన్ మార్కెట్లో విక్రయించే అన్ని మోడళ్ల మీద ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది.
జర్మన్ ప్యాసింజర్ కార్ల దిగ్గజం వోక్స్వ్యాగన్ వచ్చే జనవరి 2018 నుండి ఇండియన్ మార్కెట్లో విక్రయించే అన్ని మోడళ్ల మీద ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల పెంపు విషయంలో జపాన్ మరియు దేశీయ దిగ్గజాలు వరుసగా నిర్ణయం తీసుకుంటున్న తరుణంలో వోక్స్వ్యాగన్ కూడా తమ నిర్ణయాన్ని తెలిపింది.
మార్కెట్లో లభించే వివిధ వోక్స్వ్యాగన్ కార్ల మీద గరిష్టంగా రూ. 20,000 ల వరకు ధర పెరిగే అవకాశం ఉంది. సవరించబడిన కొత్త ధరలు జనవరి 1, 2018 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.
Recommended Video
ప్రస్తుతం వోక్స్వ్యాగన్ ఇండియా లైనప్లో పోలో, వెంటో, టిగువాన్ ఎస్యూవీ మరియు కొత్తగా విడుదల చేసిన పస్సాట్ సెడాన్ వంటి మోడళ్లు ఉన్నాయి.
అంతర్జాతీయంగా రుపాయి విలువ మారకం, దేశీయంగా పెట్టుబడి ఖర్చులు పెరగడం మరియు పలు ఆర్థికపరమైన అంశాల కారణంగా తమ కార్ల మీద ధరల పెంపు అనివార్యమైందని వోక్స్వ్యాగన్ చెప్పుకొచ్చింది.
ఈ మధ్యనే స్కోడా ఆటో కూడా ఇండియన్ మార్కెట్లో ఉన్న తమ అన్ని మోడళ్ల మీద జనవరి 2018 నుండి ధరలు పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీనితో పాటు, ఇసుజు, హోండా మోటార్స్, టయోటా మరియు ఫోర్డ్ వంటి కంపెనీలు కూడా తమ నిర్ణయాన్ని తెలిపాయి.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
కార్ల తయారీ కంపెనీలు ప్రతి ఏడాది చివరిలో పాత స్టాకును క్లియర్ చేసుకునేందుకు ఎవో కొన్ని ఆఫర్లు ప్రకటించి విక్రయించేస్తాయి. ఇలా ఆఫర్ల మీద నష్టపోయిన మొత్తాన్ని ఆ తరువాత ఏడాది అంటే జనవరి నెలలో కొన్ని సాకులు చెప్పి కార్ల ధరలను పెంచేస్తాయి. ఏదేమైనుప్పటికీ ఈ పద్దతి కొంత మంది కస్టమర్లకు మేలు చేకూర్చితే మరి కొంత నష్టాన్ని కలిగిస్తుంది.