Just In
- 1 hr ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 2 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- 4 hrs ago హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- 6 hrs ago బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
Don't Miss
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Movies Adivi Sesh: "అకీరాతో స్నేహం అలా కుదిరింది.. కచ్చితంగా అతడితో సినిమా చేస్తా"
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రత్యామ్నాయ ఇంధనాలకు భారత ప్రభుత్వ ప్రోత్సాహం
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇథనాల్తో సహా పలు ప్రత్యామ్నాయ ఇంధాలను విసృతంగా ప్రోత్సహించాలని భావిస్తోంది. పర్యావరణ కాలుష్యం మరియు ఉద్గారాలు విపరీతంగా పెరిగిపోతుండటంతో పర్యావరణ సమతుల్యం కోసం ఈ నిర్ణయ
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇథనాల్తో సహా పలు ప్రత్యామ్నాయ ఇంధాలను విసృతంగా ప్రోత్సహించాలని భావిస్తోంది. పర్యావరణ కాలుష్యం మరియు ఉద్గారాలు విపరీతంగా పెరిగిపోతుండటంతో పర్యావరణ సమతుల్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వాతావరణ కాలుష్యం పెచ్చుమీరిపోయింది. పరిశ్రమలు మరియు వాహనాల కారణంగా మానవ మనుగడకు ప్రాథమిక వనరు అయిన గాలి నాణ్యత దారుణంగా క్రిందకు పడిపోయింది. విపరీతమైన గాలి కాలుష్యం భవిష్యత్తులో నగర జనజీవనం మీద తీవ్ర దుష్ఫలితాలు చూపే అవకాశం ఉంది.
అయితే, ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించడం ద్వారా వాహనాల ద్వారా గాలి కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించలేకపోయినప్పటికీ, అవి వెదజల్లే ఉద్గారాలు కొద్ది మేరకు తగ్గుముఖం పడతాయి. అంతే కాకుండా, ఇలాంటి ఇంధనాల ఉత్పత్తి వాతావరణం మీద ఎలాంటి ప్రభావం చూపదు.
58వ ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ACMA) కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఇథనాల్ మరియు ఇతర ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడం పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇంధన సమస్యలకు "ఇథనాల్" చక్కటి పరిష్కారం అని పేర్కొన్నాడు.
తాజా నివేదిక ప్రకారం, భారతదేశంలో చక్కెర ఉత్పత్తి 60 లక్షల టన్నుల మిగులు ఉంది మరియు భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాంతో, ప్రభుత్వం ఇథనాల్ ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి చక్కర ఉత్పత్తి చేసే చెరకును ప్రాసెస్ చేసేందుకు మరింత దృష్టి సారించాలని ప్రభుత్వం భావిస్తోంది.
అంతే కాకుండా, చెరకు నుండి వచ్చే రసం ద్వారా సరాసరిగా ఇథానాల్ ఉత్పత్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అధిక మొత్తంలో ఇకో-ఫ్రెండ్లీ ఇంజన్లను ఉత్పత్తి చేయాలని 58 వ ACMA కార్యక్రమంలో పాల్గొన్న దిగ్గజ కార్ల తయారీ సంస్థల ప్రతినిధులకు నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు.
మరో పక్కన బయో ఇథనాల్ ఉత్పత్తి చేసేందుకు పత్తి మొక్కల కొమ్మలు, గోధుమలు లేదా బియ్యాన్ని ఉపయోగిస్తున్నారు. బయోమాస్ నుండి ఇథనాల్ ఉత్పత్తి చేసేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ పలు అధ్యయనాలు నిర్వహిస్తోంది. ప్రత్యామ్నాయ ఇంధనాలు విజయం సాధిస్తే, సాధారణ ఇంధనాల కంటే వీటి ఉత్పత్తి ఖర్చు మరియు తుది ధరలు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది.