భారతదేశంలో ప్రారంభం కానున్న మిత్సుబిషి ఎక్లిప్స్ క్రాస్...ఎప్పుడంటే...!
మిత్సుబిషి ఇండియా భారతీయ మార్కెట్ లో పునరాగమనం చేయాలనీ సిద్ధం అవుతోంది,ఈ జపాన్ ఆటో దిగ్గజం ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే ఉన్న గ్లోబల్ పోర్టల్స్ నుంచి కొన్ని నమూనాలను తీసుకురావాలని అనుకొంటోంది.

ఇక్కడకు తెస్తున్న మొట్టమొదటిది మిత్సుబిషి ఎక్లిప్స్ క్రాస్,ఈ వాహనం 2020 లో ప్రారంభమవుతుందని తెలిసింది. 2020 నాటికి మిత్సుబిషి ఎక్లిప్స్ క్రాస్ భారతదేశంలో ప్రవేశిస్తుంది.

మిత్సుబిషి రెండు సంవత్సరాల క్రితం మిత్సుబిషి యొక్క రెనాల్ట్ నిస్సాన్ కొనుగోలు చేసిన తొలి వాహనం మిత్సుబిషి,నిస్సాన్ జపాన్ కారు కంపెనీలో 34 శాతం వాటాను కొనుగోలు చేసింది.

మిత్సుబిషి ఎక్లిప్స్ క్రాస్ కంపెని యొక్క ఎస్.వి.వి శ్రేణిలో నాల్గవ మోడల్గా ఉంది,ప్రస్తుతం ఇందులో అవుట్ల్యాండర్, మాంటెరో మరియు పజెరో స్పోర్ట్ ఉన్నాయి.

సంస్థ ప్రస్తుతం అవుట్ లాండర్ మరియు పజెరో స్పోర్ట్ యొక్క సికెడి వస్తువులని దిగుమతి చేస్తుంది,తమిళనాడులో హిందూస్తాన్ మోటార్స్ వద్ద దీనిని ఏర్పాటు చేస్తుంది అని తెలిసింది.

మిత్సుబిషి భారత ప్రభుత్వం నిర్దేశించిన కొత్త భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఎక్లిప్స్ క్రాస్ యొక్క భద్రతా ప్యాకేజీని చేయాల్సి ఉంటుంది.

దీని ధర రూ .15 నుండి 22 లక్షల మధ్య వుంటుంది.అలాగే దీనిపై జీప్ కంపాస్, హ్యుందాయ్ టక్సన్, టాటా హెచ్ఎన్ఎక్స్, మహీంద్రా ఎక్స్ యూవి 500 లతో పోటీపడనుంది.

మిత్సుబిషి ఎక్లిప్స్ క్రాస్ పై-ది-మాస్-మార్కెట్ సెగ్మెంట్లో స్థాపించబడుతుంది. క్రాస్ఓవర్ శైలి ఎక్స్ యూవి తో మిత్సుబిషి కోల్పోయిన కీర్తి తిరిగి తెచ్చుకోవచ్చు అని చెప్పవచ్చును.

మిత్సుబిషి దేశంలో కొన్ని ఐకానిక్ కార్లను అందించింది, వీటిలో మిత్సుబిషి లాన్సర్ మరియు మిత్సుబిషి పజెరో ఎస్ఎఫ్ఎక్స్ లు ఉన్నాయి.

ఇప్పటికైనా ఎక్లిప్స్ క్రాస్ తో దేశంలో ఈ సంస్థ తన అదృష్టాన్ని పునరుద్ధరించగలదో లేదో చూడాలంటే 2020 వరకు వేచి చూడాలి.


Click it and Unblock the Notifications








